శాంతి చర్చలకు సహకరించకపోతే వచ్చే వారం నుండి సైనిక దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. పగటిపూట కూడా దాడులు ఉంటాయని ఆయన తెలిపారు.
US Iran War: ఇక పగటిపూటే దాడులు, వచ్చేవారం నుంచి భీకర దాడులు చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
US Iran Conflict | దక్షిణ ఇరాన్ పై అమెరికా దాడుల్లో 30 మందికి పైగా పౌరులు మరణించారని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫాతిమా మొహజెరానీ తెలిపారు. ఇక నుంచి పగటిపూటే దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.

- ట్రంప్ హెచ్చరిక: శాంతి చర్చలకు సహకరించకుంటే దాడులు తీవ్రతరం.
- హార్మూజ్, తీర ప్రాంతాలపై అమెరికా దాడుల్లో పౌరులు మరణించారు.
- బంపూర్ సైనిక స్థావరంపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్.
US Iran War Latest News: వాషింగ్టన్: శాంతి చర్చలకు టెహ్రాన్ సహకరించకపోతే వచ్చేవారం నుండి సైనిక దాడులను మరింత తీవ్రతరం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైట్హౌస్లో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన అనంతరం ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ అధికంగా రాత్రిపూట దాడులు చేసిన అమెరికా ఆర్మీ ఇక నుంచి పగటి పూటే దాడులు తీవ్రతరం చేస్తుందన్నారు.
ట్రంప్ ప్రకటన వెలువడిన తరువాత ఇరాన్పై అమెరికా మరోసారి దాడులు చేసింది. హర్మూజ్ జలసంధి, ఇరాన్ తీర ప్రాంతాల్లోని టెహ్రాన్ సైనిక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే, ఎక్కువగా రాత్రివేళల్లోనే దాడులు చేసిన యూఎస్ ఆర్మీ.. ప్రస్తుతం పగటిపూటనే మిస్సైల్, డ్రోన్ దాడులకు దిగుతోంది. ఇరాన్ రక్షణ, క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గ్రేటర్ తున్బ్ ద్వీపంపై దాడి జరిగింది. తమకు సహకరించకపోతే ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరాన్పై దాడులను తీవ్రతరం చేసిన అమెరికా
గత వారం నుంచి ఇరాన్పై అమెరికా తన దాడులను మరింత పెంచింది. అమెరికా ఇటీవల జరిపిన దాడిలో 30 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 260 మంది గాయపడ్డారని ఇరాన్ వైద్యారోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు. ఆ శాఖ ప్రతినిధి హుస్సేన్ కెర్మన్పూర్ మాట్లాడుతూ.. గాయపడిన వారిలో ముగ్గురు మహిళలు, 6 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. చికిత్స అందించిన తర్వాత ఇప్పటివరకు 222 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.
కొన్ని రోజుల కిందట హర్మూజ్లో అమెరికాకు చెందిన వాణిజ్య నౌక మీద దాడి తరువాత ఇరాన్తో సీజ్ ఫైర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఆ తరువాత అమెరికా సైన్యం ఇరాన్ మీద విరుచుకుపడి దాడులు చేస్తోంది. ఇరాన్ సైతం అమెరికా ఆర్మీ బేస్ క్యాంపులపై మిస్సైల్, డ్రోన్లతో ప్రతీకార దాడులు చేసింది. అంతకుముందు బుధవారం ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫాతిమా మొహాజెరానీ.. ఇటీవల దక్షిణ ఇరాన్పై అమెరికా జరిపిన దాడుల్లో 30 మందికి పైగా పౌరులు మరణించారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు మొహాజెరానీ సంతాపం తెలిపారు. ఇరాన్ ప్రభుత్వం ప్రజలకు పూర్తి మద్దతుగా నిలుస్తుందని సోషల్ మీడియా Xలో పోస్ట్ చేశారు.
అమెరికా దాడుల్లో ఇరాన్ సైనికుల మృతి
మరోవైపు, ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ ప్రకారం, ఇరాన్లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ఇరాన్షహర్ ప్రాంతంలో ఉన్న బంపూర్ బ్యారక్పై అమెరికా 13 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో 388వ బ్రిగేడ్కు చెందిన ఏడుగురు ఇరాన్ సైనికులు మరణించగా, పలువురు గాయపడ్డారు. సైనిక స్థావరంలో ఉన్న భద్రతా చర్యల కారణంగా మరణాల సంఖ్య అధికం కాకుండా నివారించగలిగామని ఇరాన్ సైన్యం పేర్కొంది.
Iranian Health Ministry says recent US airstrikes have killed at least 35 people and wounded over 300 others, reports AP
— Press Trust of India (@PTI_News) July 15, 2026
ఇరాన్ సైన్యం ప్రకారం, అమెరికా దాడుల లక్ష్యం వీలైనంత ఎక్కువ నష్టం కలిగించడం, అందుకోసం సైనిక స్థావరాలు, సెక్యూరిటీ పోస్టులు, వారిని నివాస సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడి కేవలం సైనిక స్థావరానికి నష్టం కలిగించడానికే పరిమితం కాలేదని, ఎక్కువ మంది ప్రజలకు నష్టం కలిగించడమే లక్ష్యమని ఇరాన్ సైన్యం పేర్కొంది.
దాడులకు దీటైన జవాబిస్తాం: IRGC
ఆగ్నేయ ఇరాన్లోని బంపూర్ గారిసన్ ఆర్మీ బేస్ క్యాంపుపై జరిగిన దాడికి అమెరికా మీద ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం పేర్కొంది. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన ఇరాన్ సైన్యం, సరైన సమయంలో దాడులు చేస్తామని హెచ్చరించింది.
Frequently Asked Questions
శాంతి చర్చలకు సహకరించకపోతే అమెరికా ఏ చర్యలు తీసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు?
ఇటీవల అమెరికా దాడుల్లో ఇరాన్లో ఎంతమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు?
ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇటీవల అమెరికా జరిపిన దాడుల్లో 30 మందికి పైగా పౌరులు మరణించారు. దాదాపు 260 మంది గాయపడ్డారు.
అమెరికా ఇరాన్పై దాడులను ఎందుకు తీవ్రతరం చేసింది?
హర్మూజ్లో అమెరికా వాణిజ్య నౌకపై దాడి జరిగిన తరువాత అమెరికా సీజ్ ఫైర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఆ తర్వాత ఇరాన్పై దాడులను తీవ్రతరం చేసింది.
అమెరికా దాడులపై ఇరాన్ సైన్యం ఎలా స్పందించింది?
బంపూర్ గారిసన్ ఆర్మీ బేస్ క్యాంపుపై జరిగిన దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన ఇరాన్ సైన్యం, సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.
ట్రెండింగ్ వార్తలు






















