BCCI Central Contract | కోహ్లీ, రోహిత్ గ్రేడ్ తగ్గింపు
భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI Central Contract ) వచ్చే సీజన్ కోసం ప్లేయర్స్ కాంట్రాక్ట్ జాబితా విడుదల చేసింది. టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మాన్ గిల్కు ( Shubman Gill ) పదోన్నతి కల్పించగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ( Virat Kohli ) కాంట్రాక్ట్ను మార్చేశారు. రవీంద్ర జడేజా ( Ravindra Jadeja ), జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) అత్యున్నత గ్రేడ్లో ఉన్నారు. గత సీజన్తో పోలిస్తే, BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి అనేక మంది ప్లేయర్స్ ను మినహాయించింది.
2025-26 సీజన్ కోసం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది. మెన్ టీం నుంచి ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే గ్రేడ్ A లో ఉంచారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఏ గ్రేడ్ నుంచి తొలగించి గ్రేడ్ B లోకి చేర్చారు.
BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో లేని పేరు మహ్మద్ షమీ ( Mohammed Shami ). ఇటీవల T20 జట్టులోకి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) కూడా జాబితాలో లేడు. గ్రేడ్ Aలో శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. గ్రేడ్ B లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ , KL రాహుల్, సుందర్, సిరాజ్, హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ), రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. గ్రేడ్ A లో ఉన్న వారికీ సంవత్సరానికి 5 కోట్లు, గ్రేడ్ B లో ఉన్న వారికీ 3 కోట్లు లభించనున్నాయి.























