అన్వేషించండి

Chandrababu : వాలంటీర్లకు రూ. 50వేలు ఆదాయం వచ్చేలా చేస్తా - చంద్రబాబు భరోసా !

Andhra News : వైసీపీ చెప్పినట్లుగా చేస్తే వాలంటీర్లు జైలుకు వెళ్తారని చంద్రబాబు హెచ్చరించారు. నీతి నిజాయితీగా ఉంటే టీడీపీ ప్రభుత్వం వచ్చాక రూ.30 నుంచి రూ. 50వేల జీతం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Chandrababu At Kuppam :  వాలంటీర్లకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. . వాలంటీర్లు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదన వచ్చేలా వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. వారి జీవితాలు మారుస్తామన్నారు. వారు నీతి, నిజాయితీగా ఉండాలని . వైసీపీ చెప్పిన పనులు చేస్తే మాత్రం జైలుకెళ్తారని హెచ్చరించారు. కుప్పంలో యువతతో చంద్రబాబు సమావేశం అయ్యారు.  తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు నిర్మిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇంటి నుంచే పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు.

 టీడీపీ అధికారంలోకి రాగానే 60  రోజుల్లో మెగా డీఎస్సీ               

కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యువతతో భేటీ అయ్యారు. యువతకు సామాజిక బాధ్యత ఉండాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఏటా జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తామని సీఎం వైఎస్ జగన్ యువతను మోసం చేశారని చంద్రబాబు విమర్శించారు. గత ఐదేళ్లలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు మాత్రం డీఎస్సీ పేరుతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. గ్రూప్‌-1 ఉద్యోగాలను నచ్చినవారికి ఇచ్చుకున్నారని ఆరోపించారు.

ఏపీని కాపాడుకునేందుకే పొత్తులు                         

ఏపీని కాాపాడుకునేందుకు పొత్తులు పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ, జనసేన , బీజేపీ అందుకే కలిశాయన్నారు. జెండాలు వేరైనా.. అజెండా మాత్రం ఒక్కటేనని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.  వైసీపీ నేతలు భూములు కొల్లగొడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. సర్వే నంబర్స్ మార్చి ప్రజల భూములను ఆక్రమించుకుంటున్నారని తెలిపారు. సొంత నియోజకవర్గం కప్పుంలోనూ తనకు బెదిరింపులు తప్పటం లేదన్నారు. ఇక ఏపీలో సామాన్యుల పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలన్నారు. ఏపీలో ఖనిజ సంపదను వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయని మండిపడ్డారు. ఇలా అడ్డదారుల్లో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా వైసీపీ నేతలు ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

వంద రోజుల్జేలో   బ్రాండ్ మద్య నిషేధం                         

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జే బ్రాండ్ మద్యాన్ని నిషేధిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. తన హయాంలో యువతకు ఐటీ ఉద్యోగాలతో కొత్తదారి చూపించానని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అక్రమార్కుల చేతుల్లో పడితే చాలా ప్రమాదకరమని చంద్రబాబు హెచ్చరించారు. పారదర్శకంగా జరగాల్సిన పాలనలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. టెండర్స్ లోనూ అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రెండు రోజుల పాటు కుప్పంలో విస్తృతంగా పర్యటించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News: వైసీపీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వైసీపీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Delhi Election Exit Poll: ఢిల్లీ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీకే ఎడ్జ్ అంటున్న ఎగ్జిట్ పోల్స్
ఢిల్లీ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీకే ఎడ్జ్ అంటున్న ఎగ్జిట్ పోల్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ - గురువారం కేబినెట్ భేటీకి కూడా దూరం !
పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ - గురువారం కేబినెట్ భేటీకి కూడా దూరం !
Teenmar Mallanna:  తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ - కాంగ్రెస్ నాయకత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు - వేటు తప్పదా ?
తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ - కాంగ్రెస్ నాయకత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు - వేటు తప్పదా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mangli Ram Mohan Naidu Issue | కేంద్రమంత్రి రామ్మోహన్ పై మండిపడుతున్న టీడీపీ కార్యకర్తలు | ABP DesamPM Modi Maha Kumbh 2025 | మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన ప్రధాని మోదీ | ABP DesamNaga Chaitanya Thandel Real Story Ramarao | చైతూ రిలీజ్ చేస్తున్న తండేల్ కథ ఇతనిదే | ABP DesamTrump on Gaza Strip | ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలోకి అమెరికా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News: వైసీపీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వైసీపీ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Delhi Election Exit Poll: ఢిల్లీ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీకే ఎడ్జ్ అంటున్న ఎగ్జిట్ పోల్స్
ఢిల్లీ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీకే ఎడ్జ్ అంటున్న ఎగ్జిట్ పోల్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ - గురువారం కేబినెట్ భేటీకి కూడా దూరం !
పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ - గురువారం కేబినెట్ భేటీకి కూడా దూరం !
Teenmar Mallanna:  తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ - కాంగ్రెస్ నాయకత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు - వేటు తప్పదా ?
తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ - కాంగ్రెస్ నాయకత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు - వేటు తప్పదా ?
AP Graduate MLC Elections 2024: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైసీపీ నేతలు- కూటమికి మేలు చేయడానికా? కీడు చేయడానికా? 
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైసీపీ నేతలు- కూటమికి మేలు చేయడానికా? కీడు చేయడానికా? 
TG TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే
Telangana News: తెలంగాణలో రైతులకు రేవంత్‌ సర్కార్ శుభవార్త-  ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ
తెలంగాణలో రైతులకు రేవంత్‌ సర్కార్ శుభవార్త- ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ
Naga Chaitanya: నేషనల్ అవార్డ్స్ కాదు... ఆడియన్స్‌ని అలరించడం నాకు మోస్ట్ ఇంపార్టెంట్ - నాగచైతన్య ఇంటర్వ్యూ
నేషనల్ అవార్డ్స్ కాదు... ఆడియన్స్‌ని అలరించడం నాకు మోస్ట్ ఇంపార్టెంట్ - నాగచైతన్య ఇంటర్వ్యూ
Embed widget