అన్వేషించండి

CM KCR Silent : మోదీపై బీఆర్ఎస్ నేతలంతా ఎటాక్ - కానీ కేసీఆర్ ఎందుకు సైలెంట్ ?

తెలంగాణ సర్కార్‌పై ప్రధాని మోదీ విమర్శలకు బీఆర్ఎస్ నేతలంతా స్పందించారు కానీ కేసీఆర్ మాత్రం మౌనం పాటిస్తున్నారు. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందా ?

CM KCR Silent :     ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. పరేడ్ గ్రౌండ్ లో బహిరంగసభలో మాట్లాడారు. కేసీఆర్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై చాలా ఆరోపణలు చేశారు. నిజానికి ఈ సభలో కేసీఆర్ కూడా పాల్గొనాల్సి ఉంది. ఆయన పాల్గొంటే ఇలాంటి ఆరోపణలు చేసేవారో లేదో తెలియదు కానీ.. ఆయన రాలేదు కాబట్టి మోదీ స్వేచ్చగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నరేంద్రమోదీ విమర్శలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు వెంటనే స్పందించారు. హరీష్ రావు దగ్గర్నుంచి కింది స్థాయి ఎమ్మెల్యే వరకూ స్పందించారు. అయితే ఎవీరు ఎవరు స్పందించినా...  పెద్దగా లెక్కలోకి రాదు. కేవలం.. కేసీఆర్ స్పందిస్తేనే హాట్ టాపిక్ అవుతుంది. 

గతంలో మోదీ, అమిత్ షాల విమర్శలకు నేరుగా కౌంటర్ ఇచ్చిన కేసీార్!  


గతంలో అమిత్ షా లేదా ప్రధానమంత్రి వచ్చిన పోయిన తర్వాత వెంటనే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి వారు చేసిన ఆరోపణల్ని ఖండించడం కామన్ గా జరిగేది. గత ఏడాది ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చే ముందు ప్రెస్ మీట్ పెట్టి తనపై మోదీ విమర్శలు చేస్తారని.. అందుకే తానే ముందుగా సవాళ్లు చేస్తున్ననని ప్రకటించారు. అయితే ప్రధాని మోదీ కేసీఆర్ సంధించిన ప్రశ్నలపై స్పందించలేదు.  ఆ మాటకొస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించకుండా వెళ్లిపోయారు. ఆ సమయంలోనే తాను ప్రతీ రోజూ ప్రెస్ మీట్ పెడతానని హెచ్చరించారు కూడా. కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే కనీసం గంటన్నర మాట్లాడతారు. అన్ని అంశాలపై సమగ్రంగా స్పందిస్తారు. కానీ ఈ సారి మోదీ పర్యటనపై కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు. ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. 

కేటీఆర్ కూడా స్పందించలేదు!

ప్రధాని మోదీ స్పీచ్ అయిపోయిన తర్వాత  హరష్ రావు సహా అనేక మంది నేతలు స్పందించారు. కొంత మంది ప్రెస్ మీట్లు పెడితే..మరికొంత మంది సోషల్ మీడియాలో స్పందించారు. మోదీనే తప్పు చేశారని వాదించారు.  మోదీ పర్యటన రోజున సింగరేణి విషయంలో మహాధర్నాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అయితే కేటీఆర్ కూడా ప్రధాని మోదీ విమర్శలపై స్పందించలేదు. నిజానికి కేసీఆర్‌   బీజేపీతో పూర్తిగా శత్రుత్వం వచ్చిన  తర్వాత అసలు వెనక్కి తగ్గడం లేదు.  అయితే ఇప్పుడు మాత్రం కేసీఆర్ ప్రెస్ మీట్లకు దూరంగా ఉన్నారు. ఇటీవల మహారాష్ట్ర నాయకులు బీఆర్ఎస్‌లో చేరే సమయంలో మోదీని విమర్శించే సమయానికి  వీడియో కెమెరాలను ఆపు చేయించారన్న వార్తలు వచ్ాయి.  మోదీ చేసినవి చిన్న విమర్శలేం కాదు.. అవినీతి ఆరోపణలు చేశారు. అభివృద్ధి చేయడం లేదన్నారు. వీటికి కేసీఆర్ స్థాయి నేత కౌంటర్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ వాయిస్ గట్టిగా ప్రజల్లోకి వెళ్లదన్న వాదన వినిపిస్తుంది. మరి కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో  బఆర్ఎస్ నేతలకు స్పష్టత లేదు.  

వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా ?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అపర చాణక్యుడన్న బిరుదు ఉంది. రాజకీయాలంటే ఆవేశంతో కాదు ఆలోచనతో చేయాలనేది ఆయన వ్యూహం. అందుకే అవసరం అనుకున్నప్పుడు ఆవేశంగా స్పందిస్తారు. లేదు.. అంతకుమించిన వ్యూహం ఉందనుకుప్పుడు ఎన్ని విమర్శలు వస్తున్నాసైలెంట్ గానే ఉంటారు. చివరికి ఎవరూ ఊహించని విధంగా మలుపు తిప్పుతారు. ఇప్పుడు కూడా అలాంటిదేమైనా ఉందో లేదో కానీ..  కేసీఆర్ మౌనం మాత్రం బీఆర్ఎస్ నేతలకు పజిల్‌గా మారుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget