అన్వేషించండి

YSRCP News: నర్సరావుపేట అభ్యర్థి నాగార్జున యాదవేనా ? లావు రాజీనామాతో లైన్ క్లియర్ అయిందా ? 

Narsaraopet YSRCP Mp Candidate: లావు శ్రీకృష్ణదేవరాయలు బయటకు వెళ్లిపోవడంతో... మరో నేతకు నర్సరావుపేట సీటు కన్ఫామ్ అయిందా ? సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

YSRCP Parliament Candidates: నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Krishnadevarayalu) ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ సీటు ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. లావు శ్రీకృష్ణదేవరాయలు బయటకు వెళ్లిపోవడంతో... మరో యువనేతకు నర్సరావుపేట సీటు కన్ఫామ్ అయిందా ? నమ్మినబంటుగా ఉన్న ఆ నాయకుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నర్సరావుపేట పార్లమెంట్ నుంచి వచ్చే ఎన్నికల్లో యనమల సాయి నాగార్జున యాదవ్ (Yanamala Sai Nagarjuna yadav ) పోటీ చేస్తారని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నాడు-నేడు తీరును పర్యవేక్షించడానికి... ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. పాఠశాల విద్యా శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యలో కార్యకలాపాలను కొనసాగిస్తోంది. గతేడాది యనమల సాయి నాగార్జున యాదవ్ ను ఈ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా నియమించింది. 

సీఎం జగన్ కు నమ్మినబంటు నాగార్జున

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం చాలా కీలకం. ఈ లోక్ సభ సీటులో ఎలాగైనా విజయం సాధించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే సిట్టింగ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకు సీటు నిరాకరించారు. ఆయనకు గుంటూరు ఇస్తామని చెప్పడంతో పార్టీని వీడారు. నర్సరావుపేట స్థానం నుంచి యనమల సాయి నాగార్జున యాదవ్ ను బరిలోకి దించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీసీ ఓటర్ల జనాభా ఎక్కువగా ఉంది. అయితే పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఓసీలు పోటీ చేస్తున్నారు. దీనికి చెక్ పెడుతూ...బీసీ సామాజిక వర్గానికి నాగార్జున యాదవ్ కు టికెట్ కన్ఫాం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తే...వాటికి కౌంటర్ ఇవ్వడంలో నాగార్జున యాదవ్ ముందుంటారు. కొన్ని సమయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి ఎలా చెబితే అలా వింటారు. అందుకే నాగార్జున యాదవ్ ను నర్సరావుపేట నుంచి బరిలో దించాలని సీఎం భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గతేడాది నాగార్జున యాదవ్ వివాహానికి వెళ్లి ఆశీర్వదించారు. 

బీసీలకు ప్రాధాన్యత కల్పించాలన్న లక్ష్యంతో...

వయసులో చాలా చిన్నవాడైనప్పటికీ.... మంచి వాగ్ధాటి ఉన్న నేతగా జగన్‌ దృష్టిలో పడ్డారు నాగార్జున యాదవ్‌. గుంటూరుకు చెందిన ఆయన...పీహెచ్‌డీ చేశారు. తల్లిదండ్రుల తరఫు బంధువులు నరసరావుపేట లోక్‌ సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నారు. యాదవుల ఓట్లు కూడా భారీగా ఉండటంతోనే ఎంపీ స్థానానికి నాగార్జున యాదవ్ అయితే బాగుంటుందని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల లెక్కలు వేసుకున్న తర్వాతే...బీసీలకు సీటు కన్ఫాం చేసినట్లు తెలుస్తోంది. దీని తోడు బీసీలకు ప్రాధాన్యత కల్పించే ఉద్దేశంతో నరసరావుపేట స్థానాన్ని అతనికి కేటాయించాలని జగన్‌ నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీనిపై నాగార్జున యాదవ్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుగానే ప్రిపేర్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం

వీడియోలు

Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget