అన్వేషించండి

YS Jagan : లేని, రాని ప్రతిపక్ష హోదా కోసం జగన్ పోరాటం - ప్రజల నుంచి సానుభూతి కోసమేనా ?

Andhra Pradesh : తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని జగన్ పోరాడుతున్నారు. టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తున్నా ఆయన తగ్గడం లేదు. ప్రజల నుంచి సానుభూతి కోసమే ఇలా చేస్తున్నారా ?

Is Jagan fighting for opposition status just for sympathy :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్  రెడ్డి ఇప్పుడు హోదా యోధునిగా మారారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం యోధునిగా మారిన అన్ని వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పోరాడుతున్నారు. మొదట తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తారని ఆయన అనుకున్నారు. కానీ అలా చేయకపోవడంతో స్పీకర్‌కు లేఖ రాశారు. స్పీకర్ పట్టించుకోలేదు. మంగళవారం జరిగిన సభలో వైఎస్ఆర్‌సీపీ పక్ష నేతగానే జగన్ మోహన్ రెడ్డిని గుర్తిస్తూ ప్రకటన చేశారు. దీంతో జగన్ వెంటనే హైకోర్టులో పిటిషన్ వేశారు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా  స్పీకర్ ను ఆదేశించాలని ఆయన పిటిషన్‌లో కోరారు. 

సభా వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని జగన్‌కు తెలియదా ?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలియగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే శాసన వ్యవస్థను న్యాయవ్యవస్థ ఆదేశించలేదు. ముఖ్యంగా శాసనసభా వ్యవహారాల్లో స్పీకర్ పాత్రే అత్యున్నతం. స్పీకర్ సభా నిర్వహణ విషయంలో ఫలానా పని చేయాలని న్యాయవ్యవస్థ ఆదేశించలేదు. అందుకే ఇలాంటి అంశాల్లో దాఖలైన పిటిషన్లకు సంబంధించి కోర్టులు సూచనలు మాత్రమే చేస్తాయి. వాటిని అమలు చేస్తారా లేదా అన్నది స్పీకర్ ఇష్టం. అయితే ఇలాంటి సూచనలు ..ఫిరాయింపు నిరోధక చట్టం విషయంలో దాఖలైన పిటిషన్లపైనే ఇప్పటి వరకూ కోర్టులు చేశాయి. ఫలానా నేతను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని ఎప్పుడూ కోర్టులు సూచనలు కూడా చేయలేదు. ఈ విషయం జగన్‌కు తెలియనిదేం కాదు.. ఆయనకు తెలియకపోయినా ఆయన సలహాదారులకు తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా కోర్టులో ఎదురుదెబ్బ తగులుతుందని తెలిసి కూడా జగన్ పిటిషన్ వేశారని ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది. 

ఏ రూపంలో అయినా నిధులు నిధులే - ఇరవై ఏళ్ల తర్వాత ఏపీకి సూపర్ బడ్జెట్

స్పీకర్ ఇస్తేనే ప్రతిపక్ష హోదా ! 

వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే రావడంతో ప్రధాన ప్రతిపక్ష నేత అర్హత కూడా సాధించలేకపోయింది.  పది శాతం సీట్లు సాధిస్తేనే.. ప్రతిపక్ష నేత  హోదా  వస్తుందని ఇప్పటి వరకూ అనేక సార్లు రుజువు అయింది. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లుగా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోవడం .. సుప్రీంకోర్టుకు వెళ్లినా సానుకూల ఫలితం రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. అయితే ఇక్కడ ఓ చాయిస్ ఉంది. అది స్పీకర్ చేతుల్లో ఉంది. ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీకి  ఇవ్వాలనుకుకంటే స్పీకర్  ఇవ్వొచ్చు. చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షం ఎన్ని సీట్లు గెలిచినా సీట్ల సంఖ్యతో సంబంధం లేకుండా ఇవ్వొచ్చు.  ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం ఒక్క వైసీపీనే. స్పీకర్ అనుకుంటే ఇస్తారు. కానీ జగన్‌కు అలాంటి అవకాశం ఇవ్వకూడదని..ఆయనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని టీడీపీ గట్టిగా అనుకుంటోంది. 

రాని..లేని ప్రతిపక్ష హోదా కోసం పోరాటం !

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులు, వ్యక్తిగత శత్రువులు వేర్వేరు కాదు. తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఆయన వ్యక్తిగత శత్రువులుగానే చూస్తారు. గత ఐదేళ్ల కాలంలో టీడీపీ నేతలు పడిన ఇబ్బందులు.. అసెంబ్లీలో వారు ఎదుర్కొన్న అవమానాలు మరే సభలోనూ విపక్ష సభ్యులు ఎదుర్కొని ఉండరు. చివరికి చంద్రబాబునాయుడు కంటతడి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో  ఆయనకు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష నేత హోదా ను కల్పిస్తే..  అంత కంటే తప్పిదం ఉండదని అనుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఆయన వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉంటారు. పార్టీ బలం ప్రకారం మాట్లాడే అవకాశం వస్తుంది. కానీ ప్రతిపక్ష నేత హోదా మాత్రం రాదు.  కోర్టులకు వెళ్లినా రాదు.. ఇదంతా తెలిసి జగన్ పోరాటం చేస్తున్నారు. 

ఏపీకి రూ.15 వేల కోట్ల అప్పు సాయం, ప్రయోజనం ఏంటని వైసీపీ ఫైర్- రాజధానిపై అనుమానాలు!

ప్రజల్లో సానుభూతి కోసమేనా ?

అన్నీ తెలిసీ జగన్మోహన్ రెడ్డి  ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేయడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. అయితే జగన్ వ్యూహాలు జగన్ కు ఉన్నాయని రాజకీయ  పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. 40 శాతం ఓట్లు వచ్చినా తనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వడం లేదన్న సానుభూతి కోసమే.. ఈ అంశాన్ని ఎక్కువ కాలం ప్రజల్లో ఉంచాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. తనను వేధిస్తున్నారని సానుభూతి  సంపాదించేందుకు ఈ  అస్త్రాన్ని ఉపయోగించుకుంటున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 

 

టాప్ హెడ్ లైన్స్

New Political Parties in Telangana: తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
Almatti Dam Height Dispute 2026: దక్షిణాది జలవివాదాలకు ముగింపు - ముగ్గురు సీఎంలది ఒకే సంకల్పం - ఆల్మట్టి వివాదాలూ తేల్చేసుకుంటారా?
దక్షిణాది జలవివాదాలకు ముగింపు - ముగ్గురు సీఎంలది ఒకే సంకల్పం - ఆల్మట్టి వివాదాలూ తేల్చేసుకుంటారా?
Telangana Cabinet Expansion Postponed 2026: తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ సెగ - కేబినెట్ విస్తరణ ఒక మిథ్యేనా? శల్యపరీక్షలో రాహుల్-రేవంత్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌లో మీనాక్షి నటరాజన్ సెగ - కేబినెట్ విస్తరణ ఒక మిథ్యేనా? శల్యపరీక్షలో రాహుల్-రేవంత్ వ్యూహం!
Modi Cabinet Reshuffle 2026: కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget