అన్వేషించండి

Mosque Blast in Peshawar: మసీదు వద్ద భారీ పేలుడు- 56 మంది మృతి

పాకిస్థాన్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ దాడిలో 56 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్‌లో పెషావర్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 56 మంది మృతి చెందారు, 50 మందికి పైగా గాయాలైనట్లు ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 

పెషావర్‌లోని షియా మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతోన్న వేళ ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడుకు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు.

దర్యాప్తు

పెషావర్‌లోని కిస్సా ఖ్వానీ బజార్‌లో ఉన్న జామియా మసీదే లక్ష్యంగా ఈ పేలుడు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ప్రార్థనలు జరుగుతోన్న సమయంలోనే పక్కా ప్లాన్ ప్రకారం ఈ దాడి చేసినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ముందుగా ఇద్దరు దుండగులు.. తుపాకీలతో మాస్కులోకి ప్రవేశించేందుకు యత్నించారని పోలీసులు వెల్లడించారు. కాపాలాగా ఉన్న పోలీసుపై కాల్పులు చేయగా అధికారి అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత పేలుడు జరిగిందన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

వరుస దాడులు

పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు కొత్తేం కాదు. ముఖ్యంగా మసీదులు, జనాలు ఎక్కువగా ఉండే మార్కెట్లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల్లో అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పాకిస్థాన్‌లోనే కాకుండా భారత్ సహా ప్రపంచదేశాల్లో పలు ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతోన్న ఉగ్రవాదులకు నివాసంగా పాకిస్థాన్ తయారైందని ఐరాసలో పలుసార్లు భారత్ స్పష్టం చేసింది.

గ్రే లిస్ట్‌లోనే

మరోవైపు పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలేలా ఉంది. ప్రపంచ మనీలాండరింగ్‌, టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ నిఘా సంస్థ (ఎఫ్​ఏటీఎఫ్)​ పాకిస్థాన్‌ను జూన్‌ వరకు గ్రే జాబితాలోనే కొనసాగించనున్నట్లు సమాచారం. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోనందుకే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థికసాయం అందకుండా చర్యలు తీసుకోవటంలో విఫలమైనందున 2018 జూన్‌ నుంచి పాకిస్థాన్‌ ఎఫ్​ఏటీఎఫ్ గ్రే జాబితాలో కొనసాగుతోంది. 

Also Read: CAATSA India: భారత్‌ మెడపై 'కాట్సా' కత్తి- బైడెన్ కోర్టులో బంతి, మోదీ ఏం చేస్తారో మరి!

Also Read: Russia Ukraine War: ఇది కనుక పేలితే ఐరోపా అంతమే- దాని కన్నా 10 రెట్లు ఎక్కువ : జెలెన్‌స్కీ

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad local body MLC elections: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
CM Chandrababu: నేడు ఢిల్లీకి చంద్రబాబు, తొలిసారి సతీసమేతంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం
నేడు ఢిల్లీకి చంద్రబాబు, తొలిసారి సతీసమేతంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం
Indus Water Treaty: సింధు జలాల ఒప్పందాన్ని నిషేధించిన భారత్, అధికారికంగా నోటిఫికేషన్ జారీ- పాక్‌కు గట్టి దెబ్బ
సింధు జలాల ఒప్పందాన్ని నిషేధించిన భారత్, అధికారికంగా నోటిఫికేషన్ జారీ- పాక్‌కు గట్టి దెబ్బ
Allu Arjun: అల్లు అర్జున్ న్యూ లుక్ అదుర్స్ - రూ.1.2 కోట్ల వాచ్‌తో స్టైలిష్‌గా.. అట్లీ మూవీ కోసమేనా?
అల్లు అర్జున్ న్యూ లుక్ అదుర్స్ - రూ.1.2 కోట్ల వాచ్‌తో స్టైలిష్‌గా.. అట్లీ మూవీ కోసమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs SRH Match preview IPL 2025 | ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలవాలి..ఓడితే ఇక ఇంటికే | ABP DesamVirat Kohli 70 Runs vs RR IPL 2025 | ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన విరాట్ కొహ్లీ | ABP DesamJosh Hazlewood Bowling vs RR IPL 2025 | హేజిల్ వుడ్ బౌలింగ్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ | ABP DesamRCB vs RR Match Highlights IPL 2025 | పట్టు బిగించి చివర్లో మ్యాచ్ ను లాగేసుకున్న ఆర్సీబీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad local body MLC elections: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
CM Chandrababu: నేడు ఢిల్లీకి చంద్రబాబు, తొలిసారి సతీసమేతంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం
నేడు ఢిల్లీకి చంద్రబాబు, తొలిసారి సతీసమేతంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం
Indus Water Treaty: సింధు జలాల ఒప్పందాన్ని నిషేధించిన భారత్, అధికారికంగా నోటిఫికేషన్ జారీ- పాక్‌కు గట్టి దెబ్బ
సింధు జలాల ఒప్పందాన్ని నిషేధించిన భారత్, అధికారికంగా నోటిఫికేషన్ జారీ- పాక్‌కు గట్టి దెబ్బ
Allu Arjun: అల్లు అర్జున్ న్యూ లుక్ అదుర్స్ - రూ.1.2 కోట్ల వాచ్‌తో స్టైలిష్‌గా.. అట్లీ మూవీ కోసమేనా?
అల్లు అర్జున్ న్యూ లుక్ అదుర్స్ - రూ.1.2 కోట్ల వాచ్‌తో స్టైలిష్‌గా.. అట్లీ మూవీ కోసమేనా?
ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్టుగా సంబోధించిన వైఎస్ షర్మిల, ఏపీ పీసీసీ చీఫ్ నోరు జారారా?
ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్టుగా సంబోధించిన వైఎస్ షర్మిల, ఏపీ పీసీసీ చీఫ్ నోరు జారారా?
PV Sunil Kumar : పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ -  మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ - మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
Crime News: 5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
Viral News: ఏం గుండెరా అది.. తాను ప్రేమించిన యువతులను ఒకేసారి పెళ్లి చేసుకున్న మరో యువకుడు
ఏం గుండెరా అది.. తాను ప్రేమించిన యువతులను ఒకేసారి పెళ్లి చేసుకున్న మరో యువకుడు
Embed widget