అన్వేషించండి

Pak PM Shahbaz Sharif: భారత్ చర్యలతో వెనక్కి తగ్గిన పాకిస్తాన్! పహల్గాం దాడిపై దర్యాప్తునకు సిద్ధం: షెహబాజ్ షరీఫ్

Pahalgam terror attack | పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్ నిష్పక్షపాత విచారణకు సిద్ధమని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.

Kashmir Pahalgam Terror Attack: భారత ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో పాకిస్తాన్‌లో కదలిక వచ్చింది. ఎంతలా అంటే.. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై పారదర్శకంగా విచారణ జరగాలని అని పాక్ ప్రధాని వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది ఉగ్రవాదుల దాడిలో  ప్రాణాలు కోల్పోవడంపై న్యాయపరమైన విచారణకు తాము సిద్ధమని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ శనివారం (ఏప్రిల్ 26) అన్నారు. పారదర్శకంగా జరగనున్న విచారణలో పాల్గొనేందుకు పాక్ సిద్ధంగా ఉందన్నారు. పాకిస్తాన్ అన్ని రకాల ఉగ్రవాదాలను వ్యతిరేకిస్తోందని, పాకిస్తాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఏప్రిల్ 22న లష్కరే తోయిబా వర్గానికి చెందిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే గ్రూప్ ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలోని పర్యాటక ప్రాంతం బైసరన్ లోయలో కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది మరణించగా, పలువురు పర్యాటకులు గాయపడ్డారని తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయి చర్యలు తీసుకుంటుంది. ఆ సమయంలో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన మధ్యలోనే భారత్‌కు తిరిగి వచ్చారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

సరైన న్యాయ విచారణలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం..

కాకుల్‌లోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలోని పాసింగ్ అవుట్ పెరేడ్‌ను ఉద్దేశించి షెహబాజ్ షరీఫ్ మాట్లాడారు. భారతదేశం నిరాధారమైన, అసంబద్ధమైన ఆరోపణలు మాపై చేస్తోంది. పాకిస్తాన్ చేసింది అనడానికి సాక్ష్యాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రిగా బాధ్యతాయుతంగా నా వంతు పాత్రను కొనసాగిస్తాను. పాక్ బాధ్యతగా వ్యవహరిస్తుందని, పహల్గాం ఉగ్రదాడిపై జరిగే ఏదైనా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన విచారణలో పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 

కశ్మీర్ పాకిస్తాన్ స్వరం..

ఈ సందర్భంగా షెహబాజ్ షరీఫ్ మరోసారి జమ్మూ కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించారు. పాకిస్తాన్ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నా చెప్పినట్లుగా, మనం కాశ్మీర్ ప్రాముఖ్యతను తెలుసుకోవాలి.   కశ్మీర్ పాకిస్తాన్ గొంతు, స్వరం అన్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎల్లప్పుడూ ఉగ్రవాదం అన్ని రూపాలను వ్యతిరేకిస్తున్నారు. ఏ విధంగానూ ఉగ్రవాదం ఉండకూడదు. మనం దీన్ని ఖండించాలి అన్నారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదం కారణంగా భారీ నష్టాలను ఎదుర్కొంది.  90,000 మంది ప్రాణాలు కోల్పోయారు, 600 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని షెహబాజ్ షరీఫ్ అన్నారు. 

భారత్, పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు

పహల్గాం దాడి తరువాత పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇస్లామాబాద్‌కు వ్యతిరేకంగా భారత్ దౌత్యపరమైన, వ్యూహాత్మక చర్యలు తీసుకుంది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ లో ప్రతినిధులను తగ్గించింది. ముఖ్యంగా పాక్ కు తీవ్ర నష్టం కలిగించే 1960 సింధు జల ఒప్పందాన్ని నిషేధించడం, అటారి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ను మూసివేయాలన్న నిర్ణయాలు తీసుకుంది. దాంతో పాకిస్తాన్ పౌరులకు వీసా సేవలను రద్దు చేసింది. ప్రతిచర్యగా, పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. భారత విమానాలు పాక్ గగనతలంలో ప్రయాణించకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget