అన్వేషించండి

Army Dog Zoom Passes Away: ఆర్మీ డాగ్ "జూమ్" మృతి, సెర్చ్ ఆపరేషన్‌లో వీరోచితంగా పోరాడిన శునకం

Army Dog Zoom Passes Away: ఇటీవల ఆర్మీ సెర్చ్ ఆపరేషన్‌లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన జూమ్ డాగ్ కన్నుమూసింది.

Army Dog Zoom Passes Away: 

మధ్యాహ్నం 12 గంటలకు మృతి..

ఇండియన్ ఆర్మీలోని "జూమ్" డాగ్ (Zoom Dog)మృతి చెందింది. శ్రీనగర్‌లోని వెటిర్నరీ హాస్పిటల్‌లో రెండు రోజులుగా చికిత్స పొందుతున్న శునకం...చనిపోయింది. మధ్యాహ్నం 12 గంటలకు కన్నుమూసినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అప్పటి వరకూ వైద్యానికి స్పందించిన జూమ్...ఉన్నట్టుండి పడిపోయిందని తెలిపారు. జమ్ముకశ్మీర్‌ అనంత్‌నాగ్ జిల్లా టాంగ్‌పావా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం భద్రతా దళాలకు అందింది. దీంతో ఆర్మీ.. సోమవారం సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు, భధ్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో 'జూమ్' అనే ఆర్మీ కుక్క తీవ్రంగా గాయపడింది. ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిని తొలుత భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో సైన్యం.. ఉగ్రవాదులు ఉంటున్న ఇంటికి 'జూమ్‌' అనే ఆర్మీ కుక్కను పంపారు. దీంతో 'జూమ్‌' ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసింది. ఆ సమయంలో కుక్క శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. అయినప్పటికీ లెక్కచేయకుండా 'జూమ్' వీరోచితంగా పోరాడింది. దీని ఫలితంగా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత అధికారులు 'జూమ్'ను  హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ఈ 'జూమ్' శిక్షణ పొందిన నిబద్ధత కలిగిన వీర శునకమని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసి పట్టుకోవడంలో 'జూమ్' నేర్పరి. 

గతంలోనూ..

ఆర్మీ డాగ్స్ డ్యూటీ చేస్తూ చనిపోయిన ఘటనలు గతంలోనూ జరిగాయి. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల్ని ఏరివేసే పనిలో ఉన్న ఉగ్రవాదులు బారముల్లాలో ఈ ఏడాది జులైలో ఓ టెర్రరిస్ట్‌ను మట్టుబెట్టారు. ఈ క్రమంలోనే ఒకర్ని పోగొట్టుకున్నారు. అయితే కోల్పోయింది సైనికుడిని కాదు. ఉగ్రవాది జాడను కనిపెట్టిన శునకాన్ని. అంటే...ఈ శునకం కూడా తన విధులు నిర్వర్తించే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకుంది. రెండు సంవత్సరాల వయసున్న కుక్క, వాసన చూసుకుంటూ ఉగ్రవాది జాడను కనిపెట్టింది. వెంటనే ఆ టెర్రరిస్ట్ గన్‌తో దానిపై కాల్పులు జరిపాడు. వరుసగా మూడు బుల్లెట్లు తాకటం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. "యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో భాగంగా ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాం. కానీ అంతకు ముందు యాక్సెల్‌ (కుక్క పేరు)ని కోల్పోయాం" అని సీనియర్ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాది పేరు అక్తర్ హుస్సేన్ భట్ అని, ఈ ఆపరేషన్‌లో ఇద్దరు సైనికులతో సహా ఓ పోలీస్ తీవ్రంగా గాయపడ్డారు. 5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో యాక్సెల్ ప్రాణాలు కోల్పోయింది అని తెలిపారు. ఈ కుక్క ఉగ్రవాదిని పసిగట్టి వెళ్లుంటే ఎన్‌కౌంటర్ ముందుగానే ముగిసిపోయేదని అన్నారు సైనికాధికారులు. అంతకు ముందు జరిగిన పలు కీలక ఆపరేషన్లలో యాక్సెల్ పాల్గొందని, ఎంతో మంది ఉగ్రవాదులను పసిగట్టి వారిని హతమార్చటంలో సహకరించిందని చెప్పారు. ఆర్మీలోని శునకాలకు కొన్ని సందర్భాల్లో కెమెరాలు అమర్చి అనుమానిత ప్రదేశాలకు పంపుతారు. జీపీఎస్‌ ద్వారా ముష్కరులున్న లొకేషన్‌ని ట్రాక్ చేస్తారు. 

Also Read: Indian Railways: టికెట్ కన్ఫామ్ కాకపోయినా జర్నీ చెయ్యొచ్చు! ఎలాగో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Milei Cabala Magic: వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget