అన్వేషించండి

Go Goa Gone: టూరిస్టులు లేక బోసిపోతున్న గోవా - బోర్ కొట్టేసిందా ? కొట్టి చంపుతూంటే ఎవరైనా వెళ్తారా?

Goa tourism: గోవా టూరిజానికి అత్యంత గడ్డు పరిస్థితి కనిపిస్తోంది. పర్యాటకులు ఏకంగా అరవై శాతం తగ్గిపోయారు. అసలు గోవాలో ఏం జరుగుతోంది ?

Why is Goa tourism dying: డిసెంబర్ 31 పార్టీ అంటే మన దేశంలో ఎక్కడెక్కిడి టూరిస్టు ప్రాంతాలు కూడా కిక్కిరిసిపోతాయి. మరి గోవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ అసలు వాస్తవం ఏమింటే ఈ సారి గోవాలో అసలు సందడే లేదు.  ఈ డిసెంబర్ 31కి.. 2025కి కొత్త ఏడాదికి ఆహ్వానించే పండుగకు.. గోవా బోసిపోయింది.  పర్యాటకులు అసలు సాధారణంగా వచ్చే అంత మంది కూడా రాలేదు. దీంతో రిసార్టులు, హోటల్స్ సహా బీచ్‌లు అన్నీ ఖాళీగా ఉన్నాయి.  గోవాలో పరిస్థితి మారిపోయిందని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. 

అరవై శాతం తగ్గిపోయిన పర్యాటకులు

గోవాలో డిసెంబర్ 31 పార్టీకి మాత్రమే గోవాకు పర్యాటకులు వెళ్లలేదనడం  కరెక్ట్ కాదు. మొత్తం లెక్కలు చూస్తే  గత ఏడాది మొత్తం మీద గోవాకు వచ్చే పర్యాటకులు ఏకంగా అరవై శాతం తగ్గిపోయారు. గోవాకు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తూంటారు. సగటున ఏడాదికి పది లక్షల మంది గోవాకు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు. 2024లో అలా వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య కేవలం 4 లక్షలు మాత్రమే అంటే నమ్మి తీరాలి. ఎందుకంటే ఇవి ప్రభుత్వం చెబుతున్న వాస్తవాలు.  

 

 

పర్యాటకుల్ని దోచుకోవడమే మైనస్ ! 

1990  నాటికి గోవా ప్రపంచంలోనే ప్రముఖ టూరిజం స్పాట్ గా మారిపోయింది. పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అదే సమంయలో దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరరగడం, గోవాలో ఎంజాయ్ మెంట్ గురించి విస్తృతంగా ప్రచారం జరగడంతో దేశీయ పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరిగింది.  కొన్ని అవలక్షణాలు కూడా పెరిగిపోవడంతో  పతనం ప్రారంభమయింది.   టూరిస్టుల మీద ఆధారపడి వ్యాపారం చేసే వారు ... పర్యాటకుల్ని తమ దోపిడీ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎయిర్ పోర్టులో లేదా రైల్వే స్టేషన్ లో దిగిన దగ్గర నుంచి టాక్సీ సహా హోటల్ మాపియా వరకూ దోపిడీ చేసి వదిలి పెడుతుంది. అందుకే టూరిస్టులు రాను రాను తగ్గించారు. 

తెలుగు యువకుడ్ని కొట్టి చంపిన మాఫియా - అలాంటివి ఎన్నో ఘటనలు 

పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే డిసెంబర్ 31న హోటల్ రేట్లు ఎక్కువ ఎందుకు వేశారని అడిగినందుకు తెలుగు యువకుడైన తాడేపల్లిగూడెంకు చెందిన రవితేజ అనే యువకుడ్ని కొట్టి చంపారు. గోవా ఆర్థిక వ్యవస్థ కూడా టూరిజం మీదనే ఆధారపడి ఉంటుంది. అక్కడి ప్రజల్లో 35 శాతం పర్యాటచకులు ఎక్కువగా వస్తేనే లాభపడుతారు. అయితే అలాంటి చోట్ల కూడా పర్యాటకుల్ని దోపిడీ చేయడానికి సిద్దపడటంతో చాలా మంది వేరే వేరే టూరిజం ప్రాంతాలు చూసుకుంటున్నారు. అందుకే గోవాకు వచ్చే పర్యాటకులు తగ్గిపోయారు. 

వియత్నాం, శ్రీలంకకు టూరిస్టుల ప్రాధాన్యం 

చివరికి దేశీయ పర్యాటకులు కూడా ఎక్కువగా వియత్నాం, ధాయ్ లాండ్, శ్రీలంకలకు వెళ్లారు.   పరిస్థితి చూస్తూంటే.. గోవా టూరిజం అవసాన దశకు చేరిందని అర్థమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదని మొత్తం ప్రపంచ పర్యాటక రంగమే స్లోగా ఉందని అ ప్రబావం గోవాపై పడిందని అంటున్నారు. 2025లో గోవాకు పర్యాటకులు పెరగాలంటే ఎన్నో సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటున్న అభిప్రాయం వినిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Snake In Meeting: కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
Israel Strike On Iran: ప్లీజ్ మమ్మల్ని కాపాడండి.. భారత ప్రభుత్వాన్ని కోరిన టెహ్రాన్‌లో చిక్కుకున్న విద్యార్థి
ప్లీజ్ మమ్మల్ని కాపాడండి.. భారత ప్రభుత్వాన్ని కోరిన టెహ్రాన్‌లో చిక్కుకున్న విద్యార్థి
AP Free Bus: దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
దివ్యాంగులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget