అన్వేషించండి

Dharmapuri Arvind: ‘నేను అలా అనలేదు, ఈసారి కవితకు మూడో స్థానమే’- ఎంపీ ధర్మపురి అరవింద్

Dharmapuri Arvind: ఎవ్వరికి ఓటేసినా చివరికి గెలిచేది మాత్రం తానే అంటూ నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి.

Dharmapuri Arvind: ఎవ్వరికి ఓటేసినా చివరికి గెలిచేది మాత్రం తానే అంటూ నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగింది. దాంతో తెలంగాణలో రాజకీయ ప్రకంపన మొదదలైంది. దీంతో బీజేపీ ఎంపీ అర్వింద్ మరో సారి స్పందించారు. సోమవారం ఆయన తన వ్యాఖ్యలపై మీడియాకు వివరణ ఇచ్చారు. తాను ఈవీఎం అనలేదని, బటన్ అనలేదన్నారు. ఓ జర్నలిస్ట్ అన్న మాటలకు నువ్వు ఒక్కడివే ఎవరికైనా ఓటేస్తే నేనే గెలుస్తానని అన్నట్లు చెప్పారు. కొందరు తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తున్నారని మంపడ్డారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కవిత నిజమాబాద్‌లో పోటీ చేస్తే ముడో స్థానంలో ఉంటందన్నారు.  
 
ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, కేసీఆర్ కోటి టన్నుల ధాన్యాన్ని అమ్ముకునేందుకు సిద్దం అవుతున్నారని విమర్శించారు. తెలంగాణలో రెండున్నర వేల మంది రైసు మిల్లర్లు ఉన్నారని, వారి పొట్ట కొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వెయ్యి కోట్ల టర్నోవర్, వంద కోట్ల లాభం ఉంటేనే మిల్లర్లు టెండర్లలో పాల్గొనాలని నిబంధనలు పెట్టారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సాయం చేసినా కేసీఆర్ నిర్లక్షం వల్లే రాష్ట్రంలో ధాన్యం తడిసి ముద్దయిందన్నారు. కనీసపు మద్దతు ధరకే రైస్ మిల్లర్లు ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రైతులను, రైస్ మిల్లర్లకు కాపాడుకోవాలన్నారు. బ్లాక్ మార్కెట్లో కేటీఆర్ ఆరితేరారని విమర్శించారు. మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే రైస్ మిల్లర్లన్ని మూతపడుతాయన్నారు. 

రైస్ మిల్లులను కాదని ధాన్యమంతా కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకునేందుకు కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. సమయానికి ధాన్యం ప్రోక్యూర్ మెంట్ చేయలేక నష్టం జరిగిందని, ఫామ్ హౌజ్‌ సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కోటి టన్నుల ధాన్యాన్ని అమ్ముకొని వచ్చే డబ్బులతో ఎన్నికలలో ఖర్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు ఎన్నికల ఖర్చుల కోసం రూ.40 కోట్లు ఇవ్వాలని చూస్తున్నారని విమర్శించారు. గాదెల్లో ఉన్న బియ్యాన్ని రాబందులు అమ్ముకుంటున్నాయని అన్నారు. రాబందుల కంటే గాదెల కింద పందికొక్కులు నయం అని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం కన్న పందికొక్కులు నయమని ధర్మపురి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

వివాదం ఏంటంటే
ఇటీవల నిజామాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘నోటాకు ఓటు వేసినా నేనే గెలుస్తా.. కారు గుర్తుకు ఓటేసినా నేనే గెలుస్తా.. హస్తం గుర్తుకు ఓటేసినా నేనే గెలుస్తా..’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ ధర్మపరి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం చెప్పింది. బీజేపీ గెలుపుపై అనుమానం రేపుతున్నాయని ఇతర పార్టీల నాయకులు విమర్శించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 

బీజేపీ నాయకులపై న్యాయబద్ధంగా చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో తప్పుడు భావన కలుగుతుందన్నారు. ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు బీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. అర్వింద్‌ వ్యాఖ్యలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Nara Lokesh: అప్పట్లో డిప్యూటీ సీఎం - ఇప్పుడు సీఎం - నారా లోకేష్‌పై ఈ ప్రచారం వ్యూహాత్మకమేనా?
అప్పట్లో డిప్యూటీ సీఎం - ఇప్పుడు సీఎం - నారా లోకేష్‌పై ఈ ప్రచారం వ్యూహాత్మకమేనా?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Tamil Nadu Assembly Elections 2026: విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?
విడాకుల రచ్చతో ప్రత్యర్థులకు చిక్కిన విజయ్ - ఎలా బయటపడతారు?

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
T20 World Cup 2026: సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
Telugu TV Movies Today: ఈ సోమవారం (మార్చి 02) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
ఈ సోమవారం (మార్చి 02) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Embed widget