అన్వేషించండి
విజయవాడలో కోర్టు కాంప్లెక్స్ ప్రారంభం- సీజేఐ, సీఎం హాజరు
విజయవాడలో కోర్టు కాంప్లెక్స్ ప్రారంభం- సీజేఐ, సీఎం హాజరు
కోర్టు కాంప్లెక్స్ ప్రారంభ వేదికపై మాట్లాడుకుంటున్న సీజేఐ, సీఎం
1/12

కోర్టు భవనాల సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
2/12

ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు.
3/12

విజయవాడ కోర్టుతో జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడి నుంచే ఆయన తన న్యాయవాద వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.
4/12

సీజేఐ ప్రారంభించిన కోర్టు భవనాల నిర్మాణ పనులు.. 9ఏళ్ల సుదీర్ఘ కాల పాటు జరిగాయి.
5/12

నగరం మధ్యలో ఉన్న సివిల్ కోర్టుల ప్రాంగణంలో సుమారు 100కోట్ల రూపాయల వ్యయంతో ఈ 9 అంతస్తుల భవనాన్ని నిర్మించారు.
6/12

2013లోనే శంకుస్థాపన జరిగినా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కావటానికి 9సంవత్సరాలు పట్టింది. చాలాకాలం నత్తనడకన పనులు సాగగా... మధ్యలో కరోనా కారణంగా రెండున్నర సంవత్సరాలకు పైగా నిర్మాణం ఆగిపోయింది.
7/12

తర్వాత న్యాయస్దానం ఆదేశాలతో ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. ఎట్టకేలకు 3.70ఎకరాల్లో 9 అంతస్థుల కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తైంది. ఇవాళ ప్రారంభోత్సవం కూడా జరిగింది.
8/12

ఈరోజు ఉదయం విజయవాడకు చేరుకున్న ఆయనను సీఎం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు జస్టిస్ రమణతో ముఖ్యమంత్రి మీటింగ్ జరిగింది.
9/12

సీఎం జగన్ వెళ్లిన అనంతరం సీజేఐతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సీజేఐతో సుమారు 15- 20 నిమిషాలపాటు చంద్రబాబు సమావేశమయ్యారు.
10/12

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీసమేతంగా భేటీ అయ్యారు.
11/12

సిటీ సివిల్ కోర్టు భవన సముదాయ ప్రారంభోత్సవం అనంతరం కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో సీజే రమణ, సీఎం జగన్ కలిసి మొక్క నాటారు.
12/12

image 12
Published at : 20 Aug 2022 03:30 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















