అన్వేషించండి

Pawan Kalyan : పర్యావరణాన్ని రక్షించేందుకు పవన్ పిలుపు - జగన్‌ను ఇరాకాటంలో పెట్టేలా ట్వీట్లు !

పర్యావరణం విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతున్న పర్యావరణ విధ్వంసం వివరాలు బయటపెడదామని పిలుపునిచ్చారు.

 

Pawan Kalyan :   పర్యావరణాన్ని పరిరక్షిస్తామని విశాఖలో సీఎం జగన్ ప్రకటించారు. అప్పటికప్పుడు ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ అంశంపై జనసేనాధిత పవన్ కల్యాణ్ స్పందించారు.  జనసేన మూల సిద్దాంతాల్లో ఒకటి  పర్యావరణ పరిరక్షణ అని ప్రభుత్వానికి ఇప్పటికైనా ఈ అంశంపై శ్రద్ధ కలిగిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాదు..  ఇప్పటికైనా పర్యావరణానికి తీవ్రంగా నష్టం కలిగిస్తున్న మైనింగ్, ఫార్మా, సిమెంట్ , రసాయన కంపెనీల కాలుష్యాన్ని బయటకు తీద్దామని పిలుపునిచ్చారు. అడ్డగోలుగా మైనింగ్ చేస్తూ.. పర్యావరణాన్ని హరిస్తున్న ప్రభుత్వ శాఖల వ్యవహారాలను కూడా వెలుగులోకి తెద్దామని  ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు. 

కాలుష్య కారక పారిశ్రామిక సంస్థల ఏర్పాటు సమయంలో తీసుకోవాల్సిన ప్రజాభిప్రాయసేకరమను.. ప్రభుత్వం పోలీసుల్ని పెట్టి ఏకపక్షంగా నిర్వహిస్తోందని.. ఇలాంటి వాటిని కూడా వెల్లడించే సమయం వచ్చిందని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అకస్మాత్తుగా పర్యావరణ ప్రేమికులుగా మారిన పాలకుల దగ్గర ఈ వివరాలు ఉన్నాయో..లేదోనని పవన్ కల్యాణ్ సందేహం వ్యక్తం చేశారు. 

పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ట్వీట్లు పర్యావరణం విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేవిగా ఉన్నాయి. ప్రధానంగా  గత మూడేళ్లుగా ఏపీలో అనేక రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయి. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఈ అంశాన్నే టార్గెట్ చే్సతూ.. మైనింగ్, ఫార్మా , సిమెంట్ , రసాయన పరిశ్రమల కాలుష్యం గురించి బయటకు తేవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేసినట్లుగా భావిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ కాలుష్యంపై అనేక ఆరోపణలు విపక్షాలు చేస్తూ ఉంటాయి. 

అదే సమయంలో పర్యావరణ విషయంలో ఏపీ ప్రభుత్వంపై అతి పెద్ద మరక.. రుషికొండ రూపంలో ఉంది. అందమైన రుషికొండను పూర్తిగా తొలిచేసి.. అక్కడ టూరిజం ప్రాజెక్టును కడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పును సైతం పట్టించుకోకుండా నిర్మాణాలు చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ఏపీలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతోందని.. లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను కూడా తవ్వుతున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు సీఎం జగన్ కాలుష్యంపై స్పందించి.. పర్యావరణంపై కీలకమైన ప్రకటనలు చేసినందున ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి ఇదే సరైన సమయంగా పవన్ కల్యాణ్ భావించినట్లుగా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Embed widget