అన్వేషించండి

Iran Warns Trump: అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటుంది, అణు కార్యక్రమాలు ఆపేది లేదన్న ఇరాన్ అధ్యక్షుడు

తమ దేశంలోని అణు స్ధావరాలపై చేసిన దాడులకుగానూ అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. అణు కార్యక్రమాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేది లేదన్నారు.

Iran Israel Conflict Latest News: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్ హెచ్చరికలను పట్టించుకోని అమెరికా ఎట్టకేలకు యుద్ధరంగంలోకి దిగింది. అమెరికా సైనిక జోక్యం చేసుకోవద్దని ఇరాన్ మొదట్నుంచీ చెబుతోంది. కానీ ఇరాన్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇస్ఫహాన్, నటాంజ్,  ఫోర్డో అణు స్థావరాలపై అమెరికా బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో దాడులు చేసింది. అమెరికా జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం జరుగుతుందని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. 

ఇరాన్ అధినేత ఆయతుల్లా ఖమేనీ అమెరికా దాడులను తీవ్రంగా ఖండించారు. తమ అణస్థావరాలపై దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ అణు కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేసేది లేదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తో ఫోన్ సంభాషణలో ఈ విషయాన్ని పెజెష్కియాన్ వెల్లడించినట్లు సమాచారం.

తమ అణుస్థావరాలపై దాడులకు ప్రతీకారంగా అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్ సహా కనీసం 19 దేశాల్లో అమెరికా సైనిక ఉనికిని కలిగి ఉందని తెలిసిందే. ఇరాన్ లక్ష్యాలలో ఒకటి బహ్రెయిన్‌లోని మినా సల్మాన్‌లో ఉన్న అమెరికా నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం కావొచ్చు. ఇరాన్ సైన్యం దీనిపై ప్రతీకార దాడి చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

హోర్ముజ్ జలసంధి, చమురు సరఫరాకు ముప్పు

అమెరికా రంగంలోకి దిగనంత పరిస్థితి ఒకలా ఉండేది. ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగి, ఇరాన్ లోని అణు స్థావరాలపై దాడి చేయడంతో  ఇరాన్ ప్రపంచ సముద్ర మార్గాలను, ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్‌ను హిందూ మహాసముద్రంతో కలిపే కీలకమైన జలమార్గమైన హోర్ముజ్ జలసంధిని లక్ష్యంగా చేసుకోనుంది. ప్రపంచ చమురులో దాదాపు 30 శాతం ఈ జలసంధి ద్వారా వెళుతుంది. ఒకవేళ అక్కడి నుంచి చమురు సరఫరా నిలిచిపోయేలా దారులు మూసివేస్తూ ఆటంకం కలిగించేలా ఇరాన్ వ్యూహాత్మక చర్యలు చేపట్టనుంది. దాంతో ఇది పలు దేశాలకు  ఆర్థికపరమైన సమస్యగా మారనుంది. ఇక్కడ ఏదైనా అంతరాయం కలిగితే ప్రపంచ ఇంధన మార్కెట్లలో అస్థిరత్వానికి దారి తీస్తుంది. దాంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ఇతర సముద్ర మార్గాలపై కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. 

అణు స్థావరాలను ఖాళీ చేసిన ఇరాన్

అమెరికా హెచ్చరికలు, ఇజ్రాయెల్ దాడులు పెంచుతున్న క్రమంలో ముప్పు పొంచి ఉందని భావించిన ఇరాన్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. అమెరికా దాడులకు ముందు ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ సహా కీలక అణు కేంద్రాలను ఇరాన్ ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రభుత్వ మీడియా డిప్యూటీ హెడ్ హసన్ అబెడిని అణు కేంద్రాలను ఖాళీ చేయడాన్ని ధృవీకరించారు.

"ఇరాన్ కొన్ని రోజుల కిందటే మూడు అణు స్థావరాలను ఖాళీ చేసింది. ఈ స్థావరాల నుండి యురేనియం నిల్వలను ఇతర ప్రాంతాలకు తరలించాం. ఎందుకంటే ఇజ్రాయెల్, అమెరికా వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే రేడియేషన్ విడుదలై ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించాం. ప్రస్తుతం ఆ అణు స్థావరాలలో ఎలాంటి హాని కలిగించే పదార్థాలు ఏవీ లేవు" అని ఆయన తెలిపారు.

ఇప్పటికే ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు స్థావరాలపై బాంబులు వేసినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో అమెరికా దాడి చేసినట్లు సమాచారం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పలు దేశాలకు తలనొప్పిగా మారనుంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Japan Illegal Mosque Inauguration: జపాన్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ - పర్మిషన్ లేని మసీదును ప్రారంభించిన రాయబారి.. కూల్చివేతకు జపాన్ ఆర్డర్!
జపాన్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ - పర్మిషన్ లేని మసీదును ప్రారంభించిన రాయబారి.. కూల్చివేతకు జపాన్ ఆర్డర్!
Texas Resident Rips Indian Flag: డాలస్‌లో రెచ్చిపోతున్న పనీపాటా లేని అమెరికన్ యువత - భారత జెండాలు చించి జాత్యాహంకారం -సోషల్ మీడియా వైరల్ కోసమే !
డాలస్‌లో రెచ్చిపోతున్న పనీపాటా లేని అమెరికన్ యువత - భారత జెండాలు చించి జాత్యాహంకారం -సోషల్ మీడియా వైరల్ కోసమే !
ABP India at 2047 Conclave: పశ్చిమాసియా అనిశ్చితితో భారత్‌లో ఆర్థిక ముప్పు.. దిగుమతులపై నిషేధం సరికాదు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
పశ్చిమాసియా అనిశ్చితితో భారత్‌లో ఆర్థిక ముప్పు.. దిగుమతులపై నిషేధం సరికాదు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget