అన్వేషించండి

Yuvagalam Navashakam Photos: టీడీపీ, జనసేన పొత్తుతో ఏపీ ప్రజలకు విముక్తి: చంద్రబాబు

Yuvagalam Navashakam Photos: యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2100 గ్రామాలు, 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ముగింపు సభకు విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేశారు.

Yuvagalam Navashakam Photos:  యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2100 గ్రామాలు, 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ముగింపు సభకు విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేశారు.

టీడీపీ, జనసేన పొత్తుతో ఏపీ ప్రజలకు విముక్తి: చంద్రబాబు

1/24
యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో టీడీపీ నిర్వహించిన యువగళం - నవశకం బహిరంగ సభ విజయవంతమైంది.
యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో టీడీపీ నిర్వహించిన యువగళం - నవశకం బహిరంగ సభ విజయవంతమైంది.
2/24
జ‌గ‌న్ ఐపీఎల్ టీము పెడ‌తామంటున్నాడని.. దీనికి కోడిక‌త్తి వారియ‌ర్స్ అని పేరు పెడితే బాగుంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. వారిలో సీనియ‌ర్ బ్యాట్స్ మెన్ అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్, అర‌గంట స్టార్ అంబ‌టి, గంట‌ స్టార్ అవంతి, ఆల్ రౌండ‌ర్ గోరంట్ల మాధ‌వ్, రీల్ స్టార్ భ‌ర‌త్, బూతుల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్టర్ బియ్యం మ‌ధు ఉంటారని.. అబ్బో మామూలు టీం కాదని ఎగతాళి చేశారు.
జ‌గ‌న్ ఐపీఎల్ టీము పెడ‌తామంటున్నాడని.. దీనికి కోడిక‌త్తి వారియ‌ర్స్ అని పేరు పెడితే బాగుంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. వారిలో సీనియ‌ర్ బ్యాట్స్ మెన్ అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్, అర‌గంట స్టార్ అంబ‌టి, గంట‌ స్టార్ అవంతి, ఆల్ రౌండ‌ర్ గోరంట్ల మాధ‌వ్, రీల్ స్టార్ భ‌ర‌త్, బూతుల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్టర్ బియ్యం మ‌ధు ఉంటారని.. అబ్బో మామూలు టీం కాదని ఎగతాళి చేశారు.
3/24
పాదయాత్ర అన్ని వర్గాల ప్రజలమధ్య విజయవంతంగా కొనసాగిందని.. ఇది యువగళం పాదయాత్ర ముగింపు సభ కాదని, వైసీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ అని బాలకృష్ణ అన్నారు. నవశకం బహిరంగసభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రసంగించారు.
పాదయాత్ర అన్ని వర్గాల ప్రజలమధ్య విజయవంతంగా కొనసాగిందని.. ఇది యువగళం పాదయాత్ర ముగింపు సభ కాదని, వైసీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ అని బాలకృష్ణ అన్నారు. నవశకం బహిరంగసభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రసంగించారు.
4/24
యువగళం నవశకం బహిరంగ సభకు నందమూరి, నారా కుటుంబసభ్యులు హాజరయ్యారు. అదేవిధంగా నేడు యువగళం పాదయాత్రకు అంతటి విశేష స్పందన వచ్చింది
యువగళం నవశకం బహిరంగ సభకు నందమూరి, నారా కుటుంబసభ్యులు హాజరయ్యారు. అదేవిధంగా నేడు యువగళం పాదయాత్రకు అంతటి విశేష స్పందన వచ్చింది
5/24
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు, జనసైనికులు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరయ్యారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో సభకు హాజరై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు, జనసైనికులు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరయ్యారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో సభకు హాజరై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు.
6/24
యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలో టీడీపీ నిర్వహించిన యువగళం - నవశకం బహిరంగ సభలో నారా లోకేష్ ప్రసంగించారు.
యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలో టీడీపీ నిర్వహించిన యువగళం - నవశకం బహిరంగ సభలో నారా లోకేష్ ప్రసంగించారు.
7/24
‘‘ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి ప్యాలస్ లో టీవీలు పగులుతాయో ఆ బొమ్మ నేను మీకు చూపిస్తున్నా. విజనరీ చంద్రబాబు, పవర్ ఫుల్ పవనన్న, మన సింహం బాలయ్య బొమ్మ అదుర్స్ కదూ. ఒక సారి జూమ్ వెయ్యండమ్మా జగన్ కి ఐమ్యాక్స్ సినిమా చూపిద్దాం అన్నారు లోకేష్
‘‘ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి ప్యాలస్ లో టీవీలు పగులుతాయో ఆ బొమ్మ నేను మీకు చూపిస్తున్నా. విజనరీ చంద్రబాబు, పవర్ ఫుల్ పవనన్న, మన సింహం బాలయ్య బొమ్మ అదుర్స్ కదూ. ఒక సారి జూమ్ వెయ్యండమ్మా జగన్ కి ఐమ్యాక్స్ సినిమా చూపిద్దాం అన్నారు లోకేష్
8/24
యువగళం నవశకం బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
యువగళం నవశకం బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
9/24
ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి తెలుగుదేశం, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu) ధీమా వ్యక్తం చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలని.. టీడీపీ, జనసైనికులు కలిసి పనిచేస్తే ఇది సాధ్యమన్నారు.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి తెలుగుదేశం, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu) ధీమా వ్యక్తం చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలని.. టీడీపీ, జనసైనికులు కలిసి పనిచేస్తే ఇది సాధ్యమన్నారు.
10/24
విజయనగరంలో ఏర్పాటు చేసిన యువగళం నవశకం భారీ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ పాలనపై, సీఎం జగన్ (AP CM YS Jagan) పై నిప్పులు చెరిగారు.  జాబ్ క్యాలెండర్ అని మభ్యపెట్టిన జగన్.. ఐదేళ్లే గడిచినా జాబ్ క్యాలెండర్ లేదు, జాబులు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
విజయనగరంలో ఏర్పాటు చేసిన యువగళం నవశకం భారీ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ పాలనపై, సీఎం జగన్ (AP CM YS Jagan) పై నిప్పులు చెరిగారు. జాబ్ క్యాలెండర్ అని మభ్యపెట్టిన జగన్.. ఐదేళ్లే గడిచినా జాబ్ క్యాలెండర్ లేదు, జాబులు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
11/24
టీడీపీ, జనసేన మైత్రిని చాలా కాలం పాటు కాపాడుకోవాల్సి ఉందని  జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ ఒక మోడల్ స్టేట్ అని, అందరూ అక్కడ పని చేయాలని బావించే వారు... నేడు ఎపీకి ఎందుకు వెళ్లకూడదో చెప్పే పరిస్థితికి జగన్ తీసుకు వచ్చారన్నారు.
టీడీపీ, జనసేన మైత్రిని చాలా కాలం పాటు కాపాడుకోవాల్సి ఉందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ ఒక మోడల్ స్టేట్ అని, అందరూ అక్కడ పని చేయాలని బావించే వారు... నేడు ఎపీకి ఎందుకు వెళ్లకూడదో చెప్పే పరిస్థితికి జగన్ తీసుకు వచ్చారన్నారు.
12/24
ఇది యువగళం ముగింపు సభ కాదు.. ఇది ఆరంభం. ఇది నవశకం. తాడేపల్లి ప్యాలస్ గోడలు బద్దలు కొడదాం. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం.  రాక్షసరాజ్యంలో పాదయాత్ర చెయ్యడం ఒక విప్లవం. యువగళం.. మనగళం.. ప్రజాబలం అన్నారు నారా లోకేష్
ఇది యువగళం ముగింపు సభ కాదు.. ఇది ఆరంభం. ఇది నవశకం. తాడేపల్లి ప్యాలస్ గోడలు బద్దలు కొడదాం. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం. రాక్షసరాజ్యంలో పాదయాత్ర చెయ్యడం ఒక విప్లవం. యువగళం.. మనగళం.. ప్రజాబలం అన్నారు నారా లోకేష్
13/24
‘చంద్రబాబును చూస్తే జగన్ కి భయం, పవనన్నని చూస్తే జగన్ కి భయం, మీ లోకేష్ ని చూస్తే జగన్ కి భయం. అందుకే చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు బంధించారు. విజనరీ అంటే చంద్రబాబు. ప్రిజనరీ అంటే జగన్ ఇది ఫిక్స్’ అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు.
‘చంద్రబాబును చూస్తే జగన్ కి భయం, పవనన్నని చూస్తే జగన్ కి భయం, మీ లోకేష్ ని చూస్తే జగన్ కి భయం. అందుకే చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు బంధించారు. విజనరీ అంటే చంద్రబాబు. ప్రిజనరీ అంటే జగన్ ఇది ఫిక్స్’ అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు.
14/24
చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు  తనకు చాలా బాధ కలిగిందన్నారు.  కష్టాలు చూసిన వాడిని, దగ్గర నుంచి చిన్నప్పుటి నుంచి బాధలు పడిన వాడినని గుర్తు చేశారు.  ఓటమి ఎదురైతే ఎలా ఉంటుందో భరించిన వాడినన్నారు.  చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆవేదన, భువనేశ్వరి బాధ చూశాను  నేను ఏదీ ఆశించి టీడీపీకి, చంద్రబాబుకు మద్దతు ఇవ్వలేదు..  జైల్లో ఆయన చూసిన తర్వాత బయటకు వచ్చి మద్దతు ప్రకటించానని పవన్ అన్నారు.
చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు తనకు చాలా బాధ కలిగిందన్నారు. కష్టాలు చూసిన వాడిని, దగ్గర నుంచి చిన్నప్పుటి నుంచి బాధలు పడిన వాడినని గుర్తు చేశారు. ఓటమి ఎదురైతే ఎలా ఉంటుందో భరించిన వాడినన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆవేదన, భువనేశ్వరి బాధ చూశాను నేను ఏదీ ఆశించి టీడీపీకి, చంద్రబాబుకు మద్దతు ఇవ్వలేదు.. జైల్లో ఆయన చూసిన తర్వాత బయటకు వచ్చి మద్దతు ప్రకటించానని పవన్ అన్నారు.
15/24
తెలుగుదేశం, జనసేన రాష్ట్ర ప్రజలకు, యువతకు అండగా ఉంటుందని, ఉద్యోగాలు కల్పిస్తుందని భరోసా కల్పించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన తెలుగుతమ్ముళ్లకు, జనసైనికులకు టీడీపీ అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
తెలుగుదేశం, జనసేన రాష్ట్ర ప్రజలకు, యువతకు అండగా ఉంటుందని, ఉద్యోగాలు కల్పిస్తుందని భరోసా కల్పించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన తెలుగుతమ్ముళ్లకు, జనసైనికులకు టీడీపీ అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
16/24
కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర.. మాటలతో చెప్పే పాదయాత్ర కాదు.. చేతలతో చూపించిన పాదయాత్ర అని ప్రశంసించారు.  అటువంటి పాదయాత్ర చేసిన లోకేష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని..  నేను నడుద్దాం అంటే... నన్ను నడవనిచ్చే పరిస్థితి ఉండదన్నారు.
కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర.. మాటలతో చెప్పే పాదయాత్ర కాదు.. చేతలతో చూపించిన పాదయాత్ర అని ప్రశంసించారు. అటువంటి పాదయాత్ర చేసిన లోకేష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని.. నేను నడుద్దాం అంటే... నన్ను నడవనిచ్చే పరిస్థితి ఉండదన్నారు.
17/24
226 రోజులు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యల్ని నారా లోకేష్ అధ్యయనం చేశారన్నారు. దేశంలో పాదయాత్రలు, బస్సు యాత్రలు కొత్త కాదు, ప్రజల్ని చైతన్యం చేయడానికి నందమూరి తారకరామారావు చైతన్యయాత్ర చేశారు. కానీ పాదయాత్రలపై దండయాత్ర చేయడం తొలిసారి జగన్ పాలనలో చూశానంటూ మండిపడ్డారు.
226 రోజులు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యల్ని నారా లోకేష్ అధ్యయనం చేశారన్నారు. దేశంలో పాదయాత్రలు, బస్సు యాత్రలు కొత్త కాదు, ప్రజల్ని చైతన్యం చేయడానికి నందమూరి తారకరామారావు చైతన్యయాత్ర చేశారు. కానీ పాదయాత్రలపై దండయాత్ర చేయడం తొలిసారి జగన్ పాలనలో చూశానంటూ మండిపడ్డారు.
18/24
ప్రజా సమస్యలపై గళం విప్పేందుకు పాదయాత్ర చేసిన నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు అభినందించారు. ప్రజాగళమే యువగళం అయిందని కొనియాడారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లు ప్రజల కోసం చేస్తున్న పనుల్ని అభినందించారు. రాజకీయ వ్యతిరేకత ఉండాలి కానీ, వ్యక్తిగత కక్షలు ఉండకూడదని సూచించారు.
ప్రజా సమస్యలపై గళం విప్పేందుకు పాదయాత్ర చేసిన నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు అభినందించారు. ప్రజాగళమే యువగళం అయిందని కొనియాడారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లు ప్రజల కోసం చేస్తున్న పనుల్ని అభినందించారు. రాజకీయ వ్యతిరేకత ఉండాలి కానీ, వ్యక్తిగత కక్షలు ఉండకూడదని సూచించారు.
19/24
ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు నేత పాదయాత్ర చేస్తే, చేతనైతే సహకరించాలి.. లేకపోతే ఇంట్లో పడుకోవాలన్నారు. యువగళం పాదయాత్ర సమయంలో టీడీపీ నేతల్ని ఇబ్బందులకు గురిచేసింది వైసీపీ ప్రభుత్వం. త్వరలో అధికారంలోకి వచ్చి వడ్డీతో సహా జగన్ కు తిరిగిస్తామన్నారు.
ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు నేత పాదయాత్ర చేస్తే, చేతనైతే సహకరించాలి.. లేకపోతే ఇంట్లో పడుకోవాలన్నారు. యువగళం పాదయాత్ర సమయంలో టీడీపీ నేతల్ని ఇబ్బందులకు గురిచేసింది వైసీపీ ప్రభుత్వం. త్వరలో అధికారంలోకి వచ్చి వడ్డీతో సహా జగన్ కు తిరిగిస్తామన్నారు.
20/24
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ
21/24
జగన్ గెలవగానే. మంచి ప్రభుత్వం తో పాలన చేయండి.. మేము సహకరిస్తామని నేను అభినందనలు చెప్పానని.. కక్ష సాధింపు రాజకీయాలతోనే జగన్ అందరినీ బూతులు తిట్టించాడని విమర్శించారు.
జగన్ గెలవగానే. మంచి ప్రభుత్వం తో పాలన చేయండి.. మేము సహకరిస్తామని నేను అభినందనలు చెప్పానని.. కక్ష సాధింపు రాజకీయాలతోనే జగన్ అందరినీ బూతులు తిట్టించాడని విమర్శించారు.
22/24
పాదయాత్ర ద్వారా చాలా మంది సాధకబాధకాలు తెలుసుకు అవకాశం ఉంటుందని..  నాకు అటువంటి అవకాశం లేకపోవడం కొంత బాధగా కూడా ఉందన్నారు.  ఎపీ స్పూర్తి నేడు భారతదేశానికే చేలా కీలకమని..   భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయంటే పొట్టి శ్రీరాములు బలిదానం కారణమన్నారు.  ఆయన స్పూర్తి వల్లే ఎపీ అవతరించింది అన్నారు పవన్ కళ్యాణ్
పాదయాత్ర ద్వారా చాలా మంది సాధకబాధకాలు తెలుసుకు అవకాశం ఉంటుందని.. నాకు అటువంటి అవకాశం లేకపోవడం కొంత బాధగా కూడా ఉందన్నారు. ఎపీ స్పూర్తి నేడు భారతదేశానికే చేలా కీలకమని.. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయంటే పొట్టి శ్రీరాములు బలిదానం కారణమన్నారు. ఆయన స్పూర్తి వల్లే ఎపీ అవతరించింది అన్నారు పవన్ కళ్యాణ్
23/24
సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇలా పరిస్థితి ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి.  మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ప్రజలు బతకలేరన్నారు.   పెట్టుబడులు రావు.. పరిశ్రమలు ఉండవు. ఎవరూ ఏపీలోకి రారు. ఇప్పటం సభలోనే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని ప్రకటించానని గుర్తు చేశారు.
సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇలా పరిస్థితి ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి. మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ప్రజలు బతకలేరన్నారు. పెట్టుబడులు రావు.. పరిశ్రమలు ఉండవు. ఎవరూ ఏపీలోకి రారు. ఇప్పటం సభలోనే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని ప్రకటించానని గుర్తు చేశారు.
24/24
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.  జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మేం ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు. యువగళంపై సైకో జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించాడో రాష్ట్రమంతా చూసిందన్నారు.
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మేం ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు. యువగళంపై సైకో జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించాడో రాష్ట్రమంతా చూసిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh in Delhi: ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
Telangana Assembly:  ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
Andhra Pradesh Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
Revanth Reddy Challenge: చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

TDP Won Hindupur Municipality | టీడీపీ కైవసమైన హిందూపూర్ మున్సిపాలిటీ | ABP DesamJC Prabhakar reddy vs Kethireddy peddareddy | తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం | ABP DesamTirupati Deputy Mayor Election | తిరుపతి పీఠం కోసం కూటమి, వైసీపీ బాహా బాహీ | ABP DesamPrabhas Look From Kannappa | కన్నప్ప సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh in Delhi: ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
Telangana Assembly:  ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
Andhra Pradesh Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
Revanth Reddy Challenge: చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
Jr NTR: అభిమానులకు ఎన్టీఆర్ రిక్వెస్ట్... త్వరలో నేనే కలుస్తా, నన్ను కలవడానికి పాదయాత్రలు వద్దు!
అభిమానులకు ఎన్టీఆర్ రిక్వెస్ట్... త్వరలో నేనే కలుస్తా, నన్ను కలవడానికి పాదయాత్రలు వద్దు!
Revanth Reddy in Assembly: లోటుపాట్లు లేకుండా సమగ్ర సర్వే - కులగణన నివేదిక ఖచ్చితమైనదన్న రేవంత్ !
లోటుపాట్లు లేకుండా సమగ్ర సర్వే - కులగణన నివేదిక ఖచ్చితమైనదన్న రేవంత్ !
SSMB29: మహేష్ బాబు కోసం హైదరాబాద్‌లో కాశీని క్రియేట్ చేస్తున్న రాజమౌళి
మహేష్ బాబు కోసం హైదరాబాద్‌లో కాశీని క్రియేట్ చేస్తున్న రాజమౌళి
Thandel OTT Release Date: 'తండేల్' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే... సినిమాకు సాయి పల్లవి - నాగ చైతన్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
'తండేల్' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే... సినిమాకు సాయి పల్లవి - నాగ చైతన్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Embed widget