ఆసిఫాబాద్కు చేరుకున్న కేసీఆర్ ముందుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం కుమ్రంభీం చౌరస్తాలో కుమ్రంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కొత్తగా నిర్మించిన జిల్లా పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్ను ప్రారంభించారు.
ఆ తర్వాత కలెక్టరేట్లో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని సీఎం ప్రారంభించారు.
అక్కడ పురోహితులు సీఎం కేసీఆర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం సీఎం కేసీఆర్.. కలెక్టర్ను ఆయన కార్యాలయంలో సీట్లో కూర్చోబెట్టారు.
కలెక్టర్ కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు చెప్పారు.
ఆ తర్వాత కలెక్టర్.. సీఎం కేసీఆర్కు శాలువా కప్పి సన్మానించారు.
తెలంగాణ వచ్చాకే గిరిజన, తండాలను డెవలప్ చేశామని సీఎం కేసీఆర్ అన్నారు.
ఒకప్పుడు అంటురోగాలతో ఉమ్మడి ఆదిలాబాద్ తల్లడిల్లిపోయిందని, ఇప్పుడు పరిస్థితి మొత్తం సద్దుమణిగిపోయిందని అన్నారు.
తెలంగాణ వచ్చింది కాబట్టే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు అయిందని అన్నారు.
రెండు మూడు నెలల్లో మారుమూల తండాలకు, పొలాలకు కూడ త్రీ ఫేస్ కరెంట్ ఇస్తామని చెప్పారు.
రెండు మూడు రోజుల్లో 47 వేల ఎకరాల పోడు భూములను పంపిణీ చేస్తామని అన్నారు.
కాంగ్రెస్ నేతలు అవాకులు, చవాకులు పేల్చుతున్నారని అన్నారు.
ధరణి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ నేతలు మాత్రం తీసేయాలని అంటున్నారని అన్నారు.
ధరణి వల్లే భూములు ఇతరుల పేరు మీదకు మార్చడం కుదరదని, రైతు మరణించగానే రూ.5 లక్షల బీమా అందుతోందని అన్నారు.
ధరణి లేకపోతే దళారీల రాజ్యం వస్తుందని, రకరకాల ఇబ్బందులు వస్తాయని అన్నారు.
అదే తీసేస్తే రైతు బంధు కూడా అందే పరిస్థితి కూడా ఉండబోదని అన్నారు.
మహారాష్ట్రలో కూడా ప్రజలు బీఆర్ఎస్ పథకాల పట్ల ఆకర్షితులు అవుతున్నారని, మాకు కూడా ఆ పథకాలు కావాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతోంది.
ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి లబ్ధిదారులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేశారు.
మహిళల పేరు మీదనే పట్టాలు పంపిణీ చేస్తున్నట్లుగా సీఎం తెలిపారు.
అంతేకాక, వారికి రైతు బంధ నిధులను కూడా విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పోడు భూముల రైతులపై గతంలో నమోదైన కేసులను ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో మంచి ప్రగతి సాధించామని చెప్పారు.
తెలంగాణలో అన్ని వర్గాల వారికి 24 గంటల కరెంటు వస్తుందని, ఈ ఘనత విద్యుత్ శాఖలోని ప్రతి ఒక్కరికి దక్కుతుందని అన్నారు.
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం- మంత్రులుగా 11 మందితో ప్రమాణం చేయించిన గవర్నర్
సీఎం రేసులో రేవంత్ - విద్యార్థి నేతగా ప్రస్థానం ప్రారంభం!
ABP Cvoter Exit Poll Results 2023: తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ 2023 లో ఏం తేలింది!
Telangana Assembly Election 2023: ఓటేసిన రాజకీయ ప్రముఖుల ఫొటోస్
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణం - తొలుత సీఎం, తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం, 14కు శాసనసభ వాయిదా
Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్ క్లోజ్
KCR And KTR Absent: అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరు - ప్రమాణస్వీకారం చేయకముందే ముగ్గురు రాజీనామా
ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ తప్పు జరిగింది - ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ రివ్యూ
/body>