అన్వేషించండి

KA Palul AP : పాల్ రావాలి - పాలన మారాలి ! ఏపీలో 54 శాతం ప్రజలు ఇదే అంటున్నారట

ఏపీలో 54 శాతం మంది ప్రజలు పాల్ పాలన రావాలని కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని కేఏ పాల్ చెబుతున్నారు.

KA Palul AP :  ఆంధ్రప్రదేశ్‌లో  54 శాతం ఆంధ్రులు కే ఏ పాల్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్టు తాజా సర్వే లో తేలిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. తన సర్వే గురించి తానే ప్రకటించుకోవడం ఆయన స్టైల్. అందుకే ఏకంగా 54 శాతం మంది తన నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లుగా ప్రకటించారు. చంద్రబాబు, కేసీఅర్ ల అవినీతి పై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేశానని..  మోడీ, అమిత్ షా లతో రహస్యంగా అనేక సార్లు కలిశానని చెప్పుకొచ్చారు. రాజ్యసభకు వెళ్లి  కేంద్ర మంత్రి పదవి తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారని కానీ తానే వద్దన్నాన్నారు. 

మా కుమారుడ్ని విడిపించండి - సీజేఐకి కోడికత్తి శ్రీను తల్లిదండ్రుల లేఖ !

కేఏ పాల్ ఏపీలో రాజకీయ పర్యటన చేస్తున్నారు. పాల్ రావాలి - పాలన మారాలి నినాదంతో ఆయన విశాఖ నుంచి యాత్ర ప్రారంభించారు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలు వరకూ యాత్ర చేస్తారు. గతంలో ఆయన తెలంగాణలో పర్యటించారు. పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమరవీరుల కుటుంబాలను పార్టీలో చేర్చుకుని రాజకీయం చేయడంతో ఆయనకు కొంత ప్రతిఘటన తెలంగాణలో ఎదురయింది. అమరవీరుడు శ్రీకాంతాచారి తండ్రికి తొలి టిక్కెట్ ప్రకటించారు. అయితే ఆయన కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చింది. 

పులివెందుల నుంచి వైఎస్ సునీత పోటీ చేస్తారా ? ప్రచారంలో నిజం ఎంతంటే ?

తెలంగాణ ప్రభుత్వంపై సీబీఐ చీఫ్‌కు కూడా ఫిర్యాదు చేసి కలకలం రేపారు. బీజేపీ మద్దతుతోనే టీఆర్ఎస్‌కు ఆయన చికాకులు తెప్పిస్తున్నారన్న ప్రచారం జరిగింది. అమిత్ షాతో సమావేశం కావడం కూడా చర్చనీయాంశమయింది. అయితే తాను రెండు రాష్ట్రాల్లోనూ ప్రచారం చేస్తున్నామని.. తమ  పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందని ఆయన చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ మూడు వేల ఓట్లు కూడా రాలేదు.  అప్పట్లో ఆయన చేసిన హడావుడి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వైఎస్ఆర్‌సీపీ జీవితకాల అధ్యక్షుడు జగన్ - ప్లీనరీలో తీర్మానం ! రాజ్యాంగపరంగా సాధ్యమేనా ?

కేఏ పాల్  ను సోషల్ మీడియాలో ఎంత మంది ట్రోల్ చేసినా ఆయన స్పోర్టివ్‌గానే తీసుకుంటున్నారు. తాను కామెడీ చేస్తున్నా... జనం తన వెంటే ఉన్నారని నమ్ముతూ ఉంటారు. ఒకప్పుడు ఆయన మత ప్రచార సభ పెడితే.. ఇసుక వేస్తే రాలనంత మంది జనం వచ్చేవారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలా కామెడీగా మారడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే ఉంటారు  అయితే పాల్ మాత్రం అలాంటివి పట్టించుకోరు. 

 

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Embed widget