అన్వేషించండి

Janasena Plan : జనసేనలో నాదెండ్ల ప్రాధాన్యం తగ్గుతోందా ? ఎందుకు సైలెంట్ అవుతున్నారు?

జనసేనలో నాదెండ్లకు ప్రాధాన్యం తగ్గుతోందా ?చంద్రబాబుతో చర్చలకు ఎందుకు లేరు ?నాగబాబుకే పవన్ ప్రాధాన్యం ఇస్తున్నారా?

 

 
Janasena Plan :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన నిర్ణయాత్మక శక్తిగా మారింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇంకా ఫీల్డ్ లోకి రాలేదు. మొత్తం పార్టీలో నెంబర్ టుగా ఉన్న  నాదెండ్ల మనోహర్ చూసుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన ప్రాధాన్యాన్ని పవన్ కల్యాణ్ క్రమంగా తగ్గిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఏమిటన్నది జనసేనలోనే విస్తృత చర్చ జరుగుతోంది. 

చంద్రబాబుతో చర్చలకు పవన్ వెంట లేని నాదెండ్ల! 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల హఠాత్తుగా చంద్రబాబు ఇంటికి వెళ్లారు. చర్చలు జరిపారు. ఆయన ఒక్కరే వెళ్లారు. మీడియాతో కూడా మాట్లాడలేదు. పవన్ కల్యాణ్ ఇలా ఒక్కరే వెళ్లడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పవన్ రాజకీయ సమావేశాలు ఎలాంటివైనా పక్కన నాదెండ్ల మనోహర్ ఉండాల్సిందే. అందుకే నాదెండ్ల మనోహర్ ఏడి అన్న అనుమానం జనసేన వర్గాలకే కాదు ఇతర రాజకీయ పక్షాలకూ వచ్చింది.  జనసేనలో పవన్ కల్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహరే. అన్ని రాజకీయ వ్యవహారాలను ఆయనే చక్క బెడుతున్నారు. బీజేపీతో పొత్తు విషయంలోనూ ఆయనే ఎక్కువగా సమన్వయం చేసుుకుంటున్నారు. నాదెండ్ల మనోహర్ తండ్రి భాస్కర్ రావు అధికారికంగానే బీజేపీలో చేరారు.  పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉంటే నాదెండ్లే మొత్తం పార్టీని నడిపిస్తున్నారు. విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఢిల్లీలో పవన్ తో కలిసే నాదెండ్ల చర్చలు !

అయితే బీజేపీ హైకమాండ్‌తో జరిపిన చర్చలకు నాదెండ్ల కూడా వెళ్లారు. ఆ తర్వాతే  నాదెండ్లకు రాజకీయంగా  ప్రాధాన్యం ఇటీవల పవన్ కల్యాణ్ తగ్గిస్తున్నట్లుగా తెలుస్తోంది. కీలక రాజకీయ సమావేశాల్లో నాదెండ్ల పెద్దగా కనిపించడం లేదు.  ఇటీవల హఠాత్తుగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. సోదరుడు నాగబాబుకు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. అంటే ఇప్పుడు జనసేనలో నెంబర్ టు ఆయనే అనుకోవచ్చు. నాగబాబు పదవి చేపట్టగానే ముందుగా జనసేన క్యాడర్ మొత్తాన్ని తన గ్రిప్‌లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలు తిరగడానికన్నా ముందే టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లలోనూ నాదెండ్ల కనిపించడం లేదు. ఆయన వేరేగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నాదెండ్ల ప్రాధాన్యతను  వీలైనంతగా తగ్గించడానికే పవన్ కల్యాణ్ నాగబాబుకు బాధ్యతలిచ్చారన్న అభిప్రాయం ఎక్కువగా  వినిపిస్తోంది. 
 
జనసేనలో గందరగోళం!

పవన్ కల్యాణ్ ఓ వైపు రాజకీయాలపై సమయం కేటాయించడం తక్కువగా ఉంది. గతంలో వారాంతాల్లో అయినా ఏపీలో పర్యటించేవారు. ఓ సమావేశంలో మాట్లాడేవారు. గత రెండు, మూడు నెలలుగా అదీ లేదు. ఎప్పుడో ఓ సారి బీజేపీ పెద్దలతో భేటీ.. లేకపోతే చంద్రబాబుతో భేటీ అంటూ వార్తల్లోకి వస్తున్నారు. వారాహీ వాహనం రెడీ చేసుకుని కావాల్సినంత ప్రచారం చేసుకున్నారు. కానీ ఇంత వరకూ రోడ్డెక్కలేదు. దీంతో పవన్ ..జనసేన పయనంపై ఆ పార్టీ క్యాడర్‌లో గందరగోళం ఏర్పడుతోంది. వీలైనంత త్వరగా పవన్ కల్యాణ్ ఫీల్డ్ లోకి రావాలని జనసైనికులు కోరుకుంటున్నారు. అయితే కీలక నిర్ణయాలు తీసుకునే .. రంగంలోకి దిగాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Embed widget