అన్వేషించండి

Rapaka Varaprasad: 'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ

Andhra News: త్వరలోనే తాను వైసీపీని వీడనున్నట్లు రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Ex MLA Rapaka Varaprasad Will Resign To Ysrcp: వైసీపీని వీడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కోనసీమ జిల్లా (Konaseema District) రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు (Rapaka Varaprasad Rao) తెలిపారు. ఆ పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. కత్తిమండలోని తన నివాసంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడిన తనను వైసీపీ అవమానించిందని.. రాజోలులో ఎంత కష్టపడి పనిచేసినా తనకు టిక్కెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 'పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డిని, నన్ను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తికి టికెట్ ఇచ్చి నన్ను అవమానించారు. వైసీపీ వాళ్లు పార్టీ మీటింగ్‌కు రమ్మని పిలిచినా నేను రాను అని చెప్పేశాను. ఇష్టం లేకపోయినా.. ఓడిపోతానని తెలిసినా పెద్దల సలహా మేరకు ఎంపీగా పోటీ చేశా. త్వరలో మరో పార్టీలో చేరుతా. అభిమానులు, శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటాను.' అని రాపాక స్పష్టం చేశారు.

జనసేనలో చేరుతారా.?

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున రాజులులో పోటీ చేసి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక నిలిచారు. ఆ టైంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్ల (గాజువాక, భీమవరం) ఓడిపోయారు. రాపాక సమీప వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై 814 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే గెలిచిన తర్వాత ఆయన అప్పటి అధికార వైసీపీతో సన్నిహితంగా మెలిగారు. జనసేనాని పవన్ తనకు అపాయింట్‌మెంట్ సరిగ్గా ఇవ్వడం లేదని.. తన గెలుపునకు స్థానికంగా తను చేసిన ఎలక్షనీరింగ్ కారణం అంటూ చెప్పేవారు. సొంత పార్టీపైనే విమర్శలు చేసి కొంతకాలానికి వైసీపీ గూటికి చేరారు. జనసేన పార్టీ బలపడే పార్టీ కాదని.. ఏదా గాలివాటంగా తాను ఒక్కడినే గెలిచానంటూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి.

అనంతరం 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్న రాపాక ప్రస్తుతం మళ్లీ కూటమి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఏకంగా మలికిపురంలో జరిగిన జనసేన సమావేశానికి ఆయన హాజరు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. ప్రస్తుత రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ను కలిసి కొన్ని కీలక విషయాలు చర్చించినట్లు సమాచారం.

అసలు రీజన్ ఇదే..

అయితే, తనతో రాపాక చర్చించడంపై రాజోలు ప్రస్తుత ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ స్పందించారు. ఇందులో రాజకీయ కోణం లేదని.. మలికిపురం కాలేజీలో పని చేస్తోన్న 25 మంది అధ్యాపకుల జీతాల విషయంలో చర్చించేందుకే రాపాక తనను కలిశారని చెప్పారు. అయితే, స్థానికంగా మాత్రం రాపాక జనసేనలో చేరేందుకు పావులు కదుపుతున్నారంటూ అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. మరి రాపాక జనసేనలో తిరిగి చేరుతారా.?, ఆయన చేరికకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.?. లేదా వేరే పార్టీ వైపు చూస్తున్నారా.? అనేది తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే.

Also Read: Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget