అన్వేషించండి

Pawan Kalyan: 'వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ గాలి తక్కువ' - ఎన్నికల్లో కూటమిదే అధికారమన్న జనసేనాని

Andhrapradesh News: సీఎం జగన్ అహంకార పాలనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురం నుంచి తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

Pawan Kalyan Comments In Pithapuram: రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన అంతం చేసేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పునరుద్ఘాటించారు. తాను పోటీ చేయబోయే పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం నుంచి శనివారం ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఠాపురంలో 'వారాహి విజయభేరి' సభలో పవన్ ప్రసంగించారు. అధికార వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అంటూ సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ అహంకార పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని.. కూటమిదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన కోసం సీటును త్యాగం చేసిన టీడీపీ నియోజకవర్గం ఇంఛార్జీ వర్మకు ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురంలో పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదని.. ఇక్కడ లక్ష మెజారిటీతో గెలపిస్తా అన్నారని.. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా దశాబ్ద కాలంగా ఒంటరిగా పోరాటం చేస్తున్నానని.. ప్రజల ఆశీర్వాదం తనకు కావాలని అన్నారు. తనను గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.

'మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా'

పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పవన్ హామీ ఇచ్చారు. 'పిఠాపురానికి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి తీసుకువస్తా. నియోజకవర్గం అభివృద్ధికి 12 నుంచి 14 పాయింట్స్ ఫార్ములా ఉంది. పవన్ కల్యాణ్ మీకు జవాబుదారీతనం. నేను పారిపోయే వ్యక్తిని కాదు. ఎంతో విశిష్టమైన నేల ఇది. ఈ నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకునేందుకే వచ్చా. అధికారంలోకి రాగానే ఇక్కడి ఆస్పత్రులన్నీ బాగు చేస్తా. పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటా. 54 గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తా. పిఠాపురంలో 20 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తా. నన్ను ఓడించడానికి చిత్తూరు నుంచి మిథున్ రెడ్డి వచ్చారు. మండలానికి ఓ నాయకుడిని పెట్టారు. రూ.వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు.' అంటూ పవన్ ధ్వజమెత్తారు.

వైసీపీపై విమర్శలు

ఈ సందర్భంగా వైసీపీపై.. పవన్ విమర్శలు గుప్పించారు. కాకినాడ సెజ్ కు భూములిచ్చిన రైతులకు మేలు జరగలేదని.. ఉప్పాడ తీరం కోతకు గురవుతుంటే వైసీపీ నేతలు ఏం చేశారు.? అని ప్రశ్నించారు. 'నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని.. జగన్ లా సీఎం కొడుకుని కాదు. జగన్, సజ్జల, పెద్దిరెడ్డి అందరూ పేదవారట. కాకినాడ పోర్టు.. డ్రగ్స్, డీజిల్ మాఫియాకు అడ్డాగా మారింది. యువతకు రూ.5 వేల జీతం కావాలా.? 25 ఏళ్ల భవిష్యత్తు కావాలా.? అనేది ఆలోచించుకోవాలి. ప్రజాధనం దోచేసిన జగన్ పేదవాడు.. సొంత డబ్బును పంచిన నేను పెత్తందారుడినా..?. మద్య నిషేధం అని చెప్పి, కల్తీ మద్యం మరణాల్లో రాష్ట్రాన్ని ప్రథమం చేశారు. జగన్ మాయమాటలు నమ్మి మోసపోవద్దు. వైసీపీని గద్దె దించాల్సిన సమయం వచ్చింది. ఎన్నికల్లో కూటమి కావాలో.. వైసీపీ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి.' అని పవన్ పేర్కొన్నారు. ఈ సభకు జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

కాగా, పిఠాపురం కేంద్రంగానే ఏపీ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి పవన్ వెళ్లనున్నారు. జనసేనాని ప్రచారం మూడు విడతలుగా ఉండనుండగా.. ప్రతి విడతలోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కవర్ అయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ పిఠాపురంలో 5 రోజులు పర్యటించనున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 3న జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాలిలో ప్రచారం చేస్తారు. తొలి విడతలోనే అనకాపల్లి, కాకినాడ రూరల్ లో క్యాంపెయిన్ చేయనున్నారు. ఏప్రిల్ 9న మరోసారి పిఠాపురంలో పవన్ ప్రచారం చేయడానికి ప్లాన్ చేశారు. 

Also Read: CM Jagan: సీఎం జగన్ రోడ్ షోలో కలకలం - బస్సుపైకి చెప్పు విసిరిన గుర్తు తెలియని వ్యక్తి, పోలీసుల విచారణ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
Embed widget