అన్వేషించండి

Anantapur TDP politics : జేసీ పవన్ ఎక్కడ ? అనంతపురం ఎంపీగా పోటీ చేసే ఉద్దేశంలో లేరా ?

JC Diwakar Reddy son : అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పోటీ చేయడం లేదా ? జేసీ పవన్ టీడీపీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు.

 

Anantapur JC Diwakar Reddy  son  :  అనంతపరం జిల్లాలో జేసీ బ్రదర్స్ వారసుల రాజకీయంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు విస్తృతంగా పర్యటిస్తూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతూంటే..జేసీ దివాకర్ కర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ పవన్ రెడ్డి మాత్రం వీలైనంత మౌనం పాటిస్తున్నారు. 

జేసీ కుటుంబానికి అనంతపురం జిల్లాలో ప్రత్యేక ము్దర 

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం. 2019 ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ వారసులను రాజకీయాలకు దింపాలని ఆలోచించారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో మాట్లాడి వారి స్థానాల్లో తమ వారసులకు టికెట్లు తెచ్చుకోవడంలో  సక్సెస్ అయ్యారు. 2019 ఎన్నికల్లో తాడిపత్రి టీడీపీ అభ్యర్థిగా జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి, అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ రెడ్డి  రంగంలోకి దిగారు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న రాజకీయ ఉద్దండుల కుమారులు గెలుపే లక్ష్యంగా 2019 ఎన్నికల్లో ప్రచారం కొనసాగించారు. అనూహ్యంగా రాష్ట్రమంతా జగన్ ఫ్యాన్ గాలి గట్టిగా వియడంతో అటు తాడిపత్రిలోనూ.. ఇటు అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసిన పవన్ రెడ్డి ఓటమి చెందారు. 

కొంత కాలం నుంచి సైలెంట్ అయిన జేసీ పవన్ రెడ్డి 

ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో తాడిపత్రిలో జెసి ప్రభాకర్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రంగా పోరాడుతున్నారు. అయితే మరోపక్క జెసి పవన్ మాత్రం జిల్లాలో కనిపించడం లేదు. రానున్న ఎన్నికల్లో జేసీ పవన్ కుమార్ రెడ్డి అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా నిలబడతాడా లేదా అన్నది ప్రశ్నగా మిగిలింది. గడచిన రెండు సంవత్సరాలుగా జెసి పవన్ క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా ఉండడం లేదు. జనవరిలో తిరిగి వస్తారని ఆయన అనుచరవర్గంలో ప్రచారం జరుగుతుంది. పవన్ చురుకుగా పనిచేస్తే అధిష్టానం మరో అవకాశం కల్పిస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా జెసి కుటుంబం తెలుగుదేశం పార్టీ కోసం విశేషంగా పోరాటం చేస్తుంది. 2019 ఎన్నికల అనంతరం అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఏ కార్యక్రమం జరిగిన జెసి పవన్ రెడ్డి పాల్గొనేవారు. అనంతపురం అర్బన్ లో తెలుగుదేశం పార్టీ నేత ప్రభాకర్ చౌదరితో విభేదాలు ఉన్నప్పటికీ జెసి పవన్ తన అనుచరులతో కలిసి తన పని తాను  చేసుకుంటూ వెళ్తుండేవాడు. క్యాడర్ కి భరోసానిస్తూ ముందుకెళ్లాడు. 

పవన్ రెడ్డి పోటీ చేసే ఉద్దేశంలో లేరా ?

ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ చురుకుగా లేకపోవడం కార్యకర్తల్లో కొంత నిరాశ ఆందోళన చెందుతున్నారు. కారణాలు ఏవైనా ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు మాత్రం జెసి పవన్ దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగింది. లోకేష్ పాదయాత్రలో పార్టీ సీనియర్ నేతలతో పాటు పార్టీలో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల సైతం పాదయాత్రలో చురుగ్గా పాల్గొన్నారు. జెసి దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి లు ఈ యాత్రలో పాల్గొన్నారు.  పాదయాత్రలో జెసి పవన్ పాల్గొనుకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారా ?
 
 జేసీ  పవన్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేనట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. అనంతపురం పార్లమెంటు పరిధిలో ఏదైనా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చర్చ కొనసాగుతుంది. ఏది ఏమైనాప్పటికీ బలమైన రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న జెసి పవన్ రెడ్డి త్వరలోనే క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొని నమ్ముకున్న పార్టీ కేడర్ కు అభిమానులకు భరోసాని ఇవ్వాలని అభిమానులు కార్యకర్తలు కోరుకుంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Prashant Kishor Electoral Debut: వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
Telangana Cabinet Coordination Issues: జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
Andhra Pradesh Law and Order Issue: మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?
మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget