అన్వేషించండి

Janasena: మరో అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్ - ఇంకా 2 స్థానాల్లో పెండింగ్, పిఠాపురంలో పవన్ రెండో రోజు పర్యటన

Andhrapradesh News: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం విశాఖ దక్షిణం అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించారు. ఇప్పటివరకూ 19 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో జనసేన తన అభ్యర్థులను ప్రకటించింది.

Pawan Kalyan Announced Visakha South Contestant: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan) మరో అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించారు. విశాఖ దక్షిణం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా సీహెచ్ వంశీకృష్ణ యాదవ్ పేరును జనసేనాని ఖరారు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ ప్రస్తుతం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆయన పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చించారు. ప్రచార కార్యక్రమాలు, కూటమిలో భాగంగా పార్టీల మధ్య సమన్వయం, బహిరంగ సభల ప్రణాళికలు వంటి వాటిపై సమీక్షించారు. ఈ నేపథ్యంలో విశాఖ దక్షిణం అసెంబ్లీ స్థానాన్ని ప్రకటించారు. బీజేపీ, టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకూ 19 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇంకా అవనిగడ్డ, పాలకొండ శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

అసెంబ్లీ అభ్యర్థులు

 పిఠాపురం - పవన్ కల్యాణ్

 తెనాలి - నాదెండ్ల మనోహర్

 నెల్లిమర్ల - లోకం మాధవి

 అనకాపల్లి - కొణతాల రామకృష్ణ

 కాకినాడ రూరల్ - పంతం నానాజీ

 రాజానగరం - బత్తుల రామకృష్ణ

 నిడదవోలు - కందుల దుర్గేష్

 పెందుర్తి - పంచకర్ల రమేష్ బాబు

 యలమంచిలి - సుందరపు విజయ్ కుమార్

 పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ

☛ రాజోలు - దేవ వరప్రసాద్

 తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్

 భీమవరం - పులపర్తి ఆంజనేయులు

 నరసాపురం - బొమ్మిడి నాయకర్

 ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు

 పోలవరం - చిర్రి బాలరాజు

 తిరుపతి - ఆరణి శ్రీనివాసులు

 రైల్వేకోడూరు - డా.యనమల భాస్కరరావు

విశాఖ దక్షిణం - వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్

లోక్ సభ అభ్యర్థులు

 మచిలీపట్నం - వల్లభనేని బాలశౌరి

కాకినాడ - తంగెళ్ల ఉదయ శ్రీనివాస్

పిఠాపురంలో పవన్ పర్యటన

మరోవైపు, ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురుహూతికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పాదగయక్షేత్రంతో పాటు కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరీ దేవీ, దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీపాద శ్రీ వల్లభునికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. పవన్ పర్యటన నేపథ్యంలో జనసేన శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. 

అటు, తొలి రోజు పిఠాపురంలో 'వారాహి విజయభేరి' సభలో పవన్ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికార వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అంటూ సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ అహంకార పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని.. కూటమిదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన కోసం సీటును త్యాగం చేసిన టీడీపీ నియోజకవర్గం ఇంఛార్జీ వర్మకు ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురంలో పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదని.. ఇక్కడ లక్ష మెజారిటీతో గెలపిస్తా అన్నారని.. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా దశాబ్ద కాలంగా ఒంటరిగా పోరాటం చేస్తున్నానని.. ప్రజల ఆశీర్వాదం తనకు కావాలని అన్నారు. తనను గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.

Also Read: Botsa Satyanarayana: నాకు గన్ మెన్ కూడా ఇవ్వలేదు, లోకేష్‌కు Z కేటగిరి సెక్యూరిటీనా? మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget