అన్వేషించండి

Munugodu Bypoll: మునుగోడులో సత్తా చాటేందుకు బీజేపీ ప్లాన్, నేడు అమిత్ షా పర్యటన

Munugodu Bypoll: మునుగోడు ఎన్నికలపై పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.

Munugodu Bypoll: తెలంగాణ రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి. ఒకదాని తర్వాత మరో ఉప ఎన్నిక వస్తూ రాజకీయ కాక రేపుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఇప్పుడు మునుగోడు బైపోల్ గురించి రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికలో ఎలాగైన సత్తా చాటాలని ప్రముఖ పార్టీల నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఆ పార్టీయే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ నాయకులు బలంగా నమ్ముతున్నారు. 


రాష్ట్రరాజకీయాల్లో మునుగోడు కాక

రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు చాలా టైమే ఉంది. కానీ మునుగోడు ఎన్నిక ఆ సమయాన్ని కుదిస్తుందని అంతా అనుకుంటున్నారు. పార్టీలేవి రాజీపడే ధోరణితో అస్సలే లేవు. మునుగోడు ఉప ఎన్నికను అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అక్కడా, ఇక్కడా ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ సవాలుగా తీసుకున్నాయి. తమ బలాన్ని, బలగాన్ని, ఆర్థిక పుష్టిని చూపించడానికి సిద్ధంగా ఉన్నాయి. హుజూరాబాద్ బైపోల్ రాష్ట్ర చరిత్రలో అత్యంత కాస్ట్లీగా నిలిచాయి. అయితే మునుగోడు ఎన్నిక దాని కంటే ఎక్కువ రేంజ్ కు చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 


టీఆర్ఎస్ కు దీటుగా ఉండేలా..
 
ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు పోరులో ఒక అడుగు ముందే ఉన్నారు. ఇప్పటికే ప్రజా దీవెన పేరుతో భారీ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు, నీళ్ల పంపకాలు వంటి అంశాలపై చాలా విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే చాలా అంశాలను లేవనెత్తారు. కేసీఆర్ మాటల దాడి తీవ్రంగా ఉండటంతో అదే స్థాయిలో వాటిని తిప్పికొట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది బీజేపీ. కేసీఆర్ చేసిన విమర్శలను ధాటిగా బదులివ్వాలని వ్యూహ రచన చేస్తున్నారు కమలదళ నాయకులు. మునుగోడులో భారీ సభ నిర్వహించాలని అనుకుంటోంది బీజేపీ. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అమిత్ షా పర్యటన కొనసాగనుంది. అయితే మునుగోడు సభలో అమిత్ షా ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

భారీగా జనసమీకరణపై దృష్టి

ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన ప్రజా దీవెన సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆ ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోయింది. దీంతో టీఆర్ఎస్ సభను తలదన్నేలా మరింత గ్రాండ్ గా ఉండేలా సభను నిర్వహించాలని బీజేపీ నాయకులు ప్రణాళికలు వేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకునే బీజేపీ.. ఈ సభతో మరోసారి తమ సత్తా చాటాలని అనుకుంటోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జనాలను మునుగోడు సభకు తరలించాలని ప్రణాళిక రచిస్తున్నారు. అమిత్ షా సభలోనే మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. 

షా టూర్ షెడ్యూల్

ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అమిత్ షా బేగంపేటకు చేరుకుంటారు. తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. తర్వాత భాజపా కార్యకర్త ఇంటికి, ఆతర్వాత రైతులతో సమావేశమవుతారు. సాయంత్రం 5 గంటలకు మునుగోడు సభలో షా పాల్గొంటారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget