అన్వేషించండి

Muddaraboina: 'టీడీపీకి రాజీనామా చేస్తున్నా, వైసీపీలో చేరలేదు' - త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు

AP Politics: టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు రాజీనామా చేశారు. నూజివీడు పార్టీ ఇంఛార్జీగా కొలుసు పార్థసారథిని నియమించిన నేపథ్యంలో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు.

Muddaraboina Venkateswarao Resigned To Tdp: ఎన్నికల వేళ టీడీపీకి షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని టీడీపీ నూజివీడు (Nuzividu) నియోజకవర్గం ఇంఛార్జీగా నియమించడంతో.. మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు (Muddaraboina Venkateswararao) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలో తన కార్యాలయంలో ఉన్న టీడీపీ పోస్టర్లను తొలగించారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమక్షంలో ప్రకటించారు. అయితే, తాను వైసీపీలోనూ చేరలేదని.. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. పార్థసారథి ఇంకా టీడీపీ కండువా కప్పుకోకపోయినా.. పార్టీ నూజివీడు ఇంఛార్జీగా ప్రకటించారని.. మీకు, మీ పార్టీకి ఓ నమస్కారం అంటూ మండిపడ్డారు.

'పని చేసినా గుర్తింపు లేదు'

ఉరిశిక్ష వేసే ముందు కోర్టులో న్యాయమూర్తి ఆఖరి కోరికను అడుగుతారని.. కానీ కనీసం పార్టీ అధిష్టానం తనను ఏమీ అడగలేదని ముద్దరబోయిన ఆవేదన వ్యక్తం చేశారు. 'వైసీపీలో చేరినట్లు నేనేమైనా చెప్పానా.?. సీఎంవోలో ముఖ్యమంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించాను. సీఎంను ఎవరైనా కలవొచ్చు కదా?. పదేళ్లు నన్ను వాడుకొని బయటకు గెంటేశారు. నూజివీడులో చచ్చిపోయిన పార్టీని బతికించాను. పార్టీ ఏ పిలుపు ఇచ్చినా పని చేశాను. పార్టీ కష్టకాలంలో నన్ను పిలిచి నూజివీడులో పోటీ చేయాలని యనమల అడిగారు. నా ఇంటికి మనిషిని పంపించి మరీ సీటిచ్చారు. మరి ఈ రోజు నన్ను ఎందుకు తీసేశారో చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.' అని వాపోయారు.

కాగా, 2024 ఎన్నికల్లో పెనమలూరు టికెట్ కొలుసు పార్థసారథికి ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించడంతో ఆయన సైకిల్ వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో పెనమలూరు నుంచి పార్థసారథి అభ్యర్థిత్వంపై సర్వే సైతం నిర్వహించారు. అయితే, ఇక్కడి టీడీపీ ఇంఛార్జ్ బోడె ప్రసాద్ వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలో పార్థసారథిని నూజివీడు నుంచి బరిలో దింపాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం సాగుతూ వచ్చింది. అందుకు అనుగుణంగానే పార్థసారథి సైతం టీడీపీ కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తన అనుచరుల సమావేశంలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆయన సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలవడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ నెలకొంది. 

టీడీపీ ఇంఛార్జీగా పార్థసారథి 

ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సీఎం జగన్ ను కలిసిన నేపథ్యంలో.. కొలుసు పార్థసారథిని నూజివీడు టీడీపీ ఇంఛార్జీగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో వెనువెంటనే ముద్దరబోయిన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. నాలుగైదు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అయితే, వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కీలక స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలకు అవి దక్కకపోవడంతో పార్టీలు మారుతున్నారు. దీంతో ఈసారి పొలిటికల్ వార్ అత్యంత ఆసక్తికరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: Pawan Kalyan: 'వస్తే ఒకటి, రాకపోతే రెండు నమస్కారాలు' - జనసేనాని పవన్ కల్యాణ్ పై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
NEET PG 2025 Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
Embed widget