అన్వేషించండి

Karachi Police Head Quarter Attack: పాకిస్థాన్ లోని కరాచీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ పై దాడి -నలుగురు మృతి 19మందికి గాయాలు

కరాచీలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన ముగ్గురు ఉగ్రవాదులను మూడున్నర గంటల పాటు శ్రమించి భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

పాకిస్థాన్ కరాచీలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు మృతి చెందగా, నలుగురుగాయపడినట్లు సమాచారం. ఈ సంఖ్య కూడా పెరగవచ్చు. రాత్రి 19.10 గంటల సమయంలో పోలీసులు, భద్రతా బలగాలు పోలీసు హెడ్ క్వార్టర్స్ ను తమ ఆధీనంలోకి తీసుకొని ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపారు.

కరాచీ పోలీస్ ఆఫీస్ (కేపీఓ) భవనాన్ని ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైనట్టు సింధ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ముర్తజా వహాబ్ రాత్రి 10:42 గంటలకు ట్విటర్‌లో పేర్కొన్నారు. పాకిస్థాన్‌ సైనికులు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. జియో న్యూస్ తో విడివిడిగా మాట్లాడిన ఆయన భవనానికి భద్రత కల్పించామని పునరుద్ఘాటించారు.

ఉగ్రవాదులు టయోటా కరోలా కారులో వచ్చారు.

ఈ ఆపరేషన్ కు నేతృత్వం వహించిన సీనియర్ అధికారుల్లో ఒకరైన డీఐజీ ఈస్ట్ ముకద్దాస్ హైదర్ పాక్ మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం ముగ్గురు దుండగులు టయోటా కరోలా కారులో కేపీఓకు వచ్చారని తెలిపారు. దుండగుల్లో ఒకరు భవనం నాలుగో అంతస్తులో తనను తాను కాల్చుకోగా, మరో ఇద్దరు ఉగ్రవాదులను పైకప్పుపై సైనిక బలగాాలు కాల్చి చంపాయి' అని కరాచీ పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. అల్లా దయతో కేపీవో, పరిసర ప్రాంతాలు ఉగ్రవాదుల నుంచి పూర్తిగా విముక్తి అయిందని పేర్కొన్నారు. 

 పలు చోట్ల కాల్పులు జరిగినట్లు సమాచారం 

శుక్రవారం రాత్రి 7:15 గంటల సమయంలో కరాచీ ప్రధాన రహదారి షరియా ఫైజల్‌తో పాటు ఫైజల్ బేస్ సహా పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన పలు వ్యూహాత్మక స్థావరాలపై కాల్పులు జరిపినట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. అదనపు పోలీసు బృందాలను, రేంజర్లను సంఘటనా స్థలానికి పిలిపించారు. అయితే రాత్రి 7.10 గంటల సమయంలో తొలి దాడి జరిగింది. ఉగ్రవాదులు పోలీసు హెడ్ క్వార్టర్స్ లోకి ప్రవేశించిన సమయంలో పోలీసులు లోపల లేరని చెబుతున్నారు. 

ఉగ్రవాదులు పూర్తి సన్నద్ధతతో వచ్చారు.

రేంజర్స్, క్విక్ రెస్పాన్స్ ఫోర్స్ (క్యూఆర్ఎఫ్)తో పాటు నగరం నలుమూలల నుంచి పోలీసు బలగాలను సంఘటనా స్థలానికి పిలిపించినట్లు సౌత్జోన్ డీఐజీ ఇర్ఫాన్ బలోచ్ తెలిపారు. దుండగులు హ్యాండ్ గ్రెనేడ్లు కూడా విసిరారు. దాడి చేసినవారు ఫుల్‌ ప్రిపేర్డ్‌గా వచ్చి సైనిక బలగాలతో పోరాడారు. 

జేపీఎంసీలో నలుగురు మృతి

జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్ (జేపీఎంసీ)కు తీసుకువచ్చిన నలుగురు మరణించారని, 19 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని సింధ్ ఆరోగ్య శాఖ ప్రతినిధి మెహర్ ఖుర్షీద్ తెలిపారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు, ఒక రేంజర్ అధికారి, ఒక పౌరుడు ఉన్నారని సింధ్ ప్రభుత్వ ప్రతినిధి ముర్తజా వహాబ్ తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

US Iran War Updates: 47 ఏళ్లుగా ఇరాన్ మాతో గేమ్స్ ఆడుతోంది, ఇకపై వాళ్లు నవ్వలేరు: డొనాల్డ్ ట్రంప్
47 ఏళ్లుగా ఇరాన్ మాతో గేమ్స్ ఆడుతోంది, ఇకపై వాళ్లు నవ్వలేరు: డొనాల్డ్ ట్రంప్
China : చైనాలో సంచలనం.. ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష - అవినీతిపై చేశారనే !
చైనాలో సంచలనం.. ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష - అవినీతిపై చేశారనే !
Aliens Latest News: గ్రహాంతరవాసులు ఉన్నారా? ఏలియన్ ఫైల్స్ విడుదల చేసిన ట్రంప్ ప్రభుత్వం.. సినీ నిర్మాతకు అనుమానాలు
గ్రహాంతరవాసులు ఉన్నారా? ఏలియన్ ఫైల్స్ విడుదల చేసిన ట్రంప్ ప్రభుత్వం.. సినీ నిర్మాతకు అనుమానాలు
Hantavirus: హంటా వైరస్ లెవల్ త్రీలోకి వచ్చేసింది - మళ్లీ మాస్కులు రెడీ చేసుకోవాల్సిందే!
హంటా వైరస్ లెవల్ త్రీలోకి వచ్చేసింది - మళ్లీ మాస్కులు రెడీ చేసుకోవాల్సిందే!

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget