అన్వేషించండి

BRS News : బీఆర్ఎస్ అసలు సమస్య ఫిరాయింపు ఎమ్మెల్యేలే - జూపల్లి, పొంగులేటి తర్వాత ఇంకెవరు ?

అసంతృప్తుల్ని కేసీఆర్ బుజ్జగించడానికి సిద్ధంగా లేరా ?ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న చోట అసంతృప్తులుసీనియర్ నేతలను సరిగా గౌరవించడం లేదా ?ఎన్నికల సమయానికి ఎంత మంది పార్టీ వీడుతారు ?

 


BRS News  :    బీఆర్ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేయడం సంచలనం అయింది. వీరిద్దరి సమస్య ఫిరాయింపులే. అంటే ఫిరాయింపుల ద్వారా బీఆర్ఎస్‌లోకి వచ్చిన వారి కారణంగా వీరికి టిక్కెట్లు దక్కలేదు. దక్కే చాన్స్ కూడా లేకుండా పోయింది. అందుకే వీరు బీఆర్ఎస్ తమను సస్పెండ్ చేసేదాకా తెచ్చుకున్నారు. అయితే వీరిద్దరే కాదని ఇంకా చాలా మంది ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించినా కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేల్ని ఫిరాయించేలా చేసుకున్నారు. ఆ పన్నెండు చోట్ల టీఆర్ఎస్ తరపున పని చేసిన నేతలు  పక్క చూపులు చూస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో వర్గ పోరాటం ఎక్కువగా ఉంది. 

ఫిరాయించి వచ్చిన  వారందరికీ టిక్కెట్ గ్యారంటీ హామీ
 
కాంగ్రెస్ గుర్తుపై గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ మొదటే టిక్కెట్ హామీ ఇచ్చారు. సి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. కాంగ్రెస్, టీడీపీ ఎల్పీలను సైతం టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ సిట్టింగ్‌లకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఓడిపోయిన ప్రతీ చోటా బలమైన అభ్యర్థులు ఉన్నరు. పట్నం మహేందర్ రెడ్డి,  తీగల కృష్ణారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహా ఫిరాయించిన ఎమ్మెల్యే ఉన్న ప్రతీ చోటా బలమైన బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వారంతా ఇప్పుడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. జూపల్లి కృష్ణారావుపై గెలచిన హర్ష వర్ధన్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. టిక్కెట్ రాదని ఆయన దారి ఆయన చూసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఫిరాయించే నేతల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. 

ప్రత్యామ్నాయాలు ఎక్కువగా ఉండటంతో బీఆర్ఎస్ అగ్రనేతల్లో అలజడి !

ఇప్పుడు బీఆర్ఎస్ కాకపోతే బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి . రెండు పార్టీలు పుంజుకున్నట్లుగా కనిపిస్తూండటంతో నేతలకు అవకాశాలకు కొదువలేకుండా పోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.   గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్, శివారు నియోజకవర్గాల్లో గెలిచిన వారిలో ముగ్గురు, నలుగురు.. కరీంనగర్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌ జిల్లాల నుంచి కొంత మంది కీలక నేతలు టిక్కెట్లు దక్కకపోతే బీజేపీ లేదా కాంగ్రెస్ లోకి వెళ్లాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  ఆదిలాబాద్‌‌‌‌, మెదక్‌‌‌‌ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలూ తమతో టచ్‌‌‌‌లో ఉన్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇక వరంగల్‌‌‌‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే సైతం బహిరంగంగానే తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు.  2018లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలిచిన దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి చేరికలను నాయకత్వం ప్రోత్సహించింది. మరికొన్ని చోట్ల ఆల్టర్నేట్‌‌‌‌ నేతలపై దృష్టి సారించింది. దీంతో డిఫెన్స్‌‌‌‌లో పడిన కొందరు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారనిఅంటున్నారు.  

సీనియర్లను కాపాడుకునేదెలా ? 

ఖమ్మం జిల్లాలో చాలా మంది నేతలు పార్టీ వీడి పోతారని ప్రచారం జరిగినా.. సర్దుబాటు చేయడంలో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం పెద్దగా ప్రయత్నించలేదు. పిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో బలమైన నేతలకు సరైన గౌరవం ఇవ్వలేకపోయారు. ఫలితంగా వారంతా పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఉంది. విమర్శలు చేస్తున్నారని ఇప్పటికిప్పుడు ఇద్దర్ని సస్పెండ్ చేసినా వారు పార్టీకి వ్యతిరేకంగా మారింది..  తమను కాదని ఫిరాయింపు దార్లను ప్రోత్సహించినప్పుడే. ఇతర చోట్లా కూడా ఉన్న ఈ అసంతృప్తి  బయటపడితే ప్రమాదమని.. హైకమాండ్ వెంటనే ఇలాంటి అసంతృప్తుల్ని సర్దుబాటు చేయాలన్న అభిప్రాయం  బీఆర్ఎస్ సానుభూతిపరుల్లో వినిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

K Annamalai New Political Party: అన్నామలై సొంత పార్టీ ప్రకటన - రజనీకాంత్ ప్రస్తావన - తమిళనాడు రాజకీయాల్లో కలకలం
అన్నామలై సొంత పార్టీ ప్రకటన - రజనీకాంత్ ప్రస్తావన - తమిళనాడు రాజకీయాల్లో కలకలం
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
YS Sharmila Rajya Sabha Seat: చివరి క్షణంలో షర్మిలకు రాజ్యసభ చాన్స్ మిస్ - వైఎస్ఆర్‌సీపీతో స్నేహం కోసమే రాహుల్ వ్యూహాత్మక నిర్ణయమా?
చివరి క్షణంలో షర్మిలకు రాజ్యసభ చాన్స్ మిస్ - వైఎస్ఆర్‌సీపీతో స్నేహం కోసమే రాహుల్ వ్యూహాత్మక నిర్ణయమా?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Embed widget