అన్వేషించండి

Modi Tour: పోలాండ్‌ నుంచి ఉక్రెయిన్‌కు మోడీ-యుద్ధంతో సమస్య తీరదన్న భారత ప్రధాని

Ukraine Tour: యుద్ధంతో సమస్యకు పరిష్కారం దొరకదన్నారు భారత ప్రధాని మోడీ. పోలెండ్‌లో రెండు రోజులు పర్యటించిన ఆయన... శాంతి స్థాపనకు ఇండియా కట్టుబడి ఉందని చెప్పారు.

PM Modi Tour In Poland, Ukraine: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) 45 ఏళ్ల తర్వాత పోలండ్‌(Poland)లో పర్యటించారు. రెండు రోజుల పాటు అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి విలాసవంతమైన ట్రైన్‌లో నిన్న  సాయంత్రం ఉక్రెయిన్‌(Ukraine) బయల్దేరారు. పోలండ్‌ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు మోడీ. యుద్ధ భూమిలో ఏ సమస్యకు పరిష్కారం దొరకదని చెప్పారు. ఈ విషయాన్ని భారత్‌ బలంగా నమ్ముతుందని తెలిపారాయన. ఉక్రెయిన్‌తోపాటు  పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభాలు ప్రపంచానికి మంచివి కావన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు మోడీ. ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత పునరుద్దరణను నెలకొల్పేందుకు అవసరమైన మద్దతు  ఇస్తామన్నారు.

పోలండ్‌ రాజధాని వార్సా(Warsaw)లో ఆ దేశ ప్రధాని డొలాన్డ్‌ టస్క్‌(Donald Tusk)తో సమావేశయ్యారు నరేంద్ర మోడీ. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంతోపాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై చర్చించారు. సమావేశం తర్వాత... ఇద్ద  దేశాల ప్రధానులు కలిసి మీడియా ప్రకటన విడుదల చేశారు. భారత్, పోలండ్‌లు అంతర్జాతీయ వేదికపై సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. భారత్‌, పోలండ్‌ మధ్య బంధం బలోపేతానికి మరింతగా కృషి చేస్తామన్నారు మోడీ.  పోలండ్‌తో సామాజిక భద్రతా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించారు. దీని వల్ల శుద్ధ ఇంధనం, కొత్త టెక్నాలజీ రంగాల్లో బంధం బలోపేతం అవుతుందన్నారు. 

యుద్ధంతో సమస్య పరిష్కారం కాదు...
ప్రతీ సమస్యకు యుద్ధం పరిష్కారం కాదన్నారు ప్రధాని మోడీ. ఉక్రెయిన్‌తోపాటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. సంక్షోభాల కారణంగా అమాయ ప్రజలు ప్రాణాలు కల్పోతున్నారని విచారం వ్యక్తం  చేశారు భారత ప్రధాని మోడీ. ఇది మానవాళికి పెను సవాల్‌ అని అన్నారాయన. యుద్ధంతో ఏ సమస్యను పరిష్కరించలేమని భారత్‌ గట్టిగా నమ్ముతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా శాంతి, స్థిరత్వం రావాలని... అందుకు చర్చలు, దౌత్యానికే  ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇందుకోసం మిత్ర దేశాలతో కలిసి వీలైంత సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు మోడీ.

మోడీ ఉక్రెయిన్‌ పర్యటన
పోలండ్‌ నుంచి రైలులో ఉక్రెయిన్‌ వెళ్లారు ప్రధాని మోడీ. 10 గంటల పాటు ట్రైన్‌లో జర్నీ చేశారు. గురువారం (ఆగస్టు 22) సాయంత్రం ట్రైన్‌ఫోర్స్‌ అనే లగ్జరీ ట్రైన్‌లో ఉక్రెయిన్‌ బయల్దేరారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఎయిర్‌పోర్టులకు భద్రత  కరువైంది. రోడ్డు మార్గాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో.. మోడీ... ట్రైన్‌ 10గంటలు ప్రయాణించి కీవ్‌ చేరుకోనున్నారు. అత్యాధునిక టెక్రాలజీతో తయారు చేసిన ట్రైన్‌లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు  జెలెన్‌స్కీ(Zelensky) తో భేటీ కానున్నారు ప్రధాని మోడీ.

45ఏళ్ల తర్వాత పొలండ్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించారు. 1978లో మురార్జీ దేశాయ్‌ పోలండ్‌ వెళ్లారు. ఆ తర్వాత భారత ప్రధానిగా మోడీ పర్యటించారు. భారత విదేశీ విధానంలోనూ మార్పు వచ్చిందన్నారు  నరేంద్ర మోడీ. అన్ని దేశాలకు దూరంగా ఉండాలనేలా భారత విదేశాంగ విధానం ఉండేదని.. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిందన్నారు. భారత విదేశాంగ విధానంలో 180 డిగ్రీల మార్పు వచ్చిందన్నారు. అన్ని దేశాలతో సన్నిహిత సంబంధాలను  కలిగి ఉండటమే భారత దేశ విధానమని చెప్పారు. భారత్‌ను విశ్వ బంధుగా ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయన్నారు మోడీ. నేటి భారత్‌ ప్రతి ఒక్కరితో కనెక్ట్‌ కావాలని.. ప్రతి ఒక్కరికీ లాభం చేకూరాలని ఆలోచిస్తోందని చెప్పారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagababu Latest News: నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
Nara Lokesh News: ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
Tirumala News: తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
David Warner in Robinhood: 'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎంట్రీ అదుర్స్ - కనిపించేది కొద్దిసేపే అయినా.. ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదంతే..
'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎంట్రీ అదుర్స్ - కనిపించేది కొద్దిసేపే అయినా.. ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదంతే..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP DesamShardul Thakur Bowling Strategy vs SRH IPL 2025 | కాన్ఫిడెన్స్ తోనే సన్ రైజర్స్ కు పిచ్చెక్కించాడుShardul Thakur 4Wickets vs SRH | IPL 2025 లో పర్పుల్ క్యాప్ అందుకున్న శార్దూల్ విచిత్రమైన కథ | ABP DesamSRH vs LSG Match Highlights IPL 2025 | 300 కొట్టేస్తాం అనుకుంటే..మడతపెట్టి కొట్టిన LSG | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagababu Latest News: నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
Nara Lokesh News: ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
Tirumala News: తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
David Warner in Robinhood: 'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎంట్రీ అదుర్స్ - కనిపించేది కొద్దిసేపే అయినా.. ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదంతే..
'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎంట్రీ అదుర్స్ - కనిపించేది కొద్దిసేపే అయినా.. ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదంతే..
Pawan Kalyan Review: శాంతిభద్రతలపై డీసీఎం పవన్ సమీక్ష- పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్
శాంతిభద్రతలపై డీసీఎం పవన్ సమీక్ష- పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్
Sahkar Taxi Service:ఓలా, ఊబెర్‌కు పోటీగా 'సహకార్'- త్వరలోనే రోడ్లపైకి ప్రభుత్వ ట్యాక్సీ సర్వీస్
ఓలా, ఊబెర్‌కు పోటీగా 'సహకార్'- త్వరలోనే రోడ్లపైకి ప్రభుత్వ ట్యాక్సీ సర్వీస్
Tax on ULIPs: 'యులిప్‌'లపై టాక్స్‌ మోత - ఏప్రిల్‌ నుంచి ఏం మారుతుంది?
'యులిప్‌'లపై టాక్స్‌ మోత - ఏప్రిల్‌ నుంచి ఏం మారుతుంది?
Mad Square OTT Partner: యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్ స్క్వేర్' - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్ స్క్వేర్' - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Embed widget