అన్వేషించండి

YS Jagan: వాలంటీర్లు వద్దు కార్యకర్తలే ముద్దు - జగన్ తేల్చేసుకున్నారు - కానీ వాళ్లు రెడీగా ఉంటారా ?

Andhra : కార్యకర్తలకు ఇక ప్రాధాన్యత ఇస్తామని జగన్ చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని మర్చిపోయి వాలంటీర్లకు ప్రాధాన్యత ఇచ్చారన్న అసంతృప్తి వైసీపీ క్యాడర్ లో ఉంది.

YSRCP Jagan:  వైఎస్ఆర్‌సీపీ ఎన్నికల్లో అత్యంత ఘోరంగా ఓడిపోవడానికి కారణాల్లో ఒకటి కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుండి అధికారంలోకి వచ్చే వరకూ పన్నెండేళ్ల పాటు తనతోనే ఉంటూ ఎన్నో కష్టాలు పడ్డ వారందర్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మర్చిపోయారన్న విమర్శలు ఉన్నాయి.  అందుకే రెండు రోజుల కిందట నెల్లూరు కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఇక కార్యకర్తలను గొప్పగా చూస్తామని .. ఈ విషయంలో తాము నేర్చుకోవాల్సింది ఉందని అంగీకరించారు. 

అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లకు ప్రాధాన్యం  

 2014-19 మధ్య కాలంలో పార్టీకి సైనికులలా మారీ సార్వత్రిక ఎన్నికల యుద్ధాన్ని దగ్గరుండి గెలిపించిన కార్యకర్తలు.. జగన్ సీఎం అవ్వగానే కనిపించకుండా పోయారు. జగన్ ఫోకస్ అంతా సచివాలయ వ్యవస్థ మీదే ఉంది తప్ప.. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్త మీద లేకుండా పోయింది. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, కాంట్రాక్టర్లు ఇలా అందరూ... నాడు-నేడు పనుల్లో భారీగా డబ్బులు పెట్టి.. బిల్లుల కోసం తిరిగితిరిగి చివరికి పార్టీ మిమ్మల్ని వదిలేసింది అనే స్థాయిని వారిని తీసుకువచ్చింది వైసీపీ. తీరా ఎన్నికల సమయానికి నియోజకవర్గ ఇన్చార్జ్ లను మార్చి.. భారీ తప్పటడుగు వేసింది. ఇక్కడ కూడా నష్టపోయింది కార్యకర్తే. ఎందుకంటే కొత్తగా వచ్చిన సమన్వయకర్తకు క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్త ఎవరో తెలియదు. సమన్వయకర్త కార్యాలయం చుట్టూ తిరిగిన వారే తమ కార్యకర్తలను భావించే రాజకీయ నాయకులున్న జనరేషన్ ఇది. నియోజకవర్గానికి సమన్వయకర్తలు వస్తుంటారు పోతుంటారు.. కానీ, కార్యకర్త లోకల్ అనే విషయాన్ని అధిష్టానం గుర్తించలేదు. ఫలితంగా కార్యకర్తలంతా చెల్లా చెదురైపోయారు. 

కార్యకర్తల ఆవేదనను పట్టించుకోలేదు !

ఇటీవలి కాలంలో  కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియా కేసుల్లో  వారి ఆవేదనను అర్ధం చేసుకునే వారేరి.? వారికి భరోసా ఇచ్చే ఇన్చార్జ్లు ఏరి..? వారిని బయటకు తీసుకువచ్చే లాయర్లేరి..? ఎప్పుడు అరెస్ట్ చేస్తారో..? ఏ స్టేషన్ కు తీసుకువెళ్తారో..? ఎన్ని రోజులు తిప్పుతారో..? ఎప్పుడు కోర్టుకు తీసుకువెళ్తారో..? అనే భయంతో  కుటుంబాలను, ఊర్లను వదిలి పారిపోవాల్సిన పరిస్థితి. ఆ కార్యకర్త దొరక్కపోతే వారి కుటుంబ సభ్యులను స్టేషన్ కు తీసుకువెళ్తున్న దుస్థితి. అందుకే తాను న్యాయపరంగా సాయంగా ఉంటానని చెబుతున్నారు. అధికారంలోకి వచ్చాక జైల్లో పెట్టిన అధికారులతో సెల్యూట్ కొట్టిస్తానని అంటున్నారు. 

ఇప్పుడు కార్యకర్తలు నమ్ముతారా ?

అధికారంలో ఉన్నప్పుడు.. లేనప్పుడు కూడా పట్టించుకోలేదన్న అసంతృప్తితో ఉన్న క్యాడర్ ను జగన్ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. వారి సంక్షేమం కోసం ఎదో చేస్తామని చెబుతున్నారు. అయితే  అధికారంలోకి వచ్చిన తరవాత ఏదో చేస్తామని చెప్పడం కన్నా.. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలన్న డిమాండ్ ను కొంత మంది వినిపిస్తున్నారు. ఇప్పుడు కార్యకర్తల్ని కాపాడుకోవాడనికి కొన్ని చర్యలు తీసుకుంటే మళ్లీ క్యాడర్ యాక్టివ్ అవుతుందని లేకపోతే స్థానిక ఎన్నికల నాటికి నిర్వీర్యం అయిపోతుందని పార్టీ సానుభూతి పరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

Also Read: ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
Janasena expansion in South: దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Telangana Congress: గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Royal Challengers Bangalore and Rajasthan Royals: ఐపీఎల్‌లో కాసుల వర్షం; బిలియన్ క్లబ్‌లోకి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌! క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్స్!
ఐపీఎల్‌లో కాసుల వర్షం; బిలియన్ క్లబ్‌లోకి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్‌! క్రికెట్ చరిత్రలోనే కళ్లు చెదిరే డీల్స్!
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
Embed widget