అన్వేషించండి

KCR : బీజేపీ ప్రభుత్వం పోవాల్సిందే - కశ్మీర్ ఫైల్స్ వదిలి పెట్టి ప్రజాసమస్యలు చూడాలి : కేసీఆర్

బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా పోవాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ మరింత కాలం ఉంటే దిశం మరింత దిగజారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా పోవాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.  టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ పై విరుచుకుపడ్డారు. నాలుగు రాష్ట్రాల్లో సాంకేతికంగా గెలిచామని బీజేపీ అనుకోవచ్చు కానీ.. బలం తగ్గిపోయిందన్నారు .బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడిచిపోయింది.   యూపీఏ బాగాలేదని ప్రజలు తీసేసి బీజేపీకి అధికారం ఇస్తే ఇప్పుడు పరిస్థితులు మరింతగా దిగజారాయి. జీడీపీ భారీగా పడిపోయింది. నిరుద్యోగిత పెరిగిపోయింది.  మాకు ఇంతే వస్తుంది ఇంతకు మించి చేతకాదని చెప్పకనే చెప్పారని కేసీఆర్ తేల్చేశారు. 

కశ్మీర్ ఫైల్స్‌తో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు ! 

 సోషల్ మీడియా ద్వారా  ది కశ్మీర్‌ ఫైల్స్‌ తో దుష్ప్రచారం నిర్వహిస్తున్నారని కేసీఆర్ విమర్సించారు.  పండిట్స్‌ కూడా దీన్ని హర్షించడం లేదన్నారు. తమకు జరిగిందాన్ని ఓట్లుగా మారుస్తున్నారని... ఇలాంటివి తెలంగాణలో సాధ్యం కావని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి విచ్ఛినమైన స్లోగన్స్‌ తీసుకోలేదనిగుర్తుచేశాు. మంచి వాతావరణం ఉంటే కదా ఐటీ లాంటివి వృద్ధి అయ్యేదని ప్రశ్నించారు. కరోనా, ఉక్రెయిన్ వంటి విషయాల్లో కేంద్రం ఘోరంగా విఫలమయిందన్నారు. హ్యాపీ ఇండెక్స్‌లో భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే తక్కువగా ఉండటం ఘోరం కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. నిరుద్యోగ ర్యాంకింగ్‌లో సిరియా కంటే కింద ఉన్నామన్నారు.  బీజేపీ  తీసుకొచ్చిన దుర్మార్గాలను, కశ్మీర్ ఫైల్స్‌ లాంటి దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నిర్ణయించామని కేసీఆర్ ప్రకటించారు. 

ఇచ్చిన హామీలను బీజేపీ నిలబెట్టుకోలేదు ! 

బీజేపీ ఇచ్చిన హామీలను  ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని కేసీఆర్ విమర్శించారు. రిజర్వేషన్ల వ్యవహారంలో యాభైశాతం కంటే ఎక్కువ వద్దని ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అందులో వెసులుబాటు ఉంది. ఏదైనా రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితి వస్తే మార్చుకోవచ్చని చెప్పింది. శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించాం. గిరిజన రిజర్వేషన్ పెంచుకోవాలని పంపించాం. ఇప్పటి వరకు ఉలుకు పలుకూ లేదు. ఎస్సీ వర్గీకరణలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించాం. దానిపై కూడా అతీ గతీ లేదు. బీసీల కులగణన చేయమని చెబితే పట్టించుకోలేదు.  ఇదే ప్రభుత్వం కొనసాగితే దేశం మరింత దిగజారుతుందనికేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. 

  చేతులెత్తి వేడుకుంటున్నాం.. తెలంగాణతో పెట్టుకోండి !

చేతులెత్తి సమస్కరించి ప్రధానిని వేడుకుంటున్నాం. దయచేసి తెలంగాణ ప్రజలతో పెట్టుకోకండి... మీరు మాయామశ్చింద్ర చేస్తామని భ్రమలో ఉండొద్దని ప్రధాని మోదీకి కేసీఆర్ సూచించారు.  పంజాబ్‌కు అవలంభించే విధానం తెలంగాణకు అమలు చేయాలన్నారు.  మెలికలు పెడితే మాత్రం తెలంగాణ ఆగ్రహానికి గురి అవుతారని హెచ్చరించారు.  దేశ ఆహార భద్రత విషయంలో రాజ్యాంగ బద్దమైన విధి నుంచి ఎస్కేప్ కావద్దు. కొన్నిసార్లు ఎక్కువ రావచ్చు. ఇంకోసారి కరవో కాటకమో వస్తే దేశానికి అన్నం పెట్టే స్థితిలో ఉండాలన్నారు. లేకుంటే ఏ దేశం కూడా భారత్‌ దేశానికి వారం అన్నం పెట్టే పరిస్థితి లేదన్నారు. దీన్ని అధిగమించేందుకు బఫర్‌ స్టాక్‌ పెట్టుకోవాలని సూచించారు.   అన్ని రాష్ట్రాల సీఎంలను పిలవండి మాట్లాడాలని.. దాని కోసం చేయాల్సిన హెల్ప్ మేం కూడా చేస్తామని కేసీఆర్ సూచించారు. 

అవసరమైతే ఢిల్లీ వెళ్లి ఉద్యమాలు !

జాతీయ స్థాయిలో ధాన్య సేకరణ విధానం ఉండాలి. దీని వల్ల అందరికీ న్యాయం జరుగుతుంది. అలా చేయకుంటేే మాత్రం అనేక పోరాటాల రూపంలో ఉద్యమం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.  అవసరమైతే దిల్లీ వెళ్లి ఉద్యమాలు చేస్తామన్నారు. ఇటీవల కిసాన్ ఉద్యమ నేతలు కలిశారని జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు రాజ్యాంగ బద్ధమైన రక్షణ లేదు. ఇది ఇప్పుడు అవసరం వచ్చింది. మా పార్టీ తరఫున దీన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎంఎస్‌పీ, సేకరణ, ఇలా ప్రతి దానికి రాజ్యాంగ రక్షణ కావాలి. మీదే నిజమైనా రైతు ప్రభుత్వమైతే కచ్చితంగా రైతుకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
YSRCP Regional Politics AP: వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
Nara Lokesh Praises Pawan Kalyan : పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget