అన్వేషించండి

Governars Vs Governaments : దక్షిణాదిన గవర్నర్లతో బీజేపీ రాజకీయం చేస్తోందా ? మూడు రాష్ట్రాల్లో వివాదాలెందుకు ?

బీజేపీకి దక్షిణాదిలో బలం లేదు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ గవర్నర్లు మాత్రం ఆ ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు. బీజేపీ బలం గవర్నర్లేనా ?


 
Governars Vs Governaments :   దక్షిణాదిలో  కర్నాటక, ఏపీ  తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాల్లోనూ గవర్నర్‌ వర్సెస్‌ సిఎం నువ్వా నేనా తేల్చుకుందాం అన్న రేంజ్‌ లో నడుస్తోంది. నిన్నటివరకు సౌత్‌ వర్సెస్‌ నార్త్‌ అన్నట్లు ఇష్యూ ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీయేతర ప్రభుత్వాలు వర్సెస్‌ గవర్నర్ల జోక్యం అన్న విధంగా మారిపోయింది. అంతేకాదు సౌత్‌ మొత్తం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మారుతోందా అన్న చర్చ మొదలవుతోంది.  నిన్నటివరకు సౌత్‌ లో తెలంగాణకు మాత్రమే పరిమితమైన గవర్నర్‌ సమస్య ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు పాకింది. ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న తమిళనాడు, కేరళలో కూడా గవర్నర్‌ వర్సెస్‌ సిఎం అంశం రాజకీయ దుమారాన్ని లేపుతోంది. దక్షిణా భారతంలో కర్నాటక తప్పించి మిగిలిన అన్నిచోట్లా ప్రాంతీయ పార్టీలే పాలన కొనసాగిస్తున్నాయి. అయితే ఏపీలో జగన్‌ ప్రభుత్వం కేంద్రంతో పాటు బీజేపీతో మైత్రీని కొనసాగిస్తుండటంతో అక్కడి గవర్నర్‌ హరిచందన్‌ తో ఎలాంటి ఇబ్బందులు వైసీపీ ప్రభుత్వానికి రాలేదు. కానీ మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం సీన్‌ రివర్స్‌ లో ఉంది. 

కేసీఆర్ సర్కార్‌కు చిక్కులు తెచ్చి పెడుతున్న గవర్నర్ తమిళిసై 

కొంత కాలంగా తెలంగాణలో  గవర్నర్ తమిళిశై, సీఎం కేసీఆర్ మధ్య సంబంధాలు అంత గొప్పగా లేవు  గవర్నర్‌ గా పగ్గాలు చేపట్టిన మొదట్లో అన్నా చెల్లెళ్లుగా కెసిఆర్‌- తమిళిసై బాగానే ఉన్నారు. కానీ ఎక్కడ చెడిందో తెలియదు కానీ బీజేపీతో కెసిఆర్‌ కి దూరం పెరగడంతో గవర్నర్‌ జోక్యం పెరిగిందని అధికారపార్టీ విమర్శలు చేస్తూ వచ్చింది. లేటెస్ట్‌ గా యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ బిల్లును పెండింగ్‌ వ్యవహారం మరోసారి ఇద్దరి మధ్య అగ్నిరాజేసింది. మునుగోడు ఉప ఎన్నిక రిజల్ట్‌ తర్వాత  గవర్నర్‌ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌ షాని కలిసి వచ్చిన మరుసటి రోజు నుంచి తమిళిసై దూకుడు మరింత పెంచారు. పదవి చేపట్టి మూడేళ్ల పూర్తయిన సందర్భంగా గవర్నర్ తమిళసై ఓ బుక్ ప్రచురించారు. దీన్ని అమిత్ షా కు అందజేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నర్ తమిళసై రాజభవన్ వేదికగా విమర్శానాస్త్రాలు సంధించారు. గతంలో ఏ గవర్నర్ మీడియా మీట్ లు, ప్రెస్ మీట్ లు పెట్టింది లేదు కానీ తెలంగాణ గవర్నర్ కొత్త కల్చర్ కు తెరతీశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించారు. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారేమోనని అనుమానం కలుగుతుందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. ఆమె ప్రైవసీకి భంగం కలుగుతోందని చెప్పారు. ‘తుషార్ నా మాజీ ఏడీసీ. తెలంగాణలో అప్రజాస్వామిక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజల సమస్యల విషయంలో ఎల్లప్పుడూ సానుకూలంగానే స్పందిస్తాను. బిల్లులను తొక్కిపెట్టాననడం సబబు కాదు. బిల్లుపై సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని గవర్నర్‌ అన్నారు. 

రాజకీయ విమర్శలూ చేస్తున్న తమిళిసై !

ప్రగతి భవన్‌లా కాదు.. రాజ్‌భవన్‌ తలుపులు తెరిచే ఉంటాయని చెబుతూ.. రాజకీయ విమర్శలు కూడా గవర్నర్ చేస్తున్నారు. కొంత మంది ప్రొటోకాల్‌ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. నా పర్యటనలకు సంబంధించి పూర్తి వివరాలు ముందుగానే సంబంధిత అధికారులకు పంపిస్తాను. గతంలో నా పర్యటనల్లో ప్రొటోకాల్‌ పాటించని కలెక్టర్లు, ఎస్పీలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలి. మీరు ప్రొటోకాల్‌ పాటించేవారైతే గవర్నర్‌కు స్వాగతం పలికేందుకు రాని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు మీకు నచ్చినట్లు చేయొచ్చు.. ప్రతిఒక్కరిపై ఆరోపణలు చేయొచ్చు. కేవలం రాజ్‌భవన్‌ గౌరవాన్ని దిగజార్చేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా రాజ్‌భవన్‌కు వెళ్లి నిరసన తెలపాలని చెబుతున్నారు. రాజ్‌భవన్‌ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఎంతో మంది వచ్చి కలుస్తున్నారు. ఇక్కడికి వచ్చేవారిని ఎవరూ అడ్డుకోవడం లేదు. ప్రగతిభవన్‌లా కాదు.. రాజ్‌భవన్‌ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎవరైనా రాజ్‌భవన్‌కు రావొచ్చు... విజ్ఞప్తులు ఇవ్వొచ్చు'' అని గవర్నర్‌ తెలిపారు.

తమిళనాడు గవర్నర్‌ను తొలగించాలంటున్న డీఎంకే !

తమిళనాడు గవర్నర్‌ కూడా డిఎంకె ప్రభుత్వంతో ఢీ కొడుతున్నారు. ఇటీవల అధికారపార్టీతోపాటు పలు తమిళపార్టీలు హిందీ భాషని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. దీంతో మొన్నటివరకు ప్రశాంతంగా ఉన్న తమిళనాడులో ఇప్పుడు గవర్నర్‌ వర్సెస్‌ సిఎం మధ్య నిప్పు రాజేసుకుంది. అసలు మాకు ఈ గవర్నర్‌ వద్దని తమిళనాడు సిఎం స్టాలిన్‌ ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాయడం రాజకీయ దుమారాన్ని లేపుతోంది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదు. వెనక్కి పంపిస్తున్నారు.  పాలనకు అడ్డం పడుతున్నారని స్టాలిన్ మండి పడుతున్నారు. 

కేరళలో యూనివర్శిటీలకు గవర్నర్ చాన్సలర్ కాదని ఆర్డినెన్స్ తెచ్చిన ప్రభుత్వం ! 

కేరళలో కూడా సేమ్‌ సీన్‌ రిపీటవుతోంది. యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్ల నియామకం బిల్లు ఆమోదంపై మొదలైన  వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. గవర్నర్‌ జోక్యాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న చట్ట సవరణ బిల్లుపై ఆమోదానికి ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ పెండింగ్‌ లో పెట్టడంతో రాజ్‌ భవన్‌ ఎదుట అధికారపార్టీ నేతలు నిరసనకు దిగుతున్నారు. నిన్నటివరకు ఢిల్లీ, బెంగాల్లో సాగిన గవర్నర్‌ వర్సెస్‌ సిఎం వ్యవహారం ఇప్పుడు ఇప్పుడు సౌత్‌ లో ఎలాంటి మలుపు తీసుకుంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu coalition formula: కూటమి పార్టీలతో ఇగోలకు పోతే ఇబ్బందే - చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్ - ఇక నియోజకవర్గాల్లో అంతా సర్దుకుంటుందా?
కూటమి పార్టీలతో ఇగోలకు పోతే ఇబ్బందే - చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్ - ఇక నియోజకవర్గాల్లో అంతా సర్దుకుంటుందా?
Kavitha Name Mistakes: కవిత బిగినర్స్ మిస్టేక్స్ - పేరులోనే తడబాటు.. అసలు వ్యూహం ఎక్కడ తప్పింది?
కవిత బిగినర్స్ మిస్టేక్స్ - పేరులోనే తడబాటు.. అసలు వ్యూహం ఎక్కడ తప్పింది?
TRS Party: కవిత టీఆర్‌ఎస్ పార్టీకి ఈసీ ఓకే కానీ పేరులో చిన్న మార్పు! రక్షణ సేనగా మారిన రాష్ట్ర సేన!
కవిత టీఆర్‌ఎస్ పార్టీకి ఈసీ ఓకే కానీ పేరులో చిన్న మార్పు! రక్షణ సేనగా మారిన రాష్ట్ర సేన!
Exit Poll Results: తమిళనాడులో విజయ్ సంచలనం! బెంగాల్‌లో బీజేపీకి ఆధిక్యం! ఎగ్జిట్ పోల్స్ చెప్పిన జోస్యం ఏంటీ?
తమిళనాడులో విజయ్ సంచలనం! బెంగాల్‌లో బీజేపీకి ఆధిక్యం! ఎగ్జిట్ పోల్స్ చెప్పిన జోస్యం ఏంటీ?

వీడియోలు

Mumbai Indians Batting Failure IPL 2026 | ముంబై వరుస పరాజయాలకు కారణం ఏంటి ?
Yuvi, Travis plan behind Abhishek Success IPL 2026 | అభిషేక్ విధ్వంసం వెనుక రహస్యం ఇదే
Ryan Rickelton Breaks Record IPL 2026 | 18 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన ర్యాన్ రికెల్టన్
Vaibhav Suryavanshi Performance IPl 2026 | వైభవ్ విధ్వంసానికి గవాస్కర్ ఫిదా
SRH vs MI Highlights IPL 2026 | ముంబైపై సన్‌రైజర్స్ అదిరే విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Fire Accident: బహదూర్‌పురాలోని టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం, హైదరాబాద్ వాసులను వణికిస్తున్న వరుస ఘటనలు
బహదూర్‌పురాలోని టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం, హైదరాబాద్ వాసులను వణికిస్తున్న వరుస ఘటనలు
Dinner with the Real Winners: డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్ - చంద్రబాబు విందు భేటీ విశేషాలు ఇవిగో
డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్ - చంద్రబాబు విందు భేటీ విశేషాలు ఇవిగో
IPL 2026 GT VS RCB Result Update: లో స్కోరింగ్ థ్రిల్లర్ లో జీటీ ఈజీ విక్ట‌రీ.. శుభ‌మాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాణించిన అర్ష‌ద్, ర‌షీద్, ఆర్సీబీకి షాక్
లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో జీటీ ఈజీ విక్ట‌రీ.. శుభ‌మాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాణించిన అర్ష‌ద్, ర‌షీద్, ఆర్సీబీకి షాక్
AP Crime News: చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
Riyan Parag Fined: డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ పరాగ్ వేపింగ్.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌పై బీసీసీఐ కొరడా! భారీ జరిమానా విధింపు
డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ పరాగ్ వేపింగ్.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌పై బీసీసీఐ కొరడా! భారీ జరిమానా విధింపు
Adilabad Latest News: ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!
ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!
Hyderabad Real Estate News: ప్రగతీనగర్, నిజాంపేట్‌ రియల్టర్స్‌ను వేధిస్తున్న ఏజ్‌బార్ సమస్య! పెళ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోతున్న బిల్డింగ్స్!
ప్రగతీనగర్, నిజాంపేట్‌ రియల్టర్స్‌ను వేధిస్తున్న ఏజ్‌బార్ సమస్య! పెళ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోతున్న బిల్డింగ్స్!
Andhra Pradesh Cabinet meeting: ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124 కోట్లు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124 కోట్లు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
Embed widget