అన్వేషించండి

NASA Feels ISRO Strong Competitor: ఇండియా చంద్రుడి మీద చేసిన ప్రయోగాలనే నాసా దాటాలనుకుంటుందా ?

ISRO and NASA: 21 వ శతాబ్దంలో సాంకేతికతను అందిపుచ్చుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో చంద్రుడిపై అప్పటివరకూ ఎవ్వరూ చేయని ప్రయోగాలను చేసింది.

చంద్రుడిపైకి మనిషి పంపి యాభై ఏళ్లు పూర్తి
1972తర్వాత చంద్రుడిపై ప్రయోగాలు చేయని నాసా
అపోలో మిషన్స్ నిలిపివేసి స్వస్తి పలికిన నాసా
చంద్రయాన్ ప్రయోగాలతో చంద్రుడిపై ఇస్రో జెండా
మామ్ ప్రయోగంతోనూ రికార్డులు బద్దలు కొట్టిన ఇస్రో
మిషన్ మార్స్ కు ఇస్రో పోటీ అని నాసా భావిస్తోందా..?
యాభై ఏళ్ల తర్వాత చంద్రుడిపై ప్రయోగాలు దేనికి సంకేతం

చంద్రుడి మీదకు మనిషిని నాసా పంపించి యాభై ఏళ్లు గడుస్తోంది. 1972 డిసెంబర్ తర్వాత చంద్రుడి వైపు చూడని నాసాకు ఇప్పుడెందుకు ఇన్నేళ్ల తర్వాత చంద్రుడు గుర్తొచ్చాడు. దీనికి కారణాలు మనం గత వీడియోలో చెప్పుకున్నాం. కానీ ఆ వీడియోలో మాట్లాడని అంశం ఒకటి ఉంది. అదే చంద్రుడి మీద భారత్ చేస్తున్న ప్రయోగాలు. చైనాలానో, రష్యాలోనో భారత్ ఏమీ అమెరికాకు శత్రుదేశం కాదు. జార్జ్ బుష్ తర్వాత వచ్చిన ఒబామా, ట్రంప్, ఇప్పుడు జో బెడైన్ అంతా భారత్ తో సఖ్యతో ఉన్నవారే. అయితే అగ్రరాజ్యం అమెరికాది వేరో ఓ తరహా. వాళ్లదంతా పెట్టుబడిదారీ విధానమే. 1972 లో వాళ్ల దేశాల నుంచి వినిపిస్తున్న వ్యతిరేకతలు, బడ్జెట్ లోటుతో చంద్రుడిపై ప్రయోగాలను నాసా ఆపేసింది. అయితే 21 వ శతాబ్దంలో సాంకేతికతను అందిపుచ్చుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో చంద్రుడిపై అప్పటివరకూ ఎవ్వరూ చేయని ప్రయోగాలను చేసింది.

2008లో చంద్రయాన్ 1..
2008 లో ప్రయోగించిన చంద్రయాన్ 1 ద్వారా మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ను పంపించి చంద్రుడి సౌత్ పోల్ ను ఢీకొట్టింది. అక్కడ చిన్న పాటి బొరియను ఏర్పరచి దానికి జవహర్ పాయింట్ అని పేరు పెట్టింది. రెండేళ్ల పాటు అక్కడ ప్రయోగాలు జరపటం ద్వారా చంద్రుడి లోపలి పొరల్లో ఉన్న నీటి జాడలను స్పష్టంగా గుర్తించింది భారత్. మూన్ మినరాలజీ మ్యాప్ ను తయారు చేయటం ద్వారా వాటర్ మాల్యుకూల్స్ ఉన్నాయా లేదా అన్న డౌట్స్ ను చెరిపి పారేశింది చంద్రయాన్ 1. ఈ ప్రాజెక్ట్ కోసం ఇస్రో పెట్టిన ఖర్చు 386 కోట్ల రూపాయలు. నాసా పెట్టే ఖర్చుతో పోలిస్తే ఇది ఇది చాలా తక్కువ.

2014లో మంగళ్‌యాన్ మిషన్
2014 లో మార్స్ ఆర్బిటర్ మిషన్ - మామ్ లేదా మంగళ్ యాన్ పేరుతో ఓ స్పేస్ క్రాఫ్ట్ ను 2014 సెప్టెంబర్ లో మార్స్ కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగింది ఇస్రో. నాసా, రష్యన్ స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా నిలిచింది భారత్. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం భారత్ చేసిన ఖర్చు 450 కోట్ల రూపాయలు. ఇప్పటివరకూ మార్స్ కక్ష్యలోకి పెట్టిన స్పేస్ క్రాఫ్ట్స్ లో అతి తక్కువ ఖర్చుతో చేరుకుంది మంగళ్ యాన్ మాత్రమే.
2019లో ఇస్రో చంద్రయాన్ 2..
2019లో ఇస్రో మరో ప్రయోగం కూడా చేసింది. అదే చంద్రయాన్ 2. ఇప్పటివరకూ మనిషి కాలు మోపేందుకు సాధ్యం కాని చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని టార్గెట్ చేసింది భారత్. అక్కడ రోవర్‌ను నడిపించటం ద్వారా పరిస్థితులను తెలుసుకోవాలని భావించింది. కానీ విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ అయేప్పుడు ఏర్పడిన టెక్నికల్ గ్లిచ్ కారణంగా ప్రజ్ఞాన్ రోవర్ క్రాష్ బయటకు రాక... చంద్రయాన్ 2 అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. ఈ పరిణామాలన్నింటినీ నాసా గమనిస్తూనే ఉంది.

2030 కల్లా అంగారకుడిపైకి అంతరిక్ష యాత్రికులను పంపించాలనేది నాసాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్లాన్. ఈ లోపు డీప్ స్పేస్ మీద పరిశోధనలకు ఎక్కువ నిధులు కేటాయించటం, ఫెడరల్ గవర్నమెంట్స్ తో ఉన్న ఇబ్బందులు కారణంగా నాసా తిరిగి చంద్రుడి మీద కాన్సట్రేట్ చేయలేకపోయింది. ఇఫ్పుడు ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు పోటీలోకి వచ్చేశాయి. ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్, జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజన్, రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ ఎలా ఎవరికి వారే అంతరిక్ష పోటీల్లో మాకు మేమే పోటీ అని చెప్పుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ లాంటి దేశాలకు కూడా అవకాశాలను వదిలేసి తమకున్న క్రెడిబులిటీనీ, కెపాసిటీని నాసా కోల్పోవాలని అనుకోవట్లేదనేది విశ్లేషకుల అంచనా. 

యాభై సంవత్సరాల తర్వాత ఆర్టెమిస్ ప్రాజెక్ట్ ద్వారా వరుసగా మూడు రాకెట్ ప్రయోగాలు జరిపి చంద్రుడిని భూమికి ఆల్టర్నేటివ్ లాంచ్ ప్యాడ్ లా మార్చుకోవాలనేది ఇప్పుడు నాసా ముందున్న లక్ష్యం. అందుకే ప్రపంచదేశాలకు ఆహ్వానం పంపి మరీ తన ఆర్థిక ఇబ్బందులను దాటుకుంటూ ఆర్టెమిస్ ప్రాజెక్ట్ ద్వారా మరో సారి తన సత్తా చాటాలని చూస్తోంది. 

Also Read: NASA Artemis 1: నాసా ఆర్టెమిస్ 1లో మనుషులని ఎందుకు పంపట్లేదు - 2&3 దశలలో ఏం చేస్తారు ?

Also Read: NASA Artemis 1: 1972 తర్వాత చంద్రుడిపైకి ఎవరూ ఎందుకెళ్లలేదు ! 50 ఏళ్ల తర్వాత మళ్లీ నాసానే ప్రయోగాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
గుడ్ న్యూస్.. హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
Old Age Viral Love Story: భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు
భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget