అన్వేషించండి

TG TET Results 2025: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!

TG TET Results 2025: జనవరిలో జరిగిన తెలంగాణ టెట్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మున్సిపాలిటీ ఎన్నికల వేళ ఫలితాలు ఆలస్యమవుతాయని ‌అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

TG TET Results 2025: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిని ఆశించే వేల మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్ష ఫలితాలను, అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను విద్యాశాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఉపాధ్యాయ నియామకాల్లో కీలకమైన ఈ పరీక్షా ఫలితాల కోసం అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఫలితాలు ఎలా చూసుకోవాలి? 

టెట్‌కు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను పాఠశాల విద్యాశాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌  https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/లో చూసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి తమ మార్కులను జాబితాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

ఈ ఏడాది నిర్వహించిన టెట్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,37, 754 మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,95, 181 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 82 శాతం మంది అభ్యర్థులు తమ అధృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ లెక్కలు చూస్తే గతంతో పోలిస్తే అభ్యర్థుల హాజరు శాతం పెరిగిందని విద్యాశాఖ చెబుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువు సాధించాలనే పట్టుదలతో అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ పడ్డారు. 

ఈసారి టెట్‌ పరీక్షలో ఇప్పటికే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సర్వీస్ టీచర్స్ కూడా హాజరయ్యారు. ఇన్‌సర్వీస్‌లో ఉన్న వాళ్లకి కూడా టెట్ తప్పనిసరి చేయడంలో వాళ్లంతా పరీక్ష రాయాల్సి వచ్చింది. ఇన్‌సర్వీస్ టీచర్లు రికార్డుల స్థాయిలో 90 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. 

టెట్ పరీక్షలు జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభమై జనవరి 20న ముగిశాయి. పరీక్షలు ముగిసిన తర్వాత ఫలితాలు విడుదల కూడా ఫిబ్రవరి 10- 16 మధ్య విడుదల చేయాలని అధికారులు ముందుగానే నిర్ణయించారు. ఆ లెక్క ప్రకారం పదో తేదీనే ఫలితాలు ప్రకటించారు. 

టెట్ అర్హత ప్రాధాన్యం ఇదే 

తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష రాయాలంటే టెట్ అర్హత సాధించడం తప్పనిసరి. టెట్‌లో సాధించిన మార్కలకు ఉపాధ్యాయ నియామకాల్లో ఇరవై శాతం వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి కేవలం అర్హత సాధించడమే కాకుండా, మెరుగైన స్కోరు సాధించడం అభ్యర్థుల భవిష్యత్‌కు అత్యంత కీలకం. 

ప్రస్తుతం విడుదలైన ఫలితాలు ఆధారంగా అర్హత సాధించిన వారు తదుపరి వచ్చే ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ల కోసం సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఫలితాల్లో ఏవైనా సాంకేతిక లోపాలు ఉంటే లేదా మార్కుల విషయంోల సందేహాలు ఉంటే అభ్యర్థులు విద్యాశాఖ హెల్ప్‌లైన్ నెంబర్‌ను సంప్రదించవచ్చు. 

Frequently Asked Questions

TG TET ఫలితాలను ఎక్కడ చూసుకోవచ్చు?

TG TET ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌  https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/ లో చూసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి, హాల్‌టికెట్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది.

ఈ ఏడాది TG TET పరీక్షకు ఎంత మంది హాజరయ్యారు?

ఈ ఏడాది TG TET పరీక్షకు మొత్తం 1,95, 181 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇది సుమారు 82 శాతం హాజరు శాతం.

TG TET అర్హత సాధించడం ఉపాధ్యాయ నియామకాలకు ఎంత ముఖ్యం?

తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష రాయడానికి TG TET అర్హత తప్పనిసరి. టెట్‌లో సాధించిన మార్కులకు నియామకాల్లో 20% వెయిటేజ్ ఉంటుంది.

ఫలితాల్లో ఏవైనా సందేహాలు ఉంటే ఎవరిని సంప్రదించాలి?

ఫలితాల్లో సాంకేతిక లోపాలు లేదా మార్కుల విషయంలో సందేహాలు ఉంటే, అభ్యర్థులు విద్యాశాఖ హెల్ప్‌లైన్ నెంబర్‌ను సంప్రదించవచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget