అన్వేషించండి

PM Modi: మోదీని గొప్ప వ్యక్తి, మంచి మిత్రుడిగా భావిస్తున్న ట్రంప్.. ప్రధానికి గిఫ్ట్ సైతం

రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని అమెరికా దౌత్యవేత్త సెర్గియో గోర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందించుకుంటామని తెలిపారు.

PM Narendra Modi | US రాయబారి నామినేట్ సెర్గియో గోర్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తన సమావేశాన్ని “అద్భుతం” అని వర్ణించారు. ఇది భారత్, అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేయడం దిశగా పడుతున్న అడుగులను సూచిస్తుంది. చర్చల సందర్భంగా యూఎస్ అంబాసిడర్ గోర్ వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, రక్షణతో సహా సహకారానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. భారతదేశ ఎగుమతులపై US విధించిన 50% సుంకాలు సహా కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల మధ్య ఆయన వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్తు గురించి గోర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా, భారత్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఉమ్మడి నిబద్ధతను ప్రస్తావించారు.

అమెరికా రాయబారి సెర్గియే గోర్‌కు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. ట్రంప్‌తో తనతో ప్రధాని మోదీ ఉన్న ఒక ఫ్రేమ్ చేసిన ఫోటోను పంపించారు. ఇది ఇరు దేశాల మధ్య సత్సంబంధాల కోసం చేస్తున్న ప్రయత్నాలను సూచిస్తుంది. “భారతదేశానికి US రాయబారిగా నామినేట్ అయిన సెర్గియో గోర్‌ను తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఆయన పదవీకాలం భారత్, అమెరికా సమగ్ర గ్లోబల్ స్ట్రాటజిక్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని నమ్ముతున్నాను,” అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

జైశంకర్‌తో అమెరికా దౌత్యవేత్త భేటీ

ప్రధానిని కలవడానికి ముందు అమెరికా అంబాసిడర్ గోర్ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల మధ్య దౌత్యపరమైన చర్చల ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ట్రంప్ భారతదేశ ఎగుమతులపై 50 శాతం టారిఫ్ విధిస్తూ తీసుకున్న నిర్ణయంతో  రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. భారతదేశం రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లపై అదనంగా విధించిన 25 శాతం టారిఫ్ కూడా ఉంది. భారత ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ చర్యలను “అన్యాయం, అహేతుకం” అని పేర్కొంది.

మోదీని గ్రేట్ ఫ్రెండ్‌గా అభివర్ణించిన ట్రంప్ 

టారిఫ్ వివాదం కొనసాగుతున్నప్పటికీ.. ప్రధాని మోడీని ట్రంప్ “గొప్ప వ్యక్తి, మంచి స్నేహితుడు”గా భావిస్తున్నారని అమెరికా దౌత్యవేత్త గోర్ తెలిపారు. ఇద్దరు నాయకుల మధ్య జరిగిన ఇటీవలి ఫోన్ సంభాషణలు ద్వైపాక్షిక వాణిజ్య చర్చలలో పురోగతికి ఆశలు రేపాయి. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై భారతదేశం, అమెరికా నిరంతరం చర్చలు జరుపుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. 

“ఇరు దేశాల మధ్య చర్చలు వివిధ స్థాయిల్లో జరుగుతున్నాయి. మేం ఎలా ముందుకు సాగాలని యోచిస్తున్నామో త్వరలో మరింత సమాచారం అందిస్తామని” అని పీయూష్ గోయల్ దోహాలో మాట్లాడారు. భారత రైతులు, పాడి పరిశ్రమల ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నొక్కిచెప్పారు. ఇది UK, ఆస్ట్రేలియా, EFTA కూటమితో సంతకం చేసిన వాణిజ్య ఒప్పందాలకు అనుగుణంగా ఉందన్నారు.

భారత్, అమెరికా కీలక చర్చలకు సిద్ధమవుతోంది. దౌత్యపరమైన చర్చలకు అమెరికా ఇస్తున్న ప్రాధాన్యతలను గోర్ తెలిపారు. వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి నవంబర్‌ను గడువుగా తీసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Advertisement

వీడియోలు

India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Nuclear ash over the Himalayas: హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
Cheapest Cars in India: దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే! 34 KM మైలేజ్‌తోపాటు ADAS ఫీచర్ ఉన్న వాహనాల ధర ఎంత?
దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే! 34 KM మైలేజ్‌తోపాటు ADAS ఫీచర్ ఉన్న వాహనాల ధర ఎంత?
Lucky Draw Sarpanchs in Telangana: రెండో విడత ఫలితాల్లో చిత్ర విచిత్రాలు.. సమానంగా ఓట్లు, లక్కీ డ్రా సర్పంచ్ లు..!
రెండో విడత ఫలితాల్లో చిత్ర విచిత్రాలు.. సమానంగా ఓట్లు, లక్కీ డ్రా సర్పంచ్ లు..!
Embed widget