అన్వేషించండి

KCR Silent Again : ముంచుకొస్తున్న ఎన్నికలు - నింపాదిగా కేసీఆర్ ! ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ వ్యూహాలేంటి ?

ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ బహిరంగసభలు ఎప్పుడు ?ఏపీ, ఒడిషాల్లో అధ్యక్షుల్ని ఎంపిక చేసినా దూకుడేది ?కర్ణాటకలో ఎన్నికల ప్రారంభం కాని బీఆర్ఎస్ ప్రచారం ?కేసీఆర్ మౌనం వెనుక వ్యూహం ఏమిటి ?


KCR Silent Again : భారత రాష్ట్ర సమితి అధినేత  కేసీఆర్ మరోసారి సైలెంట్ అయ్యారు. గత వారం పది రోజుల నుంచి బీఆర్ఎస్ తరపున ఎలాంటి అప్ డేట్స్ ఉండటం లేదు. ఇతర రాష్ట్రాల నేతలూ కలవడంలేదు. కేసీఆర్ కూడా ఎలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహించడం లేదు. ఇతర రాష్ట్రాల్లో బహిరంగసభల ప్రస్తావన కూడా పెద్దగా ఉండటం లేదు. ఫిబ్రవరిలో వేగంగా బడ్జెట్ సమావేశాలు ముగించిన తర్వాత ఒడిషాలో బహిరంగసభ పెట్టాలనుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ అంశంపై స్పష్టత లేదు. కేసీఆర్ నెలాఖరులో ఢిల్లీకి వెళ్తారని గతంలో బీఆర్ఎస్ వర్గాలు చెప్పినా పర్యటనపై స్పష్టత లేకుండా పోయంది. 

ఇతర రాష్ట్రాల్లో ఆఫీసులు,  బహిరంగసభలపై నింపాదిగా కేసీఆర్ ! 

సీఎం కేసీఆర్ తన పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 17వ తేదీ నుంచి జాతీయ రాజకీయాల్లో ఓ ఊపు తీసుకురావాలనుకున్నారు. అందుకే వేగంగా బడ్జెట్ ప్రక్రియను కూడా అసెంబ్లీలో పూర్తి చేశారు. అయితే కారణం ఏమిటో స్పష్టత లేదు కానీ.. సచివాలయ ప్రారంభోత్సవాన్ని బహిరంగసభను వాయిదా వేశారు. ఎన్నికల కోడ్ అడ్డంకి అనే కారణం చెప్పారు కానీ.. అది ఏ మాత్రం నమ్మశక్యంగా లేదన్న వాదన రాజకీయవర్గాల్లో ఉంది. ఓ ప్రత్యేకమైన కారణంతోనే సభను.. సచివాలయ  ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారని అంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కేసీఆర్ ను కలిసే నేతల సంఖ్య కూడా తగ్గిపోయింది. పది రోజుల కిందట చత్తీస్ ఘడ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు వచ్చి కలిశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీతో కలవడం లేదా.. తన పార్టీని వీలీనం చేయడం చేస్తారని చెప్పుకున్నారు. ఈ వియంపైనా స్పష్టత లేదు. 

ఏపీ, ఒడిషాల్లో బహిరంగసభపై రాని స్పష్టత! 

ఇతర రాష్ట్రాల్లో బహిరంగసభలపై ఇంకా స్పష్టత రాలేదు. ఏపీకి  బీఆర్ఎస్ అధ్యక్షుడ్ని ప్రకటించారు. ఒడిషాకు కూడా అధ్యక్షుడ్ని ప్రకటించారు. ఆ రెండు చోట్ల కార్యాలయాలను ప్రారంభించి భారీ బహిరంగసభలను ఏర్పాటు చేయాలనుకున్నరు. కానీ ఇంకా ఆ విషయంలో ఎలాంటి ముందడుగు  పడలేదు. ఏపీలో కానీ..  ఒడిషాలో కానీ ఇంకా  బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల్ని ఖరారు చేసుకోలేదు. ఒడిషాకు రావెల కిషోర్ ను పంపి.. పార్టీ కార్యాలయాలు ఇతర పనులను చక్క బెట్టాలని పంపారు కానీ. అవి కొలిక్కి రాలేదని తెలుస్తోంది. మరో వైపు ఏపీలో పార్టీకి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను ప్రకటించారు కానీ.. అసలు  ఏం చేయాలన్న దానిపై ఆయనకు క్లూ లేకుండా పోయింది. దాంతో ఆయన ఎక్కువగా బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడి హోదాలో తెలంగాణలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పార్టీ కార్యాలయాలను ఎంపిక చేసుకుని బహిరంగసభను వీలైనంత త్వరగా పెడితే పార్టీలో చేరికలు ఉంటాయని కొంత మంది నేతలు అంచనా వేస్తున్నరు. 

కర్ణాటకలో ఎన్నికల వాతావరణం ఉన్నా సైలెంట్‌గానే  బీఆర్ఎస్ ! 

మరో వైపు బీఆర్ఎస్ పార్టీ కర్ణాటకలో  జేడీఎస్‌కు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని ప్రకటించింది. అయితే ఇప్పట వరకూ  బీఆర్ఎస్ నేతలు ఇంకా కర్ణాటకలో రంగంలోకి దిగలేదు. అక్కడ పూర్తి స్థాయి రాజకీయ వాతావరణం ఏర్పడింది.  అన్ని పార్టీలు ప్రచారాలు ప్రారంభించేశాయి. కానీ బీఆర్ఎస్ మాత్రంఇంకా ఆలోచిస్తూనే ఉంది. ఇంకా ఎలాంటి బహిరంగసభలూ ప్లాన్ చేయలేదు.  రాజకీయంగా  ఒక్క సారిగా మౌనం పాటించడం.. ఆ తర్వాత తన ప్లాన్లు అమలు చేయడం కేసీఆర్ ప్రణాళికల్లో ఓ భాగం. అయితే ఇప్పుడు ఇలా మౌనం పాటించడానికి కారణం ఏమిటన్నది మాత్రం స్పష్టత లేదు. బీజేపీ, మోదీపై పోరాటం విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణలో ఎన్నికలు దూసుకొస్తున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి చివరికి వచ్ నెలల్లోనే ఉన్నాయి. అందుకే కేసీఆర్ వ్యూహాలపై బీఆర్ఎస్‌లో ఉత్కంఠ ఏర్పడింది. 

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Embed widget