అన్వేషించండి

Taliban Seizes Pakistan Outposts: పలు పాక్ స్థావరాలు స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు, 12 మంది పాక్ సైనికులు మృతి

డ్యూరాండ్ సరిహద్దు రేఖ వెంట ఆఫ్గనిస్తాన్ కు చెందిన తాలిబాన్ బలగాలు దాడులు చేసి కొన్ని పాక్ స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 12 మంది పాక్ సైనికులు మృతిచెందారు.

తాలిబాన్ నేతృత్వంలోని సైన్యం డ్యూరాండ్ లైన్ (సరిహద్దు రేఖ) వెంట ఉన్న పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను స్వాధీనం చేసుకుందని సమాచారం. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం నాడు ధృవీకరించింది. "తాలిబాన్ దళాలు కునార్, హెల్మండ్ ప్రావిన్స్ లలో డ్యూరాండ్ సరిహద్దు రేఖ దాటి పాకిస్తాన్ ఆర్మీ నుండి అనేక స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయి" అని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ అధికారి తెలిపారు.

పాక్, తాలిబన్ బలగాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత ఇప్పటికే తీవ్ర నష్టాన్ని కలిగించాయి. పాక్, ఆఫ్గన్ బలగాలు జరిపిన పరస్పర కాల్పుల్లో కనీసం 12 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని టిఓఎల్ఓన్యూస్ వర్గాలు వెల్లడించాయి. బహ్రాంచా జిల్లాలోని షాకిజ్, బిబి జానీ, సలేహాన్ ప్రాంతాలతో పాటు పక్తియాలోని ఆర్యూబ్ జాజీ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

దాడికి కారణాన్ని వెల్లడించిన ఆఫ్గన్ రక్షణశాఖ

పాకిస్తాన్ ఆఫ్ఘన్ గగనతలాన్ని ఉల్లంఘించిన కారణంగా ఇది ప్రతిస్పందన దాడిగా అభివర్ణించారు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అయిన ఇనాయతుల్లా ఖ్వారజ్మి. స్థానిక సమయం ప్రకారం శనివారం అర్ధరాత్రికి పోరాటం ముగిసిందని ఆయన తెలిపారు. "ఒకవేళ ప్రత్యర్థి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘిస్తే, మా సాయుధ దళాలు దానిని రక్షించేందుకు ఈసారి తీవ్ర స్థాయిలో మా ప్రతిస్పందనను ఎదుర్కోవడానికి పాక్ సైన్యం సిద్ధంగా ఉండాలని" అని ఖ్వారజ్మి హెచ్చరించారు.

తూర్పు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పోరాటం 

ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ సమీపంలో పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆఫ్గన్ తాలిబన్ బలగాలు నంగర్హర్, కునార్ లోని పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని "ప్రతీకార" చర్యలకు దిగాయని ఆఫ్ఘనిస్తాన్ 201 ఖాలిద్ బిన్ వాలిద్ ఆర్మీ కార్ప్స్ పేర్కొంది.

పక్తియా ప్రావిన్స్ లోని ఆర్యూబ్ జాజీ జిల్లాలో కూడా ఘర్షణలు చెలరేగాయి. వివాదాస్పద సరిహద్దు వెంట స్పీనా షాగా, గివి, మాని జాభా, పరిసర ప్రాంతాలకు అల్లర్లు, ఘర్షణలు విస్తరించాయి. ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ దాడిలో పాకిస్తాన్ సైనిక స్థావరాలు, ఆయుధాలు, సామాగ్రి ధ్వంసమయ్యాయని పేర్కొంది, ఇందులో కునార్, హెల్మండ్ ప్రావిన్స్ లలో ఒక్కొక్కటి చొప్పున స్థావరాలు ధ్వంసం చేసినట్లు తెలిపింది. తాలిబాన్ బలగాలు పాక్ నుంచి ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

తాలిబన్లు, పాక్ కు మధ్య పోరాటం తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది. పక్తియా, పక్తికా, ఖోస్ట్, కునార్, హెల్మండ్, నంగర్హర్ ప్రావిన్స్ లలో ఒకే సమయంలో ఘర్షణలు జరిగినట్లు సమాచారం. 2021లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆఫ్గన్ సరిహద్దులో జరిగిన తీవ్రమైన ఘర్షణలలో ఇది ఒకటి అని విశ్లేషకులు భావిస్తున్నారు.

వైమానిక దాడులను ఖండించిన పాకిస్తాన్ 

వైమానిక దాడులకు పాకిస్తాన్ ఎలాంటి బాధ్యత వహించలేదు. అయితే ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉపయోగించకుండా పాకిస్తాన్ తాలిబాన్ (టిటిపి) ను నిరోధించాలని కాబూల్ ను కోరింది. ఆఫ్ఘన్ తాలిబాన్ తో సైద్ధాంతిక సంబంధాలున్న టిటిపి, 2021 నుంచి వందల మంది పాకిస్తాన్ సైనికులను హత్య చేసినట్లు ఆరోపించింది.

"ఈ సాయంత్రం, తాలిబాన్ దళాలు ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించాయి. మేం మొదట సరిహద్దు వెంబడి మొదట తేలికపాటి, తరువాత నాలుగు పాయింట్ల వద్ద భారీ ఫిరంగి దాడులు చేశాము" అని పాకిస్తాన్ లోని ఖైబర్ కనుమ ప్రావిన్స్ లోని ఒక సీనియర్ అధికారి AFPకి తెలిపారు. "పాకిస్తాన్ దళాలు భారీ కాల్పులతో స్పందించాయి. పేలుడు పదార్థాలను మోసుకెళ్తున్న మూడు అనుమానిత ఆఫ్ఘన్ క్వాడ్రాప్టర్లను కూల్చివేశాయి. తీవ్రమైన పోరాటం కొనసాగుతోందని పేర్కొన్నారు. 

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి రెండు వైపులా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఘర్షణలు లేకుంటే విస్తృత ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఖతార్ ఈ భావనను స్పష్టం చేసింది. ఉద్రిక్తతను నివారించడానికి చర్చలు, దౌత్యానికి పిలుపునిచ్చింది. సౌదీ అరేబియా సైతం సంయమనం పాటించాలని సూచించింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Advertisement

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget