By: ABP Desam | Updated at : 14 Mar 2022 05:27 PM (IST)
ప్రశాంత్ కిశోర్కు బీజేపీ కౌంటర్ - తెలంగాణకు " యూపీ విన్నింగ్ టీం "
తెలంగాణలో జెండా పాతేందుకు బీజేపీ హైకమాండ్ ప్రత్యేకమైన వ్యూహాలు అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఉత్తరప్రదేశ్ లో విజయం తర్వాత ఆ పార్టీ దృష్టి అంతా.. తెలంగాణపైనే ఉందని ఇప్పటికే స్పష్టమయింది. దక్షిణాదిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే రెండో రాష్ట్రం తెలంగాణ అవుతుందని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతూ వస్తున్నారు. అయితే ఇది ఆషామాషీగా కాదు. కష్టపడాలి. వ్యూహాలు పన్నాలి. ఆ వ్యూహాలు ప్రత్యర్థులకు అందకుండా ఉండాలి. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యూహకర్తగా లక్కీ హ్యాండ్ ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. ఆయనను మించిన వ్యూహాకర్తలను పెట్టుకోవాలి. వీటన్నింటినీ బీజేపీ ఎప్పుడో పూర్తి చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్తో యుద్ధానికి సన్నాహాలు కూడా పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
యూపీలో బీజేపీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికీ అనితర సాధ్యమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంలో ప్రధాన కారణాల్లో ఒకటి బీజేపీ స్ట్రాటజీ టీం. అరవై మంది ప్రత్యేక నిపుణుల బృందాన్ని యూపీ ఎన్నికల కోసం బీజేపీ నియమించింది. వారంతా పక్కా ప్రొఫెషనల్స్. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని... దానికి తగ్గట్లుగా రాజకీయ సలహాలు ఇవ్వడంలో వారు ఏ మాత్రం ఆలోచించరు. వారి సూచనలతోనే ప్రధానమంత్రి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. యూపీ ఎన్నికల విజయంతో వారి మిషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ అరవై మంది నిపుణుల బృందాన్ని తెలంగాణకు పంపాలని బీజేపీ హైకమాండ్ డిసైడైపోయింది.
యూపీలో సేవలు అందించిన అరవై మందిస్ట్రాటజిస్టుల బృందం రేపోమాపో.., తెలంగాణకు రానుంది. అయితే వారు వచ్చిన విషయం.. పని చేస్తున్న విషయం.., బీజేపీ ముఖ్య నేతలకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే వారు గోప్యంగా తమ పని చేసుకుని వెళ్తారు. కొంత మంది ఫీల్డ్ లోకి కూడా వెళ్తారు. కానీ అన్నీ రహస్యంగానే సాగిపోతాయి. రాజకీయ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి బీజేపీ నేతలకు స్ట్రాటజీలు .. సలహాలు ఇస్తారు. యూపీ ఎన్నికల్లో వారి సూచనలు, సలహాలు సక్సెస్ కావడంతో.. తెలంగాణలోనూ వారి హ్యాండ్ లక్కీ అవుతుందని బీజేపీ నేతలు నమ్మకంతో ఉన్నారు.
తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే స్ట్రాటజిస్టులను పెట్టుకున్నాయి. కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ సేవలు తీసుకుంటున్నారు. కేసీఆర్ తీసుకుంటున్న కీలక నిర్ణయాల వెనుక పీకే సలహాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ పార్టీ హైకమాండ్ ఓ స్ట్రాటజిస్ట్ను కేటాయించిందని.. త్వరలోనే ఆయన పని ప్రారంభిస్తారని కూడా చెబుతున్నారు. ఇక షర్మిల పార్టీ కూడా గతంలో ప్రశాంత్ కిషోర్ టీంలో పని చేసిన ప్రియ అనే స్ట్రాటజిస్ట్ను నియమించుకున్నారు. దీంతో తెలంగాణ రాజకీయ పార్టీల పోరాటం.. వ్యూహకర్తల ఆలోచనల ప్రకారం సాగే అవకాశం కనిపిస్తోంది.
Atmakur Elections : ఆత్మకూరులో పోటీపై తేల్చని పార్టీలు - విక్రమ్ రెడ్డికి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థేనా ?
3 Years of YSR Congress Party Rule : "మద్యనిషేధ" హామీకి చెల్లు చిటీ - ఆ నిధులతోనే పథకాలు !
3 Years of YSR Congress Party Rule : పార్టీపై జగన్కు అదే పట్టు కొనసాగుతోందా ? "ఆ" అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉందా ?
3 Years of YSR Congress Party Rule : సంక్షేమం సూపర్ - మరి అభివృద్ధి ? మూడేళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో సమ ప్రాథాన్యం లభించిందా ?
Modi Tour Twitter Trending : మోదీ టూర్పై టీఆర్ఎస్, బీజేపీ ఆన్లైన్, ఆఫ్లైన్ వార్ - పాలిటిక్స్ అంటే ఇట్లుంటది మరి !
Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
May 26 Records in Cricket: మే 26తో భారత క్రికెట్కు ప్రత్యేక కనెక్షన్ - రెండు మర్చిపోలేని రికార్డులు - ద్రవిడ్కు కూడా!
Hyderabad News : సరూర్ నగర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసు, వెలుగులోకి సంచలన విషయాలు