అన్వేషించండి

BJP Mission Telangana: బెంగాల్ అయిపోయింది..ఇక తెలంగాణే - పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మోదీ సమరశంఖం - రాజకీయం మారిపోతుందా?

Telangana BJP: బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించి, మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడిన ఉత్సాహంలో ఉన్న బీజేపీ.. ఇప్పుడు తదుపరి లక్ష్యంగా తెలంగాణ ను ఎంచుకుంది. ప్రధాని మోదీ రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు.

Telangana Modi action plan ready: పశ్చిమ బెంగాల్ కోటను బద్దలు కొట్టిన బీజేపీ అధిష్టానం, ఇప్పుడు తన విజయ యాత్రను దక్షిణ భారతం వైపు మళ్లించింది. 15 ఏళ్ల కిందట బెంగాల్‌లో నామమాత్రంగా ఉన్న శక్తి, నేడు 207 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకోవడం వెనుక ఉన్న సైలెంట్ ఆపరేషన్  వ్యూహాలను ఇప్పుడు తెలంగాణలో అమలు చేసేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న సభ  ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించబోతున్నారు.

 జీరో నుంచి హీరోగా.. బెంగాల్ మోడల్ తెలంగాణలో! 

బెంగాల్‌లో మమతా బెనర్జీ వంటి ఉద్ధండురాలిని ఓడించడం ద్వారా బీజేపీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. అదే తరహాలో తెలంగాణలో ఇప్పటికే ఉన్న ఎనిమిది మంది ఎంపీల బలంతో, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని మోదీ-షా ద్వయం భావిస్తోంది. బెంగాల్ గెలవగలిగితే.. తెలంగాణ ఎందుకు సాధ్యం కాదు  అనే నినాదంతో బీజేపీ ముందుకు వెళుతోంది. ఈ సభ ద్వారా సుమారు  8,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూనే, రాజకీయ మార్పుకు మోదీ పిలుపునివ్వనున్నారు.

 పరేడ్ గ్రౌండ్స్ సాక్షిగా..  విజయ్  సంకేతం! 

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవబోయేది తామేనని మోదీ ఈ సభ ద్వారా అధికారికంగా ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీయేనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ సభ ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి నేతలు  టీమ్ మోదీ  పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  వికసిత్ తెలంగాణ నినాదంతో తో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన పార్టీ, ఇప్పుడు మోదీ సభతో పీక్ స్టేజ్‌కు చేరుకోవాలని చూస్తోంది.

అండర్ కరెంట్ వ్యూహాలు.. సైలెంట్ ఆపరేషన్ 

బెంగాల్‌లో ఎలాగైతే కిందిస్థాయి ఓటర్లను మచ్చిక చేసుకున్నారో, తెలంగాణలోనూ అదే తరహా  సైలెంట్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఇతర పార్టీల అసంతృప్త నేతలను చేర్చుకోవడం, కుల సమీకరణలను సరిదిద్దడం, కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి వాటిని ఇంటింటికీ తీసుకెళ్లడం ద్వారా ఓటు బ్యాంకును పటిష్టం చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా యువత,  మహిళా ఓటర్లను టార్గెట్ చేస్తూ బీజేపీ సోషల్ మీడియా సైన్యం రంగంలోకి దిగింది. బీజేపీ అంచనా ప్రకారం, దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత పార్టీకి అత్యంత అనుకూలమైన రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ ఇప్పటికే బలమైన ఓటు శాతం ఉండటం, నాయకత్వం చురుగ్గా ఉండటం వల్ల కొంచెం కష్టపడితే అధికారం సాధ్యమని అమిత్ షా బృందం లెక్కలు వేస్తోంది. బెంగాల్ విజయం అందించిన ఊపుతో, తెలంగాణలో డబుల్ ఇంజిన్  సర్కారు ఆవశ్యకతను మోదీ తన ప్రసంగంలో నొక్కి చెప్పనున్నారు.

 తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు! 

మోదీ మే 10 పర్యటన కేవలం అభివృద్ధి పనుల ప్రారంభానికే పరిమితం కాదు. ఇది తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఒక భారీ బహిరంగ సభ. బెంగాల్ ఓటమితో ప్రతిపక్ష  ఇండియా  కూటమి నైతిక దెబ్బ తిన్న తరుణంలో, ఆ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. పరేడ్ గ్రౌండ్స్ గర్జన తర్వాత తెలంగాణ రాజకీయాలు మరోసారి  త్రిముఖ పోరు  నుంచి బిజెపి వర్సెస్ అదర్స్ గా మారే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Milchy Milk Controversy: హరీష్ రావు చుట్టూ ముదురుతున్న పాల రాజకీయం - మిల్చీమిల్క్‌పై సమాధానం చెప్పలేరా?
హరీష్ రావు చుట్టూ ముదురుతున్న పాల రాజకీయం - మిల్చీమిల్క్‌పై సమాధానం చెప్పలేరా?
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
TDP MLAs Dissatisfaction: టీడీపీ ఎమ్మెల్యేల్లో గూడుకట్టుకుపోతున్న అసంతృప్తి - బయటపడుతున్న వారు కొందరే - హైకమాండ్ గుర్తించదా?
టీడీపీ ఎమ్మెల్యేల్లో గూడుకట్టుకుపోతున్న అసంతృప్తి - బయటపడుతున్న వారు కొందరే - హైకమాండ్ గుర్తించదా?
Chandrababu Naidu Strategy Against YSRCP: వైసీపీ ట్రాప్ లో పడొద్దు.. ప్రతి సవాళ్లు చేయొద్దు! టీడీపీ హైకమాండ్ లైన్ వ్యూహమా? చేతకానితనమా?
వైసీపీ ట్రాప్ లో పడొద్దు.. ప్రతి సవాళ్లు చేయొద్దు! టీడీపీ హైకమాండ్ లైన్ వ్యూహమా? చేతకానితనమా?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Ek Din OTT : ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
Embed widget