అన్వేషించండి

Supreme Court: ఇష్టపూర్వకంగా సహజీవనం చేసి, అత్యాచారమంటే కుదరదు-సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

ఇష్టపూర్వకంగా సహజీవనం చేసి, మనస్పర్దలు రాగానే అత్యాచార కేసు పెట్టటం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

నాలుగేళ్లు కలిసుండి, ఇప్పుడు కేస్ పెడితే ఎలా: సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టు ఓ సంచలన తీర్పునిచ్చింది. మహిళ ఇష్టపూర్వకంగా ఓ వ్యక్తితో సహజీవనం చేశాక, ఏదో ఓ కారణంగా గొడవైతే....ఆ వ్యక్తిపై అత్యాచార కేసు పెట్టటం సరికాదని తేల్చి చెప్పింది. జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ కేసుని విచారించే సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఓ మహిళ నాలుగేళ్ల పాటు ఓ వ్యక్తితో సహజీవనం చేసి, మనస్పర్ధలతో విడిపోయాక అతనిని అత్యాచార కేసు పెట్టింది. నాలుగేళ్ల క్రితం అతనితో సహజీవనం సాగించే సమయానికి, పిటిషన్‌దారుకి 21 ఏళ్లున్నాయని గుర్తు చేసింది ధర్మాసనం. ఇష్టపూర్వకంగానే అతనితో సహజీవనం చేసిందని, ఇప్పుడు ఉన్నట్టుండి అత్యాచార కేసు పెట్టడం కోర్టు ఒప్పుకోదని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయటమూ సరికాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అన్సార్ మహమ్మద్‌...ప్రి అరెస్ట్ బెయిల్ వారెంట్ ఇవ్వాలని రాజస్థాన్‌ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే రాజస్థాన్ న్యాయస్థానం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఫలితంగా... సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు అన్సార్. 

అందుకే బెయిల్ ఇవ్వలేదు: రాజస్థాన్ హై కోర్టు

ప్రస్తుతానికి సర్వోన్నత న్యాయస్థానం అన్సార్ మహమ్మద్‌కు యాంటిసిపేటరీ బెయిల్ జారీ చేసింది. అదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. "రాజస్థాన్ హైకోర్ట్‌లో ఉన్న అప్పీల్‌కు కూడా అనుమతినిస్తున్నాం. ప్రస్తుతానికైతే బెయిల్‌పై అతడిని విడుదల చేయాలని ఆదేశిస్తున్నాం" అని చెప్పింది. ప్రీ అరెస్ట్ బెయిల్ అప్లికేషన్‌ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఈ విచారణ చేపట్టామని గుర్తు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తదుపరి విచారణ కొనసాగించాలని స్పష్టం చేసింది. అంతకు ముందు రాజస్థాన్‌ కోర్ట్ బెయిల్‌ ఎందుకు తిరస్కరిస్తున్నారో వివరించింది. "ఇద్దరూ నాలుగేళ్ల పాటు సహజీవనం చేశారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి, మహిళను పెళ్లాడతానని మాటిచ్చాడు. వీరిద్దరికీ ఓ అమ్మాయి కూడా పుట్టింది. ఈ కేసులోని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, యాంటిసిపేటరీ బెయిల్‌ ఇవ్వటం కుదరదని స్పష్టం చేస్తున్నాం. అందుకే ఈ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాం" అని రాజస్థాన్ హైకోర్ట్ వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు మహిళలు ఉద్దేశపూర్వకంగా, ఇలాంటి కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు వాదిస్తున్నారు. మాయమాటలు చెప్పి, చివరకు మోసం చేసి,సెక్షన్ల పేరు చెప్పి తప్పించుకుంటున్నారని ఇంకొందరు మండిపడుతున్నారు. 
నిజానికి ఈ రెండు వాదనల్లోనూ నిజముంది. కానీ, న్యాయస్థానాలు అన్ని విధాల విచారణ జరిపాకే తీర్పునిస్తాయని, ఆ తీర్పుని గౌరవించక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి. 

 Also Read: How much alcohol is unsafe : మద్యం తాగడం అందరికీ హానికరం కాదు కానీ షరతులు వర్తిస్తాయి ! ఇవిగో ఆశ్చర్యపోయే వాస్తవాలు


 


 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Embed widget