అన్వేషించండి

Botsa Satyanarayana: నాకు గన్ మెన్ కూడా ఇవ్వలేదు, లోకేష్‌కు Z కేటగిరి సెక్యూరిటీనా? మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Visakhapatnam News: నారా లోకేష్‌కు జెడ్ కేటగిరి సెక్యూరిటీ కోసమే చంద్రబాబు బీజేపీతో కూటమిలో చేరారని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

Botsa Satyanarayana - విశాఖపట్నం: వెయ్యి అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయాలి అంటారు. కానీ అబద్ధాలతో బంధాలు నిలవవు అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో బీజేపీతో టీడీపీ పొత్తును ఉద్దేశించి ఈ సెటైర్లు వేశారు. బీజేపీ ఆహ్వానిస్తేనే తాము వెళ్లి పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెబుతారని, ఆపై అందులో నిజం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారని మంత్రి బొత్స పేర్కొన్నారు. ప్రజా ఆగ్రహానికి గురైన వారికి, నోరు అదుపులో పెట్టుకోలేక పోయిన వారికి మాత్రమే బ్లాక్ డ్రెస్ వాళ్ల సెక్యూరిటీ అని నారా లోకేష్ కు జడ్ కేటగిరి సెక్యూరిటీపై సైతం బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్కస్ వాళ్ల లాగ డ్రామాలు చేయడానికి ఈ తెలివి పనికొస్తుందన్నారు. 

లోకేష్‌కు జెడ్ కేటగిరి సెక్యూరిటీ ఎందుకు? 
మంత్రి బొత్స ఆదివారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, తన కొడుకు రక్షణ కోసం, లోకేష్ జెడ్ కేటగిరి సెక్యూరిటీ కోసం బీజేపీ కూటమిలో చేరారు తప్ప.. ప్రజలు కోసం కాదన్నారు. తనకు గన్ మ్యాన్ కూడా ఇవ్వలేదు.. నాకు ఎందుకు.. నేనేం తప్పు చేస్తే అంత సెక్యూరిటీ అవసరం అవుతుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలకు పటిష్ట భద్రత ఇవ్వవచ్చు, కానీ లోకేస్ కు ఇంత సెక్యూరిటీ ఎందుకో చెప్పాలన్నారు. ఉమ్మడి ఏపీ కి అధ్యక్షుడు గా పని చేశా.. జనం విపరీతంగా వచ్చారు. అప్పుడు కూడా తాను భద్రత అడగలేదని గుర్తుచేశారు. మరోవైపు వాలంటీర్లను పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు కుట్రచేసి పేదలకు పెన్షన్‌ అందకుండా చేస్తున్నారని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు పేదవాడికి అందకుండా చేసి, వైసీపీపై దుష్ప్రచారం చేయడమే టీడీపీ రాజకీయం అంటూ ఫైర్ అయ్యారు.  

అసలే ఎన్నికల సమయం, అందులోనూ వాలంటీర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. లబ్ధిదారులకు పెన్షన్‌ లాంటి సంక్షేమ పథకాల నగదు ఇకనుంచి ఎవరు అందజేస్తారని బొత్స ప్రశ్నించారు. పెన్షన్ లబ్ధిదారులు ఇప్పటికప్పుడూ బ్యాంక్ అకౌంట్ తెరిచి నగదు తీసుకోవం సాధ్యమా? టీడీపీ కుటిల రాజకీయాలు. ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసి ఏపీలో టెట్ ఫలితాలు అడ్డుకున్నారని, డీఎస్సీ పరీక్షను కూడా వాయిదా పడేలా చేయించారని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. అవుతాం. ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం డీఎస్పీ పరీక్ష నిర్వహిస్తాం. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనన్నారు. ఉత్తరాంధ్రలో ఎక్కువ ఎంపీ స్థానాలను బలహీన వర్గాలకే వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారని, రాష్ట్రంలో సోషల్ ఇంజినీరింగ్ కొనసాగుతోందన్నారు. 

మూడు పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెబుతాయి
‘మంచి జరిగితేనే ఓటు వేయండి అనే ధైర్యం జగన్ కు ఉంది. చంద్రబాబు నాయుడు చెప్పగలరా?. నవ్యాంధ్ర ప్రదేశ్ లో అవకాశం ఇవ్వండి అని తీసుకుని కులానికి, ప్రాంతానికి, కుటుంబ సభ్యులకి అన్యాయం చేశావు. పేదవాడి భూములు దోపిడీ చేశారు. విశాఖని పరిపాలన రాజధానిగా ప్రకటిస్తే కోర్టు కి వెళ్ళారు.. అమరావతి ప్రకటించినప్పుడు వైసీపీ నేతలు ఎవరూ కోర్టు కి వెళ్ళ లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు కరణ అనేది ఏపీ ప్రభుత్వం చేతిలో లేదు. ప్రధాని మోదీ సమక్షంలో మా స్టాండ్ చెప్పాం.. బీజేపీతో వైసీపీ కలిసి పోయింది అని అప్పుడు మా పై నిందలు వేసి.. ఇప్పుడు ఎవరు ఎవరితో కలిశారు. ఈ మూడు పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్ కోసం ఏమి చెబుతాయి. కూటమి ప్రచారం మొదలు పెట్టే లోపలే ప్రైవేటు కరణ ఉపసంహరణ అనౌన్స్ రావాలి. లేదంటే కూటమి అభ్యర్థులు ఈ ప్రాంతం లో తిరగడానికి వీలు లేదు.

నేను కూడా చంద్రబాబు తరహాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ. సుష్మా స్వరాజ్ పార్లమెంటు లో ఏం స్పీచ్ ఇచ్చారు. రాష్ట్ర విభజనపై కాకినాడలో ఏమి డిక్లరేషన్ ఇచ్చారు. రాష్ట్ర విభజనకి మద్దతు ఇచ్చింది ఎవరు.. ఎర్రం నాయుడు కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది టీడీపీ నేతలు చెప్పాలి. అధికారాన్ని స్వంత ప్రయోజనం కోసం వాడుకుని ఈ రోజు మళ్లీ ఓట్లు అడుగుతున్నారు. వైఎస్సార్ ఏం చేశారో ప్రజలే చెబుతారు. ఎస్ ఈ జెడ్, ఫార్మా, ఐటీ హబ్, బ్రాండిక్స్ వంటివి వైఎస్సార్ అనేకం తెచ్చారు. జగన్ మోహన్ రెడ్డి పేరు చెబితే నవరత్నాలు, నాడు నేడు అని చాలానే ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఖాతాలో ఏమీ లేవు’ అని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget