అన్వేషించండి

Hyderabad Politics : చంపుతారని భయమేస్తోందన్న అక్బరుద్దీన్ - రెచ్చగొడుతున్నారని రాజాసింగ్ ఫైర్ !

Akbaruddin : అక్బరుద్దీన్, రాజాసింగ్ మధ్య రాజకీయ విమర్శలు పెరుగుతున్నాయి. తమ సోదరుల్ని చంపేస్తారేమోనని అక్బరుద్దీన్ అంటే దానికి రాజాసింగ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

Akbaruddin Vs Raja Singh : ఎంఐఎం కీలక నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో పరిస్థితులు ప్రస్తుతం దారుణంగా ఉన్నాయన్నారు. మా ఇద్దరు బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు. జైలులో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి.. లేదా గన్‌తో కాల్చి మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోందన్నారు. అయితే తాము ఇలాంటి వాటికి భయపడబోమన్నారు. హైదరాబాద్‌లో తాము చాలా బలంగా ఉన్నామని.. అందుకే మమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఎవరు ఎంత ప్రయత్నించినా గెలిచేది తామే అని అక్బరుద్దీన్ దీమా వ్యక్తం చేశారు. అయితే ఇటీవల అసదుద్దీన్ మాట్లాడుతూ.. కొన్ని దుష్టశక్తులు చంపుతామని బెదిరిస్తున్నారని.. కానీ తాను అంత ఈజీగా వెళ్లిపోయేవాడిని కాదన్నారు.                       

తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కౌంటర్ ఇచ్చారు. ముస్లింలకు రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ ప్రచారం ఉందని మండిపడ్డారాయన. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల కాళ్లు పట్టుకునే చరిత్ర ఎంఐఎం పార్టీదన్నారు. భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని.. అప్పుడు ఓవైసీ బ్రదర్స్‌కు ఎక్కడికి పంపించాలనేది డిసైడ్ చేస్తామని హాట్ కామెంట్స్ చేశారు .                                       

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రచారంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఈ సారి హైదరాబాద్ లో బీజేపీ నుంచి గట్ిట పోటీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ ఈ సారి సంప్రదాయ రాజకీయ నాయకుల్ని కాకుండా ఓ మహిళా అభ్యర్థిని నిలబెట్టింది. కొంపెల్ల మాధవీలత అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుండి  పాతబస్తీలోనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఆమె హిందూత్వ స్టైల్ ప్రసంగాలు .. హిందూ ఓట్లను ఏకం చేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరో వైపు బోగస్ ఓట్ల అంశం కూడా తెరపైకి వచ్చారు.                                  

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆరు  లక్షల బోగస్ ఓట్లు ఉంటాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ సారి బోగస్ ఓట్లు వేయకుండా కట్టడి చేస్తే.. మజ్లిస్ కు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో ఓటింగ్ కూడా చాలా  తక్కువగా నమోదవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో హిందూ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్దగా బయటకు రారు. కానీ వారందరూ వచ్చి ఓటు  హక్కు వినియోగించుకునేలా మాధవీలత ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీ కూడా మాధవీలతను ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడినందుకు అభినందించారు. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ సారి ఓవైసీకి గట్టి పోటీ ఉంటుందని అనుకుంటున్న సమయంలో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయం ప్రారంభించారు. 

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
Sonam Wangchuk vs Anna Hazare: వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష.. పట్టించుకోని జెన్-జీ - అన్నా హజారేలా ఎందుకు కదిలించలేకపోతున్నారు ?
వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష.. పట్టించుకోని జెన్-జీ - అన్నా హజారేలా ఎందుకు కదిలించలేకపోతున్నారు ?
Chandrababu Naidu Cases: పేకమేడల్లా కూలుతున్న బాబుపై కేసులు - వైసీపీ లీగల్ డిఫెన్స్ ఎందుకు ఫెయిలైంది? భవిష్యత్తులో తిరగదోడటం సాధ్యమేనా?
పేకమేడల్లా కూలుతున్న బాబుపై కేసులు - వైసీపీ లీగల్ డిఫెన్స్ ఎందుకు ఫెయిలైంది? భవిష్యత్తులో తిరగదోడటం సాధ్యమేనా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget