అన్వేషించండి

Andhra Pradesh investment image : ఇప్పుడు ఆంధ్ర ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ - చంద్రబాబు మళ్లీ ఏపీని ట్రాక్‌లో పెట్టారా ?

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల పరంగా మళ్లీ మంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్వెస్ట్ మెంట్ ఫ్రెండ్లీ స్టేట్ గా మారుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Andhra Pradesh is getting an investment friendly image again :  రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రం అయింది. పారిశ్రామికీకరణ తక్కువగా ఉంది. అలాంటి సమయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు ఐదేళ్లలో పెట్టుబడుల ఫ్రెండ్లీ ఇమేజ్ తీసుకు వచ్చారు. దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టబడి కియా పరిశ్రమను తీసుకు రావడమే కాదు.. రెండేళ్లలోపు ఉత్పత్తి కూడా ప్రారంభించగలిగేలా చేశారు. ఇప్పుడు  దేశంలో ఎక్కడ కియాకారు కనిపించినా మేడిన్ అనంతపురం ఇని తెలుగువాళ్లు గుర్తు చేసుకుంటారు. ఇక  హీరో, అశోక్ లేలాండ్. హెచ్‌సీఎల్ సహా అనేక కంపెనీలు వచ్చాయి. అంతకు మించి అనేక మంది పెట్టుబడిదారులు ఎంవోయూలు చేసుకున్నారు. కానీ చంద్రబాబు అనూహ్య రీతిలో ఓడిపోవడం.. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ఎంవోయూలను మెటీరియలైజ్ చేసేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకపోవడంతో ..వెనుకబడినట్లయింది. 

వైఎస్ జగన్ హయాంలో అనేక రివర్స్ నిర్ణయాలు

చంద్రబాబు  హయాంలో అమరావతి సస్టెయినబుల్ సిటీల్లో అమరావతి ప్రపంచానికి ఓ మోడల్ అవుతుందని అంతర్జాతీయ మీడియా కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేశారు. సింగపూర్ కన్సార్టియంతో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. అమరావతిలో ఒక్కటంటే ఒక్క పని కూడా జరగాల్సిన పని లేదని తీర్మానించి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. పీపీఏలు రద్దు చేయడం.. లూలూ మాల్ వంటి పారిశ్రామిక వేతల్ని పంపేయం వంటివి ఏపీ ఇమేజ్ ను దెబ్బతీశాయి. ఐదేళ్ల కాలంలో నికరంగా వచ్చిన పెట్టుబడి అంటూ ఏపీలో ఏం లేదని టీడీపీ వర్గాలు చాలా కాలంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో ఏపీకి ఏం పరిశ్రమ వచ్చిందా అని ఆలోచిస్తే.. ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. 

మేకపాటి విరాళానికి రాజకీయం అడ్డంకి- చంద్రబాబుకు స్పీడ్ పోస్టు- తెలంగాణలో మాత్రం నేరుగా అందజేత!

చంద్రబాబు సీఎం అయ్యాక పలు  పెట్టుబడుల ప్రతిపాదనలు

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే కేంద్రం మచిలీపట్నంలో రిఫైనరీ ఏర్పాటు చేసే విషయాన్ని ప్రకటించింది. అక్కడ్నుంచి వరుసగా పెట్టుబడుల ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా  గాంధీనగర్ లో జరిగిన  వాయు, సౌర విద్యుత్ సదస్సులో కూడా పలు కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపించాయి. అనేక మంది ప్రస్తుతం ఉన్న  తమ యూనిట్లను విస్తరించడానికి ముందుకు వస్తున్నారు. ఎక్కువ మంది తమకు రావాల్సిన పరిశ్రామిక రాయితీల గురించే  ప్రస్తావిస్తున్నారు. గత ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన రాయితీలను చాలా వరకూ ఆపేసింది. కొన్ని పరిశ్రమలకు మాత్రమే ఇచ్చింది. చంద్రబాబు సీఎం అయిన వంద రోజుల్లో అనేక పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో సగం గ్రౌండింగ్ అయినా.. భారీ స్థాయిలో పారిశ్రామికీకరణ జరుగుతుంది. 

అమరావతితో మరితంగా పెట్టుబడుల ఆకర్షణ

గతంలో రాజధాని లేకపోవడం పెద్ద మైనస్. ఎన్నికల ఫలితాలతో రాజధాని ఏదన్న సమస్య తీరిపోయింది. కేంద్రం పదిహేను వేల కోట్ల నిధులను ప్రకటించింది. డిసెంబర్ నుంచి అమరావతి పనులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత అమరావతిలో  ప్రైవేటు పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయని భావిస్తున్నారు. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ పెట్టుబడుల పరంగా ఏపీ ట్రాక్ లోకి వచ్చిందని నమ్ముతున్నారు. 

Also Read: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Shambhala Review : 'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Embed widget