అన్వేషించండి
Nizamabad MP: ఎంపీ ధర్మపురి అర్వింద్ పిల్లలతో ఆడుకున్న మోదీ.. ఫోటోలు వైరల్
ఎంపీ అర్వింద్ చిన్న కుమారుడితో మోదీ
1/3

ఎప్పుడూ తీరిక లేకుండా నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో గడుపుతుండే ప్రధాని మోదీ మంగళవారం పిల్లలతో గడిపారు. వాళ్లు ఎవరో కాదు.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కుమారులు. మామూలుగానే పిల్లలంటే ఇష్టపడే మోదీ, ఎంపీ పిల్లలతో కలిసిపోయి చాలా సేపు ముచ్చటించారు. పిల్లల చదువు వివరాలు అడిగి మరీ తెలుసుకున్నారు. మోదీనే స్వయంగా అర్వింద్ పిల్లలకు స్వీట్లు అందించారు.
2/3

ప్రధాని స్థానంలో ఉన్న మోదీ.. తమ పిల్లలు సమన్యు, రుద్రాక్ష్తో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరచిపోలేనని ఎంపీ అరవింద్ సంతోషం వ్యక్తం చేశారు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సతీసమేతంగా మంగళవారం ప్రధానిని కలిశామని అర్వింద్ ట్వీట్ చేశారు.
Published at : 18 Aug 2021 03:28 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















