అన్వేషించండి

KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు

Telangana News: సీఎం రేవంత్ రెడ్డి 28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తీసుకురాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. లగచర్ల బాధిత రైతులకు మద్దతుగా మానుకోట ధర్నాలో ఆయన పాల్గొన్నారు.

KTR Comments On CM Revanth Reddy: తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక స్థానం ఉందని.. 14 ఏళ్ల కిందట కీలక మలుపునకు కారణమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. లగచర్ల బాధిత రైతులకు మద్దతుగా మహబూబాబాద్‌లో (Mahabubabad) బీఆర్ఎస్  మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు గుంజుకుంటా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్న కొత్త నియంత రేవంత్‌కు బుద్ధి చెప్పేందుకు అదే మానుకోట సిద్దమైందని అన్నారు. 'కొడంగల్‌లో 9 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు తిరగబడ్డారు. 3 వేల ఎకరాలను గుంజుకోవాలని సీఎం ప్రయత్నిస్తున్నారు. తమ భూములు లాక్కోవద్దని కొడంగల్ రైతులు కోరుతున్నా.. అక్కడి వారి బాధలు వినే తీరిక, ఓపిక సీఎంకు లేదు. ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి 28 సార్లు ఢిల్లీకి పోయిండు. కనీసం రూ.28 కూడా తీసుకురాలేదు. సొంత నియోజకవర్గంలోనే సీఎంపై ప్రజలు తిరగబడుతున్నారు.' అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

'అదీ రైతుల పవర్'

'లగచర్లలో దాడి జరిగితే మానుకోటలో ధర్నా ఎందుకని పోలీసులు అంటున్నారు. ఎక్కడ గిరిజన, ఎస్సీ, బీసీ, బడుగు రైతులు ఉంటారో అక్కడ ధర్నా చేస్తాం. ఈ సీఎం అదానీ కోసం పని చేస్తున్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఏడాది పూర్తవుతోంది. వాటిని అమలు చేశారా.?. మొన్న అధికారులు పోతే ప్రజలు నిరసన తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి పోయి ఉంటే ఉరికించి, ఉరికించి కొట్టేవారు. ఢిల్లీలో రైతులు ఏడాది పాటు ఆందోళన చేసి మోదీ లాంటి వ్యక్తినే నల్ల చట్టాల నుంచి వెనక్కి తగ్గేలా చేశారు. రైతుల పవర్ అంటే అలా ఉంటుంది. రైతులతో పెట్టుకున్న ఈ రేవంత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పే సమయం వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించే దాకా వదిలిపెట్టమని చెబుతున్నా. రేవంత్ రెడ్డి వచ్చాక రైతుబంధు ఎగ్గొంట్టిండు. ఫించన్ పెంచలేదు. బోనస్ బోగస్ అయ్యింది. ఆడ బిడ్డలకు మహాలక్ష్మి స్కీం వచ్చిందా?. మహారాష్ట్రకు పోయి కూడా ఆడబిడ్డలను మోసం చేసే ప్రయత్నం చేస్తే అక్కడి ఆడబిడ్డలు బుద్ధి చెప్పారు.' అని కేటీఆర్ మండిపడ్డారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసులుండవా?

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే, పెట్రోల్ పోస్తామంటే భయపడతామా? మేము కేసీఆర్ తయారు చేసిన దళం. భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ అన్నారు. 'లగచర్లలో 30 మంది రైతులను జైల్లో పెడితే మా బంజారా ఆడబిడ్డలు భయపడలేదు. ఎన్‌‌హెచ్ఆర్‌సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళ కమిషన్ సభ్యులకు వాళ్ల బాధలు చెబుతుంటే కమిషన్ సభ్యుల కళ్లలో నీళ్లు వచ్చాయి. లగచర్లలో జరిగినట్లే రాష్ట్రంలో ఎక్కడైనా జరగవచ్చు. ఒక దగ్గర అన్యాయం జరిగితే రాష్ట్రమంతా కదం తొక్కాలి. తెలంగాణలో ఏ గిరిజన బిడ్డ కు అన్యాయైన రాష్ట్రమంతా గిరిజన బిడ్డలు కదం తొక్కాలని కోరుతున్నా. మానుకోట మహాధర్నా మొదటి అడుగు మాత్రమే. మన లగచర్ల గిరిజన మహిళలకు న్యాయం జరిగేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగడుతాం. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు... బంజారా రాష్ట్ర సమితి కూడా. మీకు ఎప్పుడు కష్టమొచ్చినా మేము అండగా ఉంటాం.' అని పేర్కొన్నారు.

Also Read: Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rahul Jiu-Jitsu Strategy: రాహుల్ జియాజిట్సు వ్యూహం - మార్షల్ ఆర్ట్స్ పాఠాలు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశాయా ?
రాహుల్ జియాజిట్సు వ్యూహం - మార్షల్ ఆర్ట్స్ పాఠాలు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశాయా ?
Bengal Assembly Elections 2026 : బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
Telangana Govt: కూల్చివేతల్లో ప్రజాస్వామ్య దారి మర్చిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం - వ్యతిరేకతను ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
కూల్చివేతల్లో ప్రజాస్వామ్య దారి మర్చిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం - వ్యతిరేకతను ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Ayatollah Khomeini trap Story: సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
Iran Israel War 2026: ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ సమయంలో వైరల్ అవుతున్న బాబా వాంగ భవిష్యవాణి!
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ సమయంలో వైరల్ అవుతున్న బాబా వాంగ భవిష్యవాణి!
Embed widget