అన్వేషించండి

Donald Trump Tarrifs on India: భారత్‌కు బంగారం లాంటి గుడ్ న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్, కట్టుబడి ఉంటారా?

Trump Tarriffs On Gold | బంగారంపై ఎలాంటి టారిఫ్ విధించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త చెప్పారు. దాంతో గోల్డ్ మీద క్లారిటీ వచ్చింది.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' రిపోర్ట్ ప్రకారం.. బంగారంపై ఎలాంటి టారిఫ్ విధించడం లేదని గుడ్ న్యూస్ చెప్పారు. అసలే భారతీయులు అటు పెట్టుబడికి, ఇటు ఆభరణాల కోసం బంగారం గట్టిగానే కొంటుంటారు. అంతకుముందు, కస్టమ్స్, సరిహద్దు భద్రతా విభాగం అధికారులు బంగారంపై భారీ పన్నులు విధించవచ్చని చెప్పారు. అంతలోనే ట్రంప్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. భారత్, రష్యాతో వివాదం నడుస్తున్న సమయంలో బంగారంపై టారిఫ్ లేదని ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఓవరాల్‌గా చూస్తే ట్రంప్ భారత్ పై 50 శాతం సుంకం విధించారు. ప్రస్తుతం 25 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చింది. ఆగస్టు 27 నుంచి మిగతా 25 శాతం టారిఫ్ అమలులోకి రానుంది.

ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్‌లో ఒక పోస్ట్ షేర్ చేశారు. బంగారంపై భారీ సుంకం విధిస్తారని మార్కెట్‌లో వదంతులు వ్యాపించాయి. ఇదే సమయంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి, కానీ ట్రంప్ వదంతుల్ని కొట్టిపారేశారు. ఉపశమనం కలిగించే వార్త చెప్పారు. గత వారంలో, అమెరికా కస్టమ్స్ అధికారులు ఒక లేఖను విడుదల చేశారు. రెండు ప్రామాణిక బరువులు (ఒక కిలోగ్రాము, 100 ఔన్సులు) కలిగిన బంగారు కడ్డీలను సుంకం పరిధిలోకి తీసుకురావాలని తెలిపారు. ఈ లేఖ విడుదల తరువాత బంగారం వ్యాపారులతో పాటు పెట్టుబడిదారులలో ఆందోళన పెరిగింది. ఇది అంతర్జాతీయ బంగారం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంతా భావించారు. 

ట్రంప్ ప్రకటనతో బంగారంపై క్లారిటీ

బంగారంపై విధించనున్న టారిఫ్ పై ట్రంప్ చేసిన ఈ స్పష్టమైన ప్రకటనతో క్లారిటీ వచ్చింది. బంగారం వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యాపారులకు భారీ ఊరట కలిగింది. ఈ చర్య బంగారం ధరలు, దాని సంబంధిత వ్యాపారంలో స్థిరత్వాన్ని తెస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారత్ లాంటి దేశాలు ప్రపంచంలో బంగారం అధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ జాబితాలో చైనా తరువాత స్థానంలో భారత్ ఉంది.

అమెరికా భారత్ పై 50 శాతం సుంకం విధించింది

 భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్యా యుద్ధాన్ని ప్రోత్సహిస్తుందని, భారత్ కొనుగోలు చేసి ఇస్తున్న మనీతో ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను శాంతిని కోరుకునే వ్యక్తినని, అందుకే భారత్, పాక్ మధ్య జరగాల్సిన యుద్ధాన్ని ఆపివేశానని ఇప్పటికీ డబ్బా కొట్టుకుంటున్న విషయం తెలిసిందే. భారత్‌తో జరిగే వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ అసంతృప్తిగా ఉన్నారు. మొదట భారత్‌పై 25 శాతం సుంకం విధించారు. అయినా శాంతించక మరో 25 శాతం టారిఫ్ విధించారు. అమెరికాను చూసి భారత్ భయపడాల్సింది లేదన్న కేంద్రం వ్యాఖ్యలతో పాటు రష్యా, చైనా, బ్రెజిల్ లాంటి బ్రిక్స్ దేశాలతో భారత్ కలిసి కట్టుగా పనిచేసే అవకాశం ఉందని గ్రహించి భారత్ మీద విధించిన టారిఫ్ రెట్టింపు చేశారు. ఆసియా దేశాలను టార్గెట్ చేసి మరీ ట్రంప్ అధికంగా టారిఫ్ వేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
What Indians Ate On New Year: సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
Best Foods to Eat Raw : ఈ 9 ఆహారాలు పచ్చిగానే తినాలి.. పొరపాటున వండితే పోషకాలు తగ్గిపోతాయట
ఈ 9 ఆహారాలు పచ్చిగానే తినాలి.. పొరపాటున వండితే పోషకాలు తగ్గిపోతాయట
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Embed widget