అన్వేషించండి

YS Sharmila : ఏపీలో మాఫియా రాజ్యం - కర్నూలులో షర్మిల ఫైర్

Andhra News : ఏపీలో మాఫియా రాజ్యం నడుస్తోందని కర్నూలులో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. న్యాయ్ యాత్రలో భాగంగా విస్తృతంగా ప్రచారం చేశారు.

Andhra  Politics :  ఏపీ లో మద్యం మాఫియా,మట్టి మాఫీయా,ఇసుక మాఫియా దోచుకుంటుందని షర్మిల ఆరోపించారు. ఎమ్మెల్యేలకు అభివృద్ధి మీద చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. ఆలూరులో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం ఇక్కడ చెత్త తీసి వేరే చోటకి పంపారని విమర్శలు చేశారు. కాంగ్రెస్ న్యాయాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.  ఆలూరులో  ఫెయిల్ అయిన వ్యక్తి ఇంకో దగ్గర ఎలా పనికి వస్తాడన్నారు. కార్మిక శాఖ మంత్రిగా ఒక్క ఉద్యోగం ఇచ్చారా ? అని వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. 
 
రాష్ట్రంను మద్యం, మట్టి, ఇసుక మాఫియా దోచుకుంటుందని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు. ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంకు ప్రత్యేక హోదా ను తెస్తామన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. ప్రతి పేదింటి మహిళకు కుటుంబం గడిచేందుకు నెలకి రూ .8230 చొప్పున ఏడాదికి లక్ష, ఐదేళ్లకు ఐదు లక్షలు ఇస్తామన్నారు.ఉపాధి హామీ కూలీలకు రోజుకి రూ.400 కూలీ వచ్చేలా పనులు కల్పిస్తామన్నారు. పేద విద్యార్థులకు కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యి అందించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు.

 వేదవతి ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఐదేళ్ల క్రితం హామీ ఇచ్చారని, , కానీ ఈ ఐదేళ్లలో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒక్క అడుగు ముందుకు పడింది లేదన్నారు. 2008లో వేదవతికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ శిలాఫలకం వేసిన విషయంలో ఆమె గుర్తు చేశారు. అదే ప్రాజెక్ట్ కి జగన్ మరో శిలాఫలకం వేశారని చురకలు అంటించారు. జగన్ ప్రభుత్వం శిలాఫలకం వేసే కన్నా .. ఇక్కడ ప్రాజెక్ట్ కట్టి ఉంటే సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు వచ్చి ఉండేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో రైతు కుటుంబాలు వీటివల్ల బాగుపడేవన్నారు. ఆలూరు నియోజక వర్గంలో టమాటా ఎక్కువ పండుతుంది, రైతుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారు.. కానీ నేటి వరకు కట్టకపోవడంపై షర్మిల మండిపడ్డారు. ఇది టమోటా రైతులను వంచించడమే అన్నారు.
 
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ ప్రభుత్వంకు కనబడటం లేదన్నారు. ధర ల స్థిరీకరణ నిధి అని చెప్పి ఈ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని షర్మిల నిప్పులు చెరిగారు. రైతును దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ రాజును చేశాడు, కానీ నేడు రైతు అప్పుల పాలు అయ్యారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు కారణం నీటి ఎందుకు కారణం నేటి ప్రభుత్వ అసమర్థ పాలననే అన్నారు. మూర్ఖులకు, అహంకారులకు ఓటు వేయ వద్దని ఆమె ప్రజలను కోరారు. మీ ఓటు వృధా కానివ్వొద్దని ప్రజలకు ఆమె విన్నవించారు. వైసీపీకి ఓటు వేస్తే డ్రైనేజీ లో వేసినట్లే, ఈ సారి ఆలోచన చేసి ఓటు వేయండని, కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం.. హోదా ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న విషయాన్ని గుర్తించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ఏడాదిలోనే 2.25 లక్షల మంది యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆలూరు కాంగ్రెస్ అభ్యర్థి, అరికట్ల నవీన్ కిషోర్, కర్నూలు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి రాంపులయ్య యాదవ్ ను గెలిపించాలని కోరారు .

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MLAs Disqualification Petitions: దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
West Bengal CM Mamata Banerjee: ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
Americans Migrating Abroad:
"అమెరికాలో ఉండలేం" అగ్రరాజ్యాన్ని వదిలి వలస వెళ్లిపోతున్న అమెరికన్లు!
Embed widget