అన్వేషించండి

Viyajasai Reddy YSRCP : వైఎస్ఆర్‌సీపీలో విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేసినట్లేనా ? జగన్‌తో గ్యాప్ నిజమేనా ?

వైఎస్ఆర్‌సీపీలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గిపోయింది. ఆయనకు ఒక్క జిల్లా బాధ్యతలుకూడా ఇవ్వలేదు.


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం పూర్తయింది. పార్టీ పరంగా చూస్తే అందరూ "పాపం విజయసాయిరెడ్డి" అనే వాళ్లే. ఎందుకంటే పార్టీ పదవుల్లో ఆయన ప్రాధాన్యం ఒక్క సారిగాపడిపోయింది. ఉత్తరాంధ్రలో తిరుగులేని విధంగా పెత్తనం  చెలాయించిన స్థానం నుంచి ఉనికిలో ఉన్నాయో లేదో తెలియని అనుబంధ సంఘాలకు ఇంచార్జిగా పడిపోయారు. ఎక్కడా రీజనల్ కోఆర్డినేటర్ పదవి దక్కలేదు. గతంలో ఆయన చెలాయించిన అధికారం..  పొందిన ప్రాధాన్యంతో పోలిస్తే ప్రస్తుతం ఆయనకు వైఎస్ఆర్‌సీపీలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నట్లే అనుకోవచ్చు. నిజంగానే వైఎస్ఆర్‌సీపీలో ఆయనకు ప్రాధాన్యం తగ్గుతోందా ? జగన్‌తో గ్యాప్ పెరిగిందా ?
Viyajasai Reddy YSRCP : వైఎస్ఆర్‌సీపీలో విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేసినట్లేనా ? జగన్‌తో గ్యాప్ నిజమేనా ?

ఎన్నికలకు ముందు అంతా తానై నడిపించిన విజయసాయిరెడ్డి !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు ఆ పార్టీ తరపున అందరికీ విజయసాయిరెడ్డి మాత్రమే ఎదురుగా కనిపించేవారు. పార్టీ అధ్యక్షుడు జగన్ అయినా ఏ విషయం అయినా విజయసాయిరెడ్డిని కలవమని చెప్పేవారు. విజయసాయిరెడ్డి అటు ఢిల్లీలో వ్యవహారాలను చక్క బెడుతూ ఇటు ఎన్నికలకు వైఎస్ఆర్‌సీపీని సన్నద్ధం చేయడానికి విస్తృతంగా శ్రమించేవారు. తెలంగాణలో నమోదైన కొన్ని కేసుల్లో టీడీపీని ఇరుకున పెట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. పార్టీ క్యాడర్‌ను ఎప్పటికప్పుడు సన్నద్ధం చేస్తూ వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పట్లో జగన్ వైఎస్ఆర్‌సీపీ మూల విరాట్ అయితే విజయసాయిరెడ్డి పూజారి పొజిషన్‌లో ఉండేవారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించాలని అంటే విజయసాయిరెడ్డి కూడా అంగీకరించాలని అప్పట్లో వైఎస్ఆర్‌సీపీలో ఓ సెటైర్ వినిపించింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు జగన్ మొదటగా అభినందులు తెలిపింది.. అందుకుంది .. విజయసాయిరెడ్డి నుంచే. వారి ఆత్మీయ ఆలింగనం ఫోటోనే బయటకు వచ్చింది.
Viyajasai Reddy YSRCP : వైఎస్ఆర్‌సీపీలో విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేసినట్లేనా ? జగన్‌తో గ్యాప్ నిజమేనా ?

ఎన్నికల తర్వాత ఉత్తరాంధ్రలో కీలక బాధ్యతలు !

వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా ఉంటూ అక్కడి నుంచి కార్యకలాపాలు చక్కబెట్టడం ప్రారంభించారు. నిజానికి వైఎస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ గా ఆయన పదవి. ప్రభుత్వంతో సంబంధం లేదు. కానీ ఆయన ఉత్తరాంధ్ర పాలనను గుప్పిట్లో పెట్టుకున్నారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో వచ్చిన అనేక వివాదాలు.. చివరికి జగన్‌తో గ్యాప్ పెరగడానికి కారణం అయ్యాయన్న ప్రచారం ఉంది. ఉత్తరాంధ్రలో పార్టీ బాధ్యతలు ఎప్పటికీ తన కే ఉంటాయని అనుకున్నారేమో కానీ విజయసాయిరెడ్డి సొంత ఇల్లు, కార్యాలయం వంటి వి కూడా ఏర్పాటు చేసుకున్నారు . కానీ ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ మరోలా ఆలోచించింది. ఆయనకు ఏ ఒక్క జిల్లా బాధ్యతలు ఇవ్వకపోగా అనుబంధ సంఘాల ఇంచార్జ్ పదవితో సరిపెట్టింది.
Viyajasai Reddy YSRCP : వైఎస్ఆర్‌సీపీలో విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేసినట్లేనా ? జగన్‌తో గ్యాప్ నిజమేనా ?

ఇప్పుడు పార్టీలో ప్రభుత్వంలో సజ్జల హవా 

వైఎస్  జగన్ రాజకీయ సలహాదారుగా మొదట పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు తిరుగులేని స్థానానికి చేరుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు గతంలో విజయసాయిరెడ్డి తరహాలో జగన్ తర్వాత అధికార కేంద్రంగా మారారు. పార్టీ వ్యవస్థలపై మొత్తం పట్టు ఆయనదే. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో జిల్లా ఇంచార్జులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లకు కూడా ఆయనే సమన్వయకర్త. ఇప్పటికే ప్రభుత్వంలో ఆయన పోషిస్తున్న పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తంగా జగన్ తర్వాత వైఎస్ఆర్‌సీపీలో అధికార కేంద్రం సజ్జల రామకృష్ణఆరెడ్డినే. నిన్నామొన్నటిదాకా ఆ స్థానాన్ని అనుభవించిన విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గిపోయింది.  వచ్చే జూన్‌లో ఆయన రాజ్యసభ పదవీ కాలం పూర్తవుతుంది. ఆయనకు మరోసారి చాన్స్ కల్పించకపోతే.. మరింత నమ్మకాన్ని విజయసాయిరెడ్డి కోల్పోయినట్లేనని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు భావిస్తున్నాయి.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
Revanth Master Plan: ప్రత్యర్థులను బాధితులను చేయని రేవంత్ రాజకీయం - అరెస్టులు లేకపోవడం వెనుక వ్యూహం ఇదే!
ప్రత్యర్థులను బాధితులను చేయని రేవంత్ రాజకీయం - అరెస్టులు లేకపోవడం వెనుక వ్యూహం ఇదే!
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget