అన్వేషించండి

Visakha Student Death Case: విశాఖ రైల్వే ట్రాక్‌పై విద్యార్థి మృతదేహం - అమ్మానాన్న సారీ అని ఫోన్లో మెస్సేజ్‌లు

Visakha Student Death Case: విశాఖ రైల్వేట్రాక్ సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Visakha Student Death Case: విశాఖపట్నం జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ఓయువకుడి మృతదేహం లభ్యమైంది. ఆ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

విశాఖకు చెందిన పవన్ అనే యువకుడు దాకరమర్రి రఘు ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రోజూలాగే కళాశాలకు వెళ్లిన పవన్ తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు చాలా చోట్ల వెతికారు. ఇదే క్రమంలో పవన్ మృతదేహం మర్రిపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో దొరికింది. విషయం గుర్తించిన జీఆర్పీ పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి వద్ద కళాశాలకు చెందిన బ్యాగు ఉండడంతో అతడి వివరాలను గుర్తించగలిగారు. అలాగే పవన్ తల వెనుక భాగంలో ఆరంగులాల గాయం ఉందని, ముఖం, ఎడమ భూజంపైన తీవ్ర గాయాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. పవన్ ఫోన్ ను తీసుకొని చూడగా.. అతని తల్లిదండ్రులకు పంపించిన మెసేజ్ కనిపించింది. దాన్ని చూస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్న అర్థం అవుతుంది 

మెసేజ్ లో ఏముందంటే..?

"అమ్మానాన్న సారీ.. నావల్ల ఎప్పటికైనా మీకు బాధలు తప్పవు. నాకు ఇచ్చిన 6 వేలు, అన్నయ్యకి  మొబైల్ ఫోన్ కోసం ఇచ్చిన 7 వేలు వాడేశాను. లక్ష రూపాయల వరకు అప్పులు చేశాను. నావల్ల మీకు భవిష్యత్తులో కూడా బాధలే ఉంటాయి. అమ్మా, నాన్న లవ్ యూ"... అంటూ పవన్ మొబైల్లో మెసేజ్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. దీన్ని బట్టి పవన్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. 

విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు

విశాఖ మధురవాడలో రెండు రోజుల కిందట కలకలం రేపిన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ప్లాస్టిక్ డ్రమ్ లో కుళ్లిపోయిన స్థిలో మహిళ మృతదేహం కనిపించడం తెలిసిందే. రిషి అనే వ్యక్తి ఈ మహిళను హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. మృతురాలని శ్రీకాకుళం జిల్లా కు చెందిన బమ్మిడి ధనలక్ష్మి గా పోలీసులు గుర్తించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసు కస్టడీ కి తీసుకుని విచారిస్తున్నారు.

బస్టాండ్‌లో పరిచయం, ఓసారి రూమ్‌కు తీసుకొచ్చి.. 

ఏడాదిన్నర కిందట శ్రీకాకుళం బస్ స్టాప్ లో రిషికి, ధనలక్ష్మి కి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో మధురవాడలో అద్దెకు ఉన్న ఇంటికి ఓసారి ఆమెను తీసుకువచ్చి శారీరకంగా కలిశాడు రిషి. ఆ పరిస్థితిని ఆసరాగా తీసుకుని రిషిని డబ్బులు డిమాండ్ చేసేది ధనలక్ష్మి. కొంతకాలానికి విషయం చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుందని ఆందోళన చెందిన రిషి.. చున్నీని మెడను బిగించి ధనలక్ష్మిని హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అయితే శవాన్ని ఇంట్లో దాచిపెట్టిన రిషి ఆ తరువాత మృతదేహాన్ని నీటి డ్రంలోకి మార్చాడు. ఇంటి యజమానికి భార్య డెలివరీ కి వెళ్ళింది వచ్చిన తర్వాత అద్దె చెల్లిస్తామని దాటవేస్తూ వచ్చాడు నిందితుడు.

ఏడాది నుంచి అద్దె రాకపోవడం, ఇల్లు కూడా ఖాళీ చేయక పోవడంతో సామాన్లు బయటికి పడేసేందుకు ఇంటి ఓనర్ రమేష్ వెళ్లి చూసి షాకయ్యాడు. ఊహించని విధంగా మహిళ హత్య జరిగిన విషయాన్ని గుర్తించాడు రమేష్.  తీసేందుకు రమేష్ వెళ్లడంతో బయటపడ్డ హత్య. పోలీసులకు ఇంటి ఓనర్ సమాచారం అందించడంతో హత్య విషయం వెలుగుచూసింది. ధనలక్ష్మి మృతదేహాన్ని బయటకు తరలించలేక నిందితుడు ఇంట్లోని నీటి డ్రంలో వదిలేసినట్టు భావిస్తున్నారు. మృతురాలు ధనలక్ష్మి గా నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు నమూనాలు పంపిస్తున్నాం అని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీపీ శ్రీకాంత్ చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
Peddi Ticket Price Hike In Telangana:
Peddi Ticket Price Hike In Telangana: "పెద్ది"కి గుడ్ న్యూస్- తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు
ABP Desam Top 10, 2 June 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 2 June 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Ticket Price Hike In Telangana:
Peddi Ticket Price Hike In Telangana: "పెద్ది"కి గుడ్ న్యూస్- తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Embed widget