అన్వేషించండి

Pawan Kalyan : పర్యావరణాన్ని రక్షించేందుకు పవన్ పిలుపు - జగన్‌ను ఇరాకాటంలో పెట్టేలా ట్వీట్లు !

పర్యావరణం విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతున్న పర్యావరణ విధ్వంసం వివరాలు బయటపెడదామని పిలుపునిచ్చారు.

 

Pawan Kalyan :   పర్యావరణాన్ని పరిరక్షిస్తామని విశాఖలో సీఎం జగన్ ప్రకటించారు. అప్పటికప్పుడు ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ అంశంపై జనసేనాధిత పవన్ కల్యాణ్ స్పందించారు.  జనసేన మూల సిద్దాంతాల్లో ఒకటి  పర్యావరణ పరిరక్షణ అని ప్రభుత్వానికి ఇప్పటికైనా ఈ అంశంపై శ్రద్ధ కలిగిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాదు..  ఇప్పటికైనా పర్యావరణానికి తీవ్రంగా నష్టం కలిగిస్తున్న మైనింగ్, ఫార్మా, సిమెంట్ , రసాయన కంపెనీల కాలుష్యాన్ని బయటకు తీద్దామని పిలుపునిచ్చారు. అడ్డగోలుగా మైనింగ్ చేస్తూ.. పర్యావరణాన్ని హరిస్తున్న ప్రభుత్వ శాఖల వ్యవహారాలను కూడా వెలుగులోకి తెద్దామని  ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు. 

కాలుష్య కారక పారిశ్రామిక సంస్థల ఏర్పాటు సమయంలో తీసుకోవాల్సిన ప్రజాభిప్రాయసేకరమను.. ప్రభుత్వం పోలీసుల్ని పెట్టి ఏకపక్షంగా నిర్వహిస్తోందని.. ఇలాంటి వాటిని కూడా వెల్లడించే సమయం వచ్చిందని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అకస్మాత్తుగా పర్యావరణ ప్రేమికులుగా మారిన పాలకుల దగ్గర ఈ వివరాలు ఉన్నాయో..లేదోనని పవన్ కల్యాణ్ సందేహం వ్యక్తం చేశారు. 

పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ట్వీట్లు పర్యావరణం విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేవిగా ఉన్నాయి. ప్రధానంగా  గత మూడేళ్లుగా ఏపీలో అనేక రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయి. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఈ అంశాన్నే టార్గెట్ చే్సతూ.. మైనింగ్, ఫార్మా , సిమెంట్ , రసాయన పరిశ్రమల కాలుష్యం గురించి బయటకు తేవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేసినట్లుగా భావిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ కాలుష్యంపై అనేక ఆరోపణలు విపక్షాలు చేస్తూ ఉంటాయి. 

అదే సమయంలో పర్యావరణ విషయంలో ఏపీ ప్రభుత్వంపై అతి పెద్ద మరక.. రుషికొండ రూపంలో ఉంది. అందమైన రుషికొండను పూర్తిగా తొలిచేసి.. అక్కడ టూరిజం ప్రాజెక్టును కడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పును సైతం పట్టించుకోకుండా నిర్మాణాలు చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ఏపీలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతోందని.. లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను కూడా తవ్వుతున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు సీఎం జగన్ కాలుష్యంపై స్పందించి.. పర్యావరణంపై కీలకమైన ప్రకటనలు చేసినందున ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి ఇదే సరైన సమయంగా పవన్ కల్యాణ్ భావించినట్లుగా తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Rakshana Sena: తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
Keralam CM Oath Taking: కేరళం కొత్త సీఎంగా వి.డి సతీశన్ ప్రమాణం.. 14 మంది కొత్త వారికి మంత్రి పదవులతో రికార్డ్
కేరళం కొత్త సీఎంగా వి.డి సతీశన్ ప్రమాణం.. 14 మంది కొత్త వారికి మంత్రి పదవులతో రికార్డ్
Thalapathy Vijay: మిత్రపక్షాల డిమాండ్లు, అన్నాడీఎంకే రెబల్స్ ఆశలు - కేబినెట్ విస్తరణే విజయ్‌ ముందున్న పెద్ద సమస్య - తేడా వస్తే?
మిత్రపక్షాల డిమాండ్లు, అన్నాడీఎంకే రెబల్స్ ఆశలు - కేబినెట్ విస్తరణే విజయ్‌ ముందున్న పెద్ద సమస్య - తేడా వస్తే?
AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Rakshana Sena: తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
Dollar vs Indian Rupee: డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో భారత రూపాయి ఢమాల్.. ఆల్ టైమ్ కనిష్టానికి కరెన్సీ
Supreme Court: హైదరాబాద్‌లో KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
హైదరాబాద్‌లో KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే
AP Rajya Sabha Elections: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి రెండే - మిత్రపక్షాలకు రెండు - త్యాగాలు తప్పవా ?
Viral News: చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
చంద్రగిరిలో ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు కలకలం.. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని
India Hottest Cities: భగభగ మండుతున్న భారత్.. భూమిపై 50 వేడినగరాలు మనదేశంలోనే...!
భగభగ మండుతున్న భారత్.. భూమిపై 50 వేడినగరాలు మనదేశంలోనే...!
Indian Student Dies In US: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నల్గొండ విద్యార్థిని మృతి.. మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Embed widget