పశ్చిమమధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర నుండి తమిళనాడు వరకు విస్తరించిన ఒక ద్రోణి దీనికి కారణం. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు వస్తాయి.
Andhra Pradesh Rains: బంగాళాఖాతం మీదుగా ద్రోణి.. వర్షాలతో ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
Andhra Pradesh Rains | నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది.

- పశ్చిమ మధ్య బంగాళాఖాత ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు.
- శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.
- పిడుగుల వర్షాల వేళ ప్రజలు బయట ఉండొద్దని సూచన.
Andhra Pradesh Rains Updates | అమరావతి: పశ్చిమమధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర నుండి తమిళనాడు వరకు ఒక ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు వస్తాయని, పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం వివిధ జిల్లాలకు అలర్ట్లను జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు.. పిడుగులు పడే అవకాశం
ఈ ద్రోణి ప్రభావం కారణంగా సోమవారం నాడు (జూన్ 15న) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే శ్రీకాకుళం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
పశ్చిమమధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర నుండి తమిళనాడు వరకు
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 14, 2026
ద్రోణి విస్తరించి ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
దీని ప్రభావంతో సోమవారం మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి pic.twitter.com/9qSQtkYspU
వాతావరణంలో మార్పులు, వర్షాల తీవ్రతను బట్టి విపత్తు నిర్వహణ సంస్థ జిల్లాల వారీగా అలర్ట్లు జారీ చేసింది.
రెడ్ అలర్ట్ : శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈ జిల్లాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఆరెంజ్ అలర్ట్ : అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఎల్లో అలర్ట్ : కాకినాడ, తూర్పు గోదావరి, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు ఎవరూ బయట తిరగవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, పట్టణాల్లో భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
Frequently Asked Questions
ఆంధ్రప్రదేశ్లో వాతావరణ మార్పులకు కారణం ఏమిటి?
ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు మరియు అక్కడ ఎలాంటి వర్షాలు పడతాయి?
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
బయట తిరగవద్దు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలి.
ఈ వాతావరణ హెచ్చరికను ఎవరు జారీ చేశారు?
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఈ వాతావరణ హెచ్చరికలను జారీ చేశారు.
ట్రెండింగ్ వార్తలు























