అన్వేషించండి

తెలంగాణలో విభేదాలపై బీజేపీ ఫోకస్- పార్టీ లైన్ దాటొద్దని నడ్డా స్వీట్ వార్నింగ్- అసంతృప్తులతో ఈటల మీటింగ్

తెలంగాణలో ఆదివారం పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ నేతలకు క్లాస్ తీసుకున్నారు. పదకొండు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులతో సమావేశం అనంతరం తెలంగాణ నేతలతో మాట్లాడారు.

అధ్యక్షుడి మార్పుతో తెలంగాణ బీజేపీలో ఏర్పడిన గ్యాప్స్‌ను పూడ్చే పనిలో అధినాయకత్వం ఉంది. ఏకంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతలకు క్లాస్ తీసుకున్నారు. పార్టీ లైన్ దాటి మాట్లాడిన వారిపై సీరియస్‌గా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

తెలంగాణలో ఆదివారం పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ నేతలకు క్లాస్ తీసుకున్నారు. పదకొండు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులతో సమావేశం అనంతరం తెలంగాణ నేతలతో మాట్లాడారు. కిషన్‌ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత జరిగిన ఈ తొలి భేటీ చాలా హాట్‌హాట్‌గా జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు బీఎల్‌ సంతోష్‌, ప్రకాష్‌ జవదేకర్‌, సునీల్ బన్సల్‌, తరుణ్‌చుగ్‌, ఈటలరాజేందర్, బండి సంజయ్‌, లక్ష్మణ్‌, వివేక్‌, డీకే అరుణ, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. 

ఈ మధ్య కాలంలో తెలంగాణ బీజేపీలో తలెత్తిన పరిణామాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. కొందరు నాయకులు నేరుగా అధినాయకత్వాన్ని విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా వచ్చే ఎన్నికలు పార్టీ విజయం కోసం పని చేయాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అంతా రెడీగా ఉండాలన్నారు. అదే లక్ష్యంతో పని చేయాలి కానీ విభేదాలతో పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని హితవుపలికారు. ఎన్నికల కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలని నేతలకు నడ్డా ఆదేశించారు. వాటితో నిత్యం ప్రజల్లో ఉంటూ కేంద్రం చేపట్టిన పథకాలు వివరిస్తూనే ప్రజాసమస్యపై పోరాడాలని సూచించారు. 

మరోవైపు అసంతృప్తులను బుజ్జగించే పని కూడా నేతలు ప్రారంభించారు. ఈ పనిని సీనియర్ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ ఛైర్మన్‌గా ఉన్న ఈటల అసంతృప్త నేతలతో నేరుగా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అన్నీ సర్దుకుంటాయని ఆయన పార్టీ మాటగా చెబుతున్నారు. 

బండి సంజయ్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొందరు, పార్టీ అధ్యక్షుడు మారిన తర్వాత మరికొందరు, బీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పదం ఉందని ఇంకొందరు ఇలా చాలా మంది నేతలు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు. వీళ్లందరినీ కలిసి మాట్లాడాలని ఈటల రాజేందర్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కొందరితో ఫోన్‌లో మాట్లాడారు. మరికొందరిని నేరుగా కలిశారు. దాదాపు అందర్నీ కలిసి పార్టీ మార్పుపై ఎలాంటీ నిర్ణయాలు తీసుకోవద్దని చెబుతున్నారు. చెప్పబోతున్నారు. 

ఈటల రాజేందర్‌ పనిలో పనిగా తనకు వ్యతిరేకంగా పని చేసే వారిని కూడా కలుపుకొని వెళ్లాలని నిర్ణయించారట. అందుకే వారితో కూడా సమావేశాలు ఏర్పాటు చేయాలని భావించారు. ఇప్పటికే తన ఈ మధ్య మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డితో సమావేశమయ్యారు. చాలా సమయం ఇద్దరూ చర్చలు జరిపారు. ఆదివారం చంద్రశేఖర్, గరికపాటి మోహన్‌రావును ఈటల కలిశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NEET 2026 Paper Leak: నీట్, సీబీఎస్ఈ వివాదాలతో కేంద్రంపై యువతలో వ్యతిరేకత - దేవేంద్ర ప్రధాన్ పదవికి ముప్పు?
నీట్, సీబీఎస్ఈ వివాదాలతో కేంద్రంపై యువతలో వ్యతిరేకత - దేవేంద్ర ప్రధాన్ పదవికి ముప్పు?
Revanth Reddy Sentiment Politics: తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు - భాగమవుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - రేవంత్ ప్లానేంటి?
తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు - భాగమవుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - రేవంత్ ప్లానేంటి?
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Sweet Cravings During Weight Loss : బరువు తగ్గాలని షుగర్స్ మానేశారా? స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఈ హెల్తీ ఆప్షన్స్ ట్రై చేయండి
బరువు తగ్గాలని షుగర్స్ మానేశారా? స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఈ హెల్తీ ఆప్షన్స్ ట్రై చేయండి
Vaibhav Suryavanshi Records: ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
Embed widget