అన్వేషించండి

BJP Mission Telangana: బెంగాల్ అయిపోయింది..ఇక తెలంగాణే - పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మోదీ సమరశంఖం - రాజకీయం మారిపోతుందా?

Telangana BJP: బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించి, మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడిన ఉత్సాహంలో ఉన్న బీజేపీ.. ఇప్పుడు తదుపరి లక్ష్యంగా తెలంగాణ ను ఎంచుకుంది. ప్రధాని మోదీ రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు.

Telangana Modi action plan ready: పశ్చిమ బెంగాల్ కోటను బద్దలు కొట్టిన బీజేపీ అధిష్టానం, ఇప్పుడు తన విజయ యాత్రను దక్షిణ భారతం వైపు మళ్లించింది. 15 ఏళ్ల కిందట బెంగాల్‌లో నామమాత్రంగా ఉన్న శక్తి, నేడు 207 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకోవడం వెనుక ఉన్న సైలెంట్ ఆపరేషన్  వ్యూహాలను ఇప్పుడు తెలంగాణలో అమలు చేసేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న సభ  ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించబోతున్నారు.

 జీరో నుంచి హీరోగా.. బెంగాల్ మోడల్ తెలంగాణలో! 

బెంగాల్‌లో మమతా బెనర్జీ వంటి ఉద్ధండురాలిని ఓడించడం ద్వారా బీజేపీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. అదే తరహాలో తెలంగాణలో ఇప్పటికే ఉన్న ఎనిమిది మంది ఎంపీల బలంతో, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని మోదీ-షా ద్వయం భావిస్తోంది. బెంగాల్ గెలవగలిగితే.. తెలంగాణ ఎందుకు సాధ్యం కాదు  అనే నినాదంతో బీజేపీ ముందుకు వెళుతోంది. ఈ సభ ద్వారా సుమారు  8,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూనే, రాజకీయ మార్పుకు మోదీ పిలుపునివ్వనున్నారు.

 పరేడ్ గ్రౌండ్స్ సాక్షిగా..  విజయ్  సంకేతం! 

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవబోయేది తామేనని మోదీ ఈ సభ ద్వారా అధికారికంగా ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీయేనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ సభ ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి నేతలు  టీమ్ మోదీ  పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  వికసిత్ తెలంగాణ నినాదంతో తో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన పార్టీ, ఇప్పుడు మోదీ సభతో పీక్ స్టేజ్‌కు చేరుకోవాలని చూస్తోంది.

అండర్ కరెంట్ వ్యూహాలు.. సైలెంట్ ఆపరేషన్ 

బెంగాల్‌లో ఎలాగైతే కిందిస్థాయి ఓటర్లను మచ్చిక చేసుకున్నారో, తెలంగాణలోనూ అదే తరహా  సైలెంట్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఇతర పార్టీల అసంతృప్త నేతలను చేర్చుకోవడం, కుల సమీకరణలను సరిదిద్దడం, కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి వాటిని ఇంటింటికీ తీసుకెళ్లడం ద్వారా ఓటు బ్యాంకును పటిష్టం చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా యువత,  మహిళా ఓటర్లను టార్గెట్ చేస్తూ బీజేపీ సోషల్ మీడియా సైన్యం రంగంలోకి దిగింది. బీజేపీ అంచనా ప్రకారం, దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత పార్టీకి అత్యంత అనుకూలమైన రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ ఇప్పటికే బలమైన ఓటు శాతం ఉండటం, నాయకత్వం చురుగ్గా ఉండటం వల్ల కొంచెం కష్టపడితే అధికారం సాధ్యమని అమిత్ షా బృందం లెక్కలు వేస్తోంది. బెంగాల్ విజయం అందించిన ఊపుతో, తెలంగాణలో డబుల్ ఇంజిన్  సర్కారు ఆవశ్యకతను మోదీ తన ప్రసంగంలో నొక్కి చెప్పనున్నారు.

 తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు! 

మోదీ మే 10 పర్యటన కేవలం అభివృద్ధి పనుల ప్రారంభానికే పరిమితం కాదు. ఇది తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఒక భారీ బహిరంగ సభ. బెంగాల్ ఓటమితో ప్రతిపక్ష  ఇండియా  కూటమి నైతిక దెబ్బ తిన్న తరుణంలో, ఆ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. పరేడ్ గ్రౌండ్స్ గర్జన తర్వాత తెలంగాణ రాజకీయాలు మరోసారి  త్రిముఖ పోరు  నుంచి బిజెపి వర్సెస్ అదర్స్ గా మారే అవకాశం కనిపిస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Trisha Vijay Krishna: TVK అంటే త్రిష విజయ్ కృష్ణనా..? దళపతి లక్కీచార్మ్‌ అంటూ ఫ్యాన్స్ పూనకాలు 
TVK అంటే త్రిష విజయ్ కృష్ణనా..? దళపతి లక్కీచార్మ్‌ అంటూ ఫ్యాన్స్ పూనకాలు 
Vijay Family: పెళ్లాం బిడ్డలు రాలేదు కానీ..ఆవిడొచ్చింది...! విజయ్‌ను పిల్లలు కూడా  దూరం పెట్టారా...?
పెళ్లాం బిడ్డలు రాలేదు కానీ..ఆవిడొచ్చింది...! విజయ్‌ను పిల్లలు కూడా  దూరం పెట్టారా...?
AIADMK Leadership Crisis 2026: తమిళనాట సంచలనం - అన్నాడీఎంకేలో చీలిక - పళనిస్వామికి 17.. వేలుమణికి 30 !
తమిళనాట సంచలనం - అన్నాడీఎంకేలో చీలిక - పళనిస్వామికి 17.. వేలుమణికి 30
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Embed widget