By: Ram Manohar | Updated at : 22 Mar 2023 12:05 PM (IST)
కశ్మీర్లోని అనంత్నాగ్లో భూమి కంపిస్తుండగానే వైద్యులు ఓ మహిళకు డెలివరీ చేశారు. (Image Credits: Twitter)
Viral Video:
ఉత్తర భారతంలో భూకంపం..
ఉత్తర భారతం భూకంపంతో వణికిపోతోంది. అర్ధరాత్రి పూట ఒక్కసారిగా భూమి కంపించింది. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడుపుతున్నారు అక్కడి ప్రజలు. జమ్ముకశ్మీర్లోనూ పలు ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా వైద్యులు మాత్రం ఏ మాత్రం భయపడకుండా చికిత్స అందిస్తున్నారు. తమ ప్రాణాలన్నీ లెక్క చేయకుండా రిస్క్ తీసుకుంటున్నారు. జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్లో భూమి కంపిస్తుండగానే వైద్యులు ఓ మహిళకు డెలివరీ చేశారు. సిజేరియన్ చేసే సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. అయినా ఏ మాత్రం భయపడకుండా అక్కడే నిలబడిపోయారు. ఆపరేషన్ థియేటర్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడిపోయాయి. సర్జరీ మధ్యలో ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. కాసేపటికే పవర్ కూడా కట్ అయింది. ఆపరేషన్ థియేటర్ అంతా చీకటితో నిండిపోయింది. వెంటనే మెడికల్ స్టాఫ్ అంతా దేవుడిని ప్రార్థించడం మొదలు పెట్టారు. ఆ తరవాత కొద్ది సేపటికి కరెంట్ వచ్చింది. ఇదంతా జరుగుతున్నా వైద్యులు సర్జరీ ఆపలేదు. ఆ మహిళకు డెలివరీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Emergency LSCS was going-on at SDH Bijbehara Anantnag during which strong tremors of Earthquake were felt.
Kudos to staff of SDH Bijbehara who conducted the LSCS smoothly & Thank God,everything is Alright.@HealthMedicalE1 @iasbhupinder @DCAnantnag @basharatias_dr @DHSKashmir pic.twitter.com/Pdtt8IHRnh— CMO Anantnag Official (@cmo_anantnag) March 21, 2023
The doctors at a hospital in Bijbehara in #Kashmir's #Anantnag continued with a C-section surgery, with "Lailaha ilAllah Mohammad ur Rasoolullah" on their lips, while the earth shook during last night's powerful earthquake that rocked Afghanistan, Pakistan and India. ❤️ pic.twitter.com/ml1QNiNtz7
— Syed Hassan Kazim سید حسن کاظم (@kazimtweets) March 22, 2023
ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో పలు దేశాల్లో భూకంపాలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల స్వల్పంగా మరి కొన్ని చోట్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం కలుగుతోంది. భారత్లోనూ ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఢిల్లీ, NCRలో భూమి కంపించింది. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్లో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రెండు చోట్లా రిక్టర్ స్కేల్పై 6.6 తీవ్రత నమోదైంది. ఈ రెండు దేశాల్లోనే కాకుండా మరి కొన్ని దేశాల్లోనూ భూమి కంపించింది. తుర్క్మెనిస్థాన్, కజకస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, చైనా, కిర్గిజ్స్థాన్లోనూ ఈ ప్రభావం కనిపించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. రాత్రి 10 గంటలకు అఫ్గనిస్థాన్లో ఒక్కసారిగా భూమి కంపించినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. లగ్మన్ ప్రావిన్స్లో ఇద్దరు మృతి చెందినట్టు తెలిపారు. పాకిస్థాన్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ 13 ఏళ్ల బాలిక కూడా ఉంది. ఇల్లు కూలిపోయి పైకప్పు మీద పడటం వల్ల మృతి చెందింది. 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read: ఢిల్లీలో వేలాది "మోదీ హఠావో" పోస్టర్లు, నలుగురు అరెస్ట్ - సమర్థించిన ఆప్
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
Congress: నేను ఎటు పార్టీ మారితే అటు సీఎం అవుతారు! కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత
Couple Died With Heart Attack: గుండెపోటుతో నవదంపతుల మృతి, శోభనం గదిలో విగతజీవులుగా మారిన కొత్త జంట
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!
థాయ్ల్యాండ్లో భర్తతో ఎంజాయ్ చేస్తున్న అనసూయ - ఫిదా అవుతున్న ఫ్యాన్స్!